
ఏపీ ప్రభుత్వం కీలక తీసుకుంది. ప్రజలకు తక్కువ ధరకే నిత్యావసర సరుకులు అందించేలా చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఇప్పటికే మినీ మార్టులు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. మినీ సూపర్ మార్కెట్ల తరహాలోనే ఉండే వీటిల్లో తక్కువ ధరకు సరుకులు అందిస్తోంది.
© 2026 nimisham.in

ఏపీ ప్రభుత్వం కీలక తీసుకుంది. ప్రజలకు తక్కువ ధరకే నిత్యావసర సరుకులు అందించేలా చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఇప్పటికే మినీ మార్టులు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసింది. మినీ సూపర్ మార్కెట్ల తరహాలోనే ఉండే వీటిల్లో తక్కువ ధరకు సరుకులు అందిస్తోంది.
ఏపీలోని ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. రేషన్ డిపోలు, రైతు బజార్లు ద్వారా 60 రకాల నిత్యావసర సరుకులు తక్కువ ధరలకే అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఏపీలోని రైతు బజార్లు, రేషన్ డిపోల ద్వారా ప్రజలకు చౌక ధరకే నిత్యావసర సరుకులు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉల్లిపాయలు, కందిపప్పు, పామాయిల్ వంటి సరుకులను అందించాలని సూచించారు. ఉల్లి నిల్వలు ఎంత ఉన్నాయి.. ఎంత అవసరం అనే దానిపై అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. నిత్యావసర సరుకులు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ద్రవ్యోల్బణం పెరగడానికి గల కారణాలను అంచనా వేయాలని అధికారులకు చంద్రబాబు సూచించారు.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.








