
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల (జూన్ 15, 16) పర్యటన నిమిత్తం సింగపూర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి తెలుగు ప్రజలు, ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) ఆయనకు అపూర్వ రీతిలో ఘన స్వాగతం పలికారు.చంద్రబాబు రాక గురించి తెలుసుకున్న తెలుగు ఎన్ఆర్ఐలు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి తరలివచ్చారు.
ముఖ్యమంత్రి పట్ల తమ అభిమానాన్ని చాటుకుంటూ సందడి చేశారు. వారి ఆప్యాయతకు స్పందించిన చంద్రబాబు, ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరిస్తూ, వారితో కలిసి ఫోటోలు దిగారు.ఈ సందర్భంగా చంద్రబాబు తనను కలవడానికి వచ్చిన తెలుగు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
"నాకు, నా బృందానికి ఘన స్వాగతం పలికిన తెలుగు ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు మీ కుటుంబాలతో కలిసి వచ్చి చూపిన ప్రేమ, ఆప్యాయత నాకు ఎంతో ఆనందాన్నిచ్చాయి. మీ అందరితో మాట్లాడటం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. మీలో ప్రతి ఒక్కరి మద్దతును ఎప్పటికీ మరువలేను" అని చంద్రబాబు పేర్కొన్నారు.రెండు రోజుల పాటు సింగపూర్లో జరగనున్న పలు అధికారిక కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు
.