
Wednesday Tv Movies: బుధవారం, Sep 16.. టీవీ తెలుగు సినిమాలు
september 16 wednesday tv movies list telugu channels బుధవారం టీవీ ముందు కూర్చొని మంచి సినిమా చూడాలనుకునే ప్రేక్షకుల కోసం తెలుగు ఛానళ్లు మరోసారి వినోదాల విందు సిద్ధం చేశాయి.

september 16 wednesday tv movies list telugu channels బుధవారం టీవీ ముందు కూర్చొని మంచి సినిమా చూడాలనుకునే ప్రేక్షకుల కోసం తెలుగు ఛానళ్లు మరోసారి వినోదాల విందు సిద్ధం చేశాయి.

Brahmamudi Serial Todays Episode 1137 Septmeber 15th: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 14వ తేదీ ఎపిసోడ్ 1137లో ఏం జరిగిందంటే?
Brahmamudi Serial September 14th Episode: ఈరోజుటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్లో ఐశ్వర్య ఇందు వద్దకు వెళ్లి డబ్బులు అడుగుతుంది. కాలేజీ ఫీజు కట్టాలని, అది కడితేనే హాల్ టికెట్ ఇస్తారని చెబుతుంది. ఎంతని అడగ్గా ఐశ్వర్య రూ.50 వేలు అంటుంది. దీంతో అక్కడే ఉన్న రాజు.. నువ్వు నీ ఫ్రెండ్స్తో కలిసి ఎక్కడికో వెళ్లాలనుకుంటున్నావు, అందుకే ఇంతగానం అడుగుతున్నావని అంటాడు. దీంతో ఐశ్వర్య ఓ సీక్రెట్ రివీల్ చేసి.. ఇందు ముందే రాజును ఇరికిస్తుంది. అయినా చివరకు ఇందు డబ్బులు ఇవ్వనని తెగేసి చెప్పగా వెళ్లిపోతుంది. ఇలా ఈరోజ
Podarillu Serial Today Episode పొదరిల్లు సీరియల్లో సోమవారం నాటి ఎపిసోడ్లో చక్రి వేసిన ప్లాన్ ఫ్లాప్ అవుతుంది. నారాయణ వేసిన ప్లాన్కి గాయత్రి అడ్డుగా నిలుస్తుంది. తాయారును రెచ్చగొట్టి జయంతి అమ్మ మీదకు ఉసిగొల్పాలని నారాయణ ప్రయత్నిస్తాడు. కానీ మధ్యలో గాయత్రి వచ్చి అడ్డుకుంటుంది. ఇంకో వైపు కన్నా, కేశవ కూడా ఓ ప్లాన్ వేస్తాడు. నిశ్చితార్థం చేయడానికి వచ్చిన పంతుల్ని కొనేయాలని, అతని ద్వారా ఈ ఎంగేజ్మెంట్ ఆపాలని చూస్తారు కన్నా,కేశవ.
Ttd Cancelled Issuance Of Ssd Tokens In Tirupati From September 14 To September 19: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎస్ఎస్డీ టోకెన్ల జారీ నిలిపివేశారు. ఈ నెల 14 నుంచి 19 వరకు ఎస్ఎస్డీ టోకెన్లు రద్దు చేశారు. ఈ నెల 20న మళ్లీ ఎస్ఎస్డీ టోకెన్లు జారీ చేస్తారు.తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, శ్రీనివాసం అతిథి సముదాయాల్లో మరుసటి రోజు స్లాట్లకు సంబంధించి టోకెన్లు జారీ చేస్తున్న సంగతి తెలిసిందేే. తిరుమలలో బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

Brahmamudi Serial Todays Episode 1137 Septmeber 14th: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 14వ తేదీ ఎపిసోడ్ 1137లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 todays episode 778 Septmeber 14th, Karthika deepam 2 Serial Was Running Successfully on Star Maa Channel. Now Lets See This Serial Latest Episode. కార్తీక దీపం 2 సీరియల్ స్టార్ మా ఛానెల్లో విజయవంతంగా రన్ అవుతోంది. సెప్టెంబర్ 14వ తేదీన ప్రసారమయ్యే ఈ సీరియల్ తాజా ఎపిసోడ్ను చూద్దాం

today rashiphalalu: On 14 September 2026 Ganesh Chaturthi, Brahma Yoga and Budhaditya Yoga bring special benefits for some rashis. Complete daily horoscope from Mesha to Meena with yogas and auspicious timings. సెప్టెంబర్ 14 వినాయక చవితి నాడు బ్రహ్మ యోగం, బుధాదిత్య యోగంతో కొన్ని రాశులకు ప్రత్యేక శుభ ఫలితాలు. మేషం నుంచి మీనం వరకు అన్ని రాశుల రాశిఫలం, యోగాలు, శుభ సమయాలు తెలుసుకోండి.
today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, భాద్రపద మాసంలోని తదియ, చవితి తిథి నాడు, సోమవారం ఈరోజున అభిజిత్ ముహుర్తం, యమగండం, సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్లపై అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మిస్తున్న చిత్రం ‘మా రాముడు అందరివాడు’. యద్దనపూడి మైకిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీరామ్, స్వాతి మందాడి జంటగా నటించారు. సుమన్, సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్ కీలక పాత్రల్లో నటించారు. ఆనంద భారతి, గడ్డం నవీన్, చిట్టిబాబు, గోల్డ్ రెడ్డి ఇతర పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన నిర్మాత వెంకట్ దుగ్గిరెడ్డి, దర్శకుడు శ్రీనివాస తేజ ఈ చిత్రం ఘన విజయం సాధించి మూవీ టీమ్కు మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుతూ టీమ్కు బెస్ట్ విషెస్ అందించారు. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు సుమన్ మాట్లాడుతూ ..‘‘సినీ ఇండస్ట్రీలో గ్లామర్ కంటే టాలెంట్ ముఖ్యమని ఇప్పటికే చాలామంది నిరూపించారు. ఈ సినిమా హీరో శ్రీరామ్లో కూడా మంచి టాలెంట్ ఉంది. డ్యూయెల్ రోల్లో ఆయన పెర్ఫార్మెన్స్ బాగా చేశారు. ఇందులో నా పాత్ర చాలా డిఫరెంట్గా ఉంటుంది. ముఖ్యమంత్రిగా మంచి మెసేజ్ ఇచ్చే పాత్రలో కనిపిస్తాను. దర్శకుడు మైకిల్ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. నిర్మాత లక్ష్మణ్ గారు ఇందులో విలన్గా కూడా నటించారు. ఆయన యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఇది చాలా మంచి కథ. ట్విస్టులు ఇంటరెస్టింగ్గా ఉంటాయి. కచ్చితంగా అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే మరింతమంది కొత్త నటీనటులు, కొత్త నిర్మాతలు ఇండస్ట్రీకి వస్తారు”అని అన్నారు. నిర్మాత అనుముల లక్ష్మణరావు మాట్లాడుతూ..‘‘మా సినిమా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. ఈ చిత్రాన్ని నిర్మిస్తూనే, ఇందులో విలన్ పాత్ర పోషించా. ఫస్టాఫ్లో వైల్డ్ విలన్గా కనిపిస్తా. 20 ఏళ్లు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు, చంద్రుల కలయిక వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఇది వ్యక్తుల జీవితంలో అదృష్టం, సంపద, కీర్తి, పురోగతి వంటి సానుకూల మార్పులను తెస్తుంది. ముఖ్యంగా, గజకేసరి యోగం ఏర్పడినప్పుడు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. సమాజంలో గౌరవం, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటాయని నమ్మకం. పండితుల ప్రకారం సెప్టెంబర్ 7 చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే ఆ రాశిలో ఉన్న గురుడితో కలిసి గజకేసరి యోగం ఏర్పరుస్తాడు. చంద్రుడికి సొంత రాశి అయిన కర్కాటకంలో ఈ యోగం ఏర్పడటం వల్ల 5 రాశులవారి అదృష్టం రెట్టింపవుతుంది. మరి ఆ రాశులేవో తెలుసుకోండి. వృషభ రాశి వారికి గజకేసరి యోగం ఆర్థికంగా మంచి రోజులు తీసుకురానుంది. ఆదాయాన్ని పెంచే కొత్త మార్గాలు కనిపిస్తాయి. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు, కష్టానికి సరైన గుర్తింపు లభిస్తుంది. ఊహించని విధంగా కొత్త బాధ్యత లేదా ముఖ్యమైన అవకాశం మిమ్మల్ని వరించవచ్చు. వ్యాపారం చేసే వారికి కొత్త కస్టమర్లు లేదా బిజినెస్ కాంటాక్ట్ల ద్వారా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఇంటికి సంబంధించి చాలా రోజులుగా ప్లాన్ చేస్తున్న కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేసే అవకాశం ఉంది. మకర రాశి వారికి గజకేసరి యోగం అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇప్పటివరకు మనసులో ఉన్న గందరగోళం తగ్గి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా కాలంగా ఉన్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. భాగస్వామితో ఉన్న అభిప్రాయ భేదాలు తగ్గి, అవగాహన పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మద్ధతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తుంది. ఆదాయం, పొదుపు సంబంధిత విషయాలలో సానుకూల మార్పులు వస్తాయి. కన్య రాశి వారికి ఈ గజకేసరి యోగం పురోగతికి కొత్త దారులు తెరుస్తుంది. ముఖ్యంగా డబ్బు, భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించి
September 2026 Festivals : హిందూ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ మాసంలో శ్రీ క్రిష్ణాష్టమి, వినాయక చవితి వంటి పెద్ద పండుగలొచ్చాయి. ఇదే సమయంలో ఉపవాస దీక్షలు చేపట్టనున్నారు. మరో విశేషం ఏంటంటే, పితృ పక్షం కూడా ఈ నెలలోనే ప్రారంభం కావడం విశేషం. అంతేకాదు ఈ మాసంలోనే విశ్వ గురు జయంతి, గురు ప్రదోష వ్రతం వంటి విశేషమైన పండుగలు రానున్నాయి. ఇదిలా ఉండగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం, తొమ్మిదో నెల అయిన సెప్టెంబర్ మాసంలో ప్రధానమైన పండుగలు ఏయే తేదీల్లో వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.శ్రీ క్రిష్ణా జన్మాష్టమి, సెప్టెంబర్ 4ఈ నెలలో సెప్టెంబర్ 4వ తేదీన శుక్రవారం నాడు శ్రీ క్రిష్ణాష్టమి వేడుకలను జరుపుకుంటారు. అంతకంటే ముందు సెప్టెంబర్ 2న బలరామ జయంతి జరుపుకోనున్నారు. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో క్రిష్ణ మాసంలో అష్టమి తిథి నాడు, రోహిణి నక్షత్రంలో కన్నయ్య జన్మదిన వేడుకలను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజునే క్రిష్ణుడు జన్మించాడని నమ్ముతారు.అజ ఏకాదశి, సెప్టెంబర్ 7అజ ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల అశ్వ మేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుంది. ఈ ఉపవాసం సమయంలో ఉపేంద్ర రూపమైన విష్ణువును పూజిస్తారు. ఈ వ్రతం చేయడం వల్ల రాజయోగం లభిస్తుంది.పొలాల అమావాస్య, సెప్టెంబర్ 11శ్రావణ అమావాస్యను పొలాల అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్యతోనే శ్రావణ మాసం ముగుస్తుంది. ఆ తర్వాత శ్రీ క్రిష్ణుడికి ఎంతో ఇష్టమైన భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో శ్రీ క్రిష్ణుడిని పూజిస్తారు. ఇదే సమయంలో పితురులకు తర్పణం సమర్పిస్తారు.గణేష్ చతుర్థి, సెప్టెంబర్ 11ఈ పవిత్రమైన రోజు నుంచి 10 రోజుల పాటు దేశవ్యాప్తంగా వినాయక ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో హిందువులలో చాలా మంది ఇళ్లలో వినాయకుడిని ప్రతిష్టించనున్నారు. ఈ సమయంలో వినాయకుడు భూలోకానికి వచ్చి భక్తుల బాధలను తొలగిస్తారని నమ్ముతారు.విశ్వ కర్మ జయంతి, సెప్టెంబర్ 17ప్రతి

ఇంటర్నెట్ డెస్క్: స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే (DMK) పార్టీపై తమిళనాడు సీఎం విజయ్ (CM Vijay) విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపిన రైతులు, ఉపాధ్యాయుల పట్ల అమానవీయంగా ప్రవర్తించారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం వారిపై పెట్టిన కేసులను పూర్తిగా ఎత్తివేస్తామని విజయ్ ఈ సందర్భంగా ప్రకటించారు. అసెంబ్లీలో సమావేశాల్లో భాగంగా సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘మే 2021- 2026 మధ్య సిప్కాట్ పారిశ్రామిక అభివృద్ధి, పరందూర్ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన రైతులు (Farmers), ఉపాధ్యాయులపై అనేక కేసులు నమోదయ్యాయి. అవి ఇప్పటికీ పెండింగ్లో ఉండటంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువల్లే ఆ కేసులను ఎత్తివేయాలని నిర్ణయించుకున్నాం. మా ప్రభుత్వం రైతులు, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లకు అండగా నిలుస్తుంది. ఇటువంటి చర్యల వల్ల సామాన్య ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది’’ అని విజయ్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్త సంక్షోభంలోనూ భారత్ పురోగమనం కాగా, ఇటీవల నీట్ పరీక్షకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులు, ఆందోళనకారులపైనా కేసులను ఉపసంహరించుకోవాలని సీపీఐ పార్టీ విజయ్ని కోరింది. అటు, నెయ్వేలి లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్ఎల్సి)కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిపై నమోదు చేసిన కేసులను వెనక్కి తీసుకోవాలని పీఎంకే విజ్ఞప్తి చేయడం గమనార్హం. అయితే, దీనిపై టీవీకే ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలో రూన్ నదిలో చిక్కుకున్న ఇద్దరిని ఆర్మీ హెలికాప్టర్ రక్షించింది
టీవీలో వినోదం అనేది ఎప్పుడూ దొరుకుతూనే ఉంటుంది. ఏ టైంలో అయినా సరే ఏ ఛానెల్ పెట్టినా బుల్లితెరపై ఛానెల్స్లో ఏదో ఒక సినిమా వస్తూనే ఉంటుంది. అలా బుల్లితెరపై 24 గంటలు వినోదానికి అయితే కొరత ఉండదు. ఇంట్లో ఉండే వారికి, మహిళలకు బుల్లితెర అనేది రిలాక్స్, ఎంటర్టైన్మెంట్ మోడ్ను ఇస్తుంది. ఇక రేపు అంటే గురువారం అన్ని ఛానెల్స్లో ప్రసారం అయ్యే సినిమాల లిస్ట్ ఓ సారి చూద్దాం.డీడీ యాదగిరి చానెల్లో మధ్యాహ్నం రెండు గంటలకు ఉడతా ఉడతా ఊచ్ రానుంది. ఈటీవీ ప్లస్లో రాత్రి తొమ్మిదిన్నరకి మీ శ్రేయోభిలాషి రానుంది. ఈటీవీలో మధ్యాహ్నం 12 గంటలకు, రాత్రి పదిన్నరకి సందడే సందడి రానుంది. ఈటీవీ సినిమాలో ఏడు గంటలకు ఓ చినదాన, ఉదయం 10 గంటలకు జగదేకవీరుని కథ, ఒంటి గంటకు మహానగరంలో మాయగాడు, సాయంత్రం నాలుగు గంటలకు మా ఆవిడ కలెక్టర్, ఏడు గంటలకు బలరామకృష్ణులు, రాత్రి పది గంటలకు గుండా, మిడ్ నైట్ ఒంటి గంటకు మళ్లీ ఓ చినదాన మూవీని రిపీట్ మోడ్లోనే ప్రసారం చేయనున్నారు.జెమినీ లైఫ్లో ఉదయం 11 గంటలకు 1940లో ఒక గ్రామం, సాయంత్రం నాలుగున్నరకి జగపతి చిత్రాలు రానున్నాయి. జెమిని టీవీలో ఉదయం 9 గంటలకు సాంబ, మూడు గంటలకు రచ్చ రానున్నాయి. జెమినీ మూవీస్లో మిడ్ నైట్ ఒకటిన్నరకి స్వప్నలోకం, ఉదయం నాలుగున్నరకి అందరూ దొంగలే, ఉదయం ఏడు గంటలకు రావుగారిల్లు, పది గంటలకు బిల్లా, ఒంటి గంటకు లోఫర్, నాలుగు గంటలకు పూలరంగడు, ఏడు గంటలకు సీమసింహం, రాత్రి పది గంటలకు వేటగాడు ప్రసారం కానున్నాయి.జీ తెలుగులో ఉదయం 9 గంటలకు నువ్వులేక నేనులేను, సాయంత్రం ఐదు గంటలకు పిండం రానున్నాయి. జీ సినిమాలు ఛానెల్లో ఉదయం 7 గంటలకు స్టూడెంట్ నెంబర్ 1, 9 గంటలకు మిస్టర్ మజ్ను, 12 గంటలకు హనుమాన్, 3 గంటలకు రంగ్
జ్యోత్స్నని సూరజ్ మోసం చేయడానికి, ఆమె పెళ్లి ఆగిపోవడానికి దీప, కార్తీక్లే కారణం అని శివన్నారాయణ అనడం కాదు.. దశరథ్ కూడా అదే మాట అనడంతో తల్లడిల్లిపోతారు దీప, కార్తీక్లు. ఈరోజు (సెప్టెంబర్ 02) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. ‘నా కుటుంబాన్ని ప్రమాదంలో పడేశారు. దీప... ఈ దశరథ్, సుమిత్రల కన్న కూతురని నేను ఈ జన్మలో నోరు తెరిచి చెప్పలేనమ్మా.. ఎందుకంటే జ్యోత్స్నకి అంత అన్యాయం చేశారు’ అని అంటాడు దశరథ. ఈ నిజం బయటపడిన రోజు సుమిత్ర ఆనంద పడదు.. బాధపడుతుంది. ఎందుకంటే.. అంత ప్రేమగా చూసుకున్న కూతురికి నువ్వే అన్యాయం చేశావ్ అని తెలిస్తే.. తట్టుకోలేదు. అప్పుడు నా భార్య నాకు శాశ్వతంగా దూరం అయిపోతుంది’ అని అంటాడు దశరథ. ఆ మాటతో దీప.. ‘మీరు నా జీవితంలో ఉన్నా లేకపోయినా మీరు బావుండాలనే నేను కోరుకునేది నాన్నా’ అని ప్రవచనం మొదలుపెట్టడంతో.. ‘నీతో నేను మాట్లాడలేనమ్మా’ అని దండం పెట్టేస్తాడు దశరథ. చూడు కార్తీక్.. నీ భార్యని తీసుకుని వెళ్లిపో.. అని అనేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు దశరథ. దాంతో దీప.. ఏంటి బావా ఇదీ?? నాన్న నన్ను ఇంత పరాయి దాన్ని చేసి మాట్లాడుతున్నాడు అంటూ కన్నీటిపర్యంతం అవుతుంది.నా కోసం.. నా ప్రేమ కోసం నువ్వు వస్తావని తెలుసు సూరజ్.. పరిస్థితులే అలా చేయిస్తున్నాయి.. మామయ్య పరిస్థితే ఇలా ఉంటే.. అక్కడ జ్యోత్స్న పరిస్థితి ఎలా ఉందో అని అంటాడు కార్తీక్. కట్ చేస్తే.. జ్యోత్స్న.. సూరజ్ విసిరి కొట్టిన తాళిని తీసుకుని కన్నీళ్లతో అతని ఊహల్లోనే ఉంటుంది. ఇంతలో సూరజ్ వస్తాడు. వచ్చావా సూరజ్.. నాకోసం వస్తావ్ అని తెలుసు.. నీ ప్రేమ నన్ను మార్చినప్పుడు.. నా ప్రేమ నిన్ను ఎందుకు మార్చదు అని అంటుంది జ్యోత్స్న. ‘లేదు.. నన్ను మర్చిపో అని చెప్పడానికి వచ్చాను’ అని అంటాడు సూరజ్. ‘నన్ను దూరం

