
Jason Sanjay : తమిళనాడు సీఎం, స్టార్ హీరో విజయ్తో కుమారుడు జేసన్ సంజయ్ కు విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న రుమర్లకు ఫుల్ స్టాప్ పడింది. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో దీనిపై జోరుగా ప్రచారం జరుగుతోంది.
అలాగే విజయ్-సంగీత దంపతులు విడాకులు తీసుకోబోతున్నారంటూ భారీ ఎత్తున రూమర్స్ వైరల్ అయ్యాయి. అలాగే జేసన్ తన పేరులోని తండ్రి పేరు ఫస్ట్ లెటర్ 'V'ని తొలగించి, తల్లి పేరులో ఫస్ట్ లెటర్ 'S'ను చేర్చుకున్నాడనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ వార్తలపై జేసన్ ఎన్నడూ స్పందించలేదు. కానీ, తాజాగా లేటెస్టు వైరల్ వీడియోను చూస్తే అన్ని రూమర్స్కు ఫుల్స్టాప్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. జేసన్ సంజయ్.. 'సిగ్మా' సినిమా షూటింగ్ సందర్భంగా సీరియల్ నటుడు జెమిని మణి తన కొడుకుతో సెట్స్కు వచ్చారు. అక్కడ సరదాగా మాట్లాడుతూ.. జేసన్ తన చిన్ననాటి జరిగిన కిడ్నాప్ ఘటనను బయటపెట్టారు. ‘నేను 5వ తరగతి చదువుతున్న రోజులివి.. స్కూల్ వదిలిన తర్వాత బయట మా నాన్న కోసం చూస్తున్నాను. Read Also : Siya Goyal Lie Detector : కేతన్ కేసులో కొత్త ట్విస్ట్.. తోసింది ఎవరో క్లారిటీ లేదు.. సియాకు లై-డిటెక్టర్ పరీక్షే కీలకం..! అప్పుడు ఒక వ్యక్తి వచ్చి నన్ను ఎత్తుకుని కారు వైపు పరిగెత్తాడు. నిజంగానే నన్ను కిడ్నాప్ చేస్తున్నారనుకుని భయపడిపోయాను. ఆ సంఘటన గుర్తుకు వచ్చినప్పుడు చాలా భయంగా అనిపించేది. కానీ, పెద్దయ్యాక ఆ ఘటన పూర్తిగా మర్చిపోయాను. ఇప్పుడు షూటింగ్లో జెమిని మణి 'ఆ రోజు నిన్ను ఎత్తుకెళ్లింది నేనే' అని అనడంతో మళ్లీ అది గుర్తొచ్చింది’ అంటూ నవ్వుతూ జేసన్ చెప్పుకొచ్చాడు. కిడ్నాప్ సీక్రెట్ బయటపెట్టిన జెమిని మణి : జెమిని మణి ఈ సందర్భంగా సీక్రెట్ రివీల్ చేశారు. ‘అది కిడ్నాప్ కాదు.. హీరో విజయ్ను దగ్గరగా చూడాలనే సరదాగా చేశా.. అప్పట్లో జేసన్ అడయార్లోని ఓ స్కూళ్లో చదివేవాడు. విజయ్ చాలా సార్లు డ్రైవర్ లేకుండానే స్వయంగా వచ్చి కొడుకుని తీసుకెళ్లేవారు. 😍♥️ — TVK Virtual Warriors HQ (@TVKWarriorsHQ) June 30, 2026 ఒకరోజు స్కూల్ వాచ్మన్ జేసన్ను విజయ్ కారు దగ్గరకు తీసుకెళ్తుండగా మధ్యలో వచ్చి సంజయ్ను తీసుకుని విజయ్ కారు వైపు పరిగెత్తాను. కారు డోర్ ఓపెన్ చేయగానే విజయ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వెంటనే నవ్వుతూ నాతో మాట్లాడి బై చెప్పి వెళ్లారు" అని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో జేసన్ తన తండ్రి గురించి ఎంతో ప్రేమగా మాట్లాడడం, చిన్ననాటి జ్ఞాపకాన్ని నవ్వుతూ షేర్ చేయడం చూసి ఫ్యాన్స్ తండ్రీకొడుకుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఇదే సరైన సమాధానమని కామెంట్లు పెడుతున్నారు. అయితే, ఈ రూమర్స్పై విజయ్ ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. జేసన్ సంజయ్ దర్శకత్వంలో'సిగ్మా' మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ హై-స్టేక్స్ హీస్ట్ మూవీలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తోంది. రాజు సుందరం, అన్బు దాసన్, యోగ్ జేపి, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.