
India vw West Indies ODI Squad Announcement Live Updates: వెస్టిండీస్తో జరగబోయే 3 వన్డేల సిరీస్ కోసం భారత జట్టును నేడు ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం బీసీసీఐ ఉన్నతాధికారుల ఎంపిక సమావేశం జరుగుతోంది. ఓ నివేదిక ప్రకారం, ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఒప్పందం ఈ నెల చివరలో ముగిసిపోనుంది. ఇదే అగార్కర్ కు చివరి ఎంపిక సమావేశం కావొచ్చు. వెస్టిండీస్ సిరీస్ కోసం జరిపే ఈ ఎంపిక సమావేశమే తనకు చివరిది కావొచ్చని అగార్కర్ తనకు సన్నిహిత వర్గాలతో చెప్పినట్లు ఆ నివేదికలో పేర్కొంది. అగార్కర్ ఏడాది పాటు ఒప్పందాన్ని పొడిగించుకుంటారని ముందుగా భావించినా, అయితే, రోహిత్ శర్మ భవిష్యత్తుపై ఇటీవల తలెత్తిన వివాదాలు, బీసీసీఐ ఉన్నతాధికారుల మధ్య సంబంధాలు చెడినట్లుగా కనిపిస్తోంది. దీంతో ఇదే ఫైనల్ సెలక్షన్ కావొచ్చని చెబుతున్నారు.