ఎల్ఐసీ 70వ వార్షికోత్సవం సందర్భంగా రెండు కొత్త బీమా పథకాలను ప్రకటించింది. బీమా ప్లాటినమ్, జీవన్ రక్ష పేర్లతో తీసుకొచ్చిన ఈ పాలసీలు సెప్టెంబర్ 7, 2026 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ తన 70వ వార్షికోత్సవం సందర్భంగా రెండు కొత్త బీమా పథకాలను తీసుకొచ్చింది. ‘LIC బీమా ప్లాటినమ్’, ‘LIC జీవన్ రక్ష’ పేర్లతో వీటిని ప్రకటించింది. ఈ రెండు పాలసీలు సెప్టెంబర్ 7, 2026 నుంచి అందుబాటులోకి రానున్నాయి. LIC బీమా ప్లాటినమ్.. పొదుపుతో పాటు బీమా రక్షణ బీమా ప్లాటినమ్ నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్ వ్యక్తిగత బీమా పథకం. పొదుపు లక్ష్యంతో పాటు కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించేలా దీన్ని రూపొందించారు. పాలసీ వ్యవధిలో ముందుగానే నిర్ణయించిన గ్యారెంటీడ్ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ పాలసీలో ప్రీమియం చెల్లించే కాలంలో ప్రతి రూ.1,000 బేసిక్ సమ్ అష్యూర్డ్కు రూ.70 చొప్పున గ్యారెంటీడ్ అడిషన్ జమ అవుతుంది. ఈ పాలసీని 28 నుంచి 75 ఏళ్ల వయసు ఉన్నవారు తీసుకోవచ్చు. ప్రీమియం చెల్లింపు కోసం 7, 10, 12, 15 లేదా 18 ఏళ్ల ఆప్షన్లు ఉన్నాయి. పాలసీ టర్మ్ను 17, 20, 22, 25 లేదా 28 ఏళ్లలో ఎంచుకోవచ్చు. కనీస బీమా మొత్తం రూ.3 లక్షలు కాగా, గరిష్ఠ సమ్ అష్యూర్డ్పై పరిమితి లేదని సంస్థ పేర్కొంది. పాలసీ గడువు పూర్తయ్యే సమయానికి పాలసీదారుడు జీవించి ఉంటే.. బేసిక్ సమ్ అష్యూర్డ్తో పాటు అర్హత కలిగిన గ్యారెంటీడ్ అడిషన్లు అందుతాయి. పాలసీ కాలంలో పాలసీదారుడికి జరగరానిది ఏదైనా జరిగితే.. నిబంధనల ప్రకారం వార్షిక ప్రీమియానికి 11 రెట్లు లేదా బేసిక్ సమ్ అష్యూర్డ్, గ్యారెంటీడ్ అడిషన్లకు సంబంధించిన అర్హత మొత్తాల్లో ఎక్కువదాన్ని డెత్ బెనిఫిట్గా చెల్లిస్తారు. అదనంగా ఎల్ఐసీ పాలసీదారులకు రిబేట్లు, రుణ సదుపాయం, అవసరానికి అనుగుణంగా రైడర్లను జోడించుకునే అవకాశం

సమ్మెకు యూనియన్ల పిలుపు.. కీలక తేదీలు ఇవే సెప్టెంబర్లో వరుసగా 5 రోజులు సేవలకు బ్రేక్ 5 రోజుల బ్యాంకింగ్ కోసం ఉద్యోగుల సమ్మెబాట Bank Unions Strike : సెప్టెంబర్లో బ్యాంకులో ఏదైనా పని ఉందా? అయితే, ముందుగానే ప్లాన్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్లో రెండు విడతల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం, బ్యాంకు యాజమాన్యాల నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని