
రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జవాన్లను గౌరవించేందుకు రైళ్లల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. అయితే ఇది అందరికీ అందుబాటులో ఉండదు. కేవలం పురస్కార గ్రహీతలకు మాత్రమే ఈ సదుపాయం అమల్లో ఉంటుంది. ఎవరెవరికి ఇది అందుబాటులో ఉంటుంది..? ఎలా పొందాలి? అనేది చూద్దాం.
జవాన్లను గౌరవించేందుకు రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన జవాన్లకు గౌరవార్థంగా సూపర్ గిఫ్ట్ ప్రకటించింది. వీర పురస్కార గ్రహీతలకు రైల్వే ఏసీ కోచ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యం అందించనున్నారు. వారికి జీవితాంతం ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. సైనికులతో పాటు వారి కుటుంబాలకు కూడా ఉచిత జర్నీ వర్తిస్తుంది. సేవా పతక్, నౌసేనా పతక్, వాయుసేనా పతక్ వంటి పురస్కారాలు అందుకున్న సైనికులకు ఈ బెనిఫిట్ ఉంటుంది. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. పూర్తిగా డిజిటల్ విధానంలో దీనిని అమలు చేయనున్నారు. ఆన్లైన్లోనే టికెట్లను బుక్ చేసుకునే సదుపాయం కల్పించనున్నారు.