యూనియన్లు హెచ్చరించాయి. మొదటి విడతగా సెప్టెంబర్ 11, 2026న ఒకరోజు దేశవ్యాప్త సమ్మె జరగనుంది. అనంతరం సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు 3 రోజుల సమ్మె కొనసాగనుంది. అప్పటికీ డిమాండ్లు పరిష్కారం కాకపోతే అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మె చేపట్టే అవకాశం ఉందని యూఎఫ్బీయూ తెలిపింది. Read Also : Xiaomi 17 Ultra Price : వారెవ్వా.. అమెజాన్ ఆఫర్ అదిరింది.. ఈ షావోమీ అల్ట్రా ఫోన్పై రూ. 10వేలు డిస్కౌంట్..! 5 రోజుల బ్యాంకింగ్ డిమాండ్ : బ్యాంకు ఉద్యోగులు 5 రోజుల బ్యాంకింగ్ వ్యవస్థ అమలు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మార్చి 8, 2024న కుదిరిన 12వ ద్వైపాక్షిక ఒప్పందం, 9వ జాయింట్ నోట్లో దీనికి అంగీకారం జరిగినప్పటికీ, రెండేళ్లకు పైగా నిర్ణయం పెండింగ్లో ఉందని యూనియన్లు చెబుతున్నాయి. శనివారం సెలవుకు బదులుగా సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజువారీ పని సమయాన్ని సుమారు 40 నిమిషాలు పెంచే ప్రతిపాదన ఉంది. పీఎల్ఐపై అభ్యంతరం : ప్రభుత్వం సవరించిన పనితీరు ఆధారిత ప్రోత్సాహక (PLI) విధానాన్ని ఉపసంహరించాలని కూడా యూనియన్ డిమాండ్ చేస్తోంది. సీనియర్ అధికారులకు, ఇతర ఉద్యోగులకు ప్రోత్సాహకాలలో వ్యత్యాసం ఉందని, తగినంత సంప్రదింపులు లేకుండానే విధానాన్ని
గత కొన్ని నెలలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోతోంది. ప్రేక్షకులు ఎప్పటిలాగే థియేటర్లకు వస్తుండటం, ప్రతీ నెల రెండు మూడు బ్లాక్ బస్టర్ హిట్లు పడుతుండటంతో ఇండస్ట్రీలో నూతనోత్సవం వచ్చింది. ఒకప్పుడు సినిమాలను రిలీజ్ చేయడానికి ఆలోచించిన దర్శక నిర్మాతలు.. ఇప్పుడు ప్రతీ వారం పోటీపడి మరీ సినిమాలు విడుదల చేస్తున్నారు. ఆగస్టు నెలలో వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'.. సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్'.. రవితేజ 'ఇరుముడి' సినిమాలు ఘన విజయం సాధించాయి. మధ్యలో 'హుషార్ పిట్టలు' కూడా మంచి కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. దీంతో ఇప్పుడు సెప్టెంబర్ సినిమాలపై అందరి దృష్టి పడింది.సెప్టెంబర్ నెలలోనూ ప్రేక్షకులను వినోదాన్ని పంచడానికి పలు క్రేజీ చిత్రాలు రెడీ అయ్యాయి. స్ట్రెయిట్ తెలుగు సినిమాలు, డబ్బింగ్ చిత్రాలు కలుపుకొని మొదటి వారంలో అర డజనుకు పైగా మూవీస్ థియేటర్లలోకి వస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగా సమర్పిస్తున్న రొమాంటిక్ డ్రామా 'రోమాంచకం'.. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన 'ఐ యామ్ గేమ్' చిత్రాలు సెప్టెంబర్ 3న రిలీజ్ కాబోతున్నాయి. మరుసటి రోజు నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన 'బెత్లెహోమ్ కుటుంబ యూనిట్' సినిమా విడుదల కానుంది. 'మీర్జాపూర్', 'సహ: లైఫ్ ఆఫ్ సంజు', 'మా అందాల రాముడు', 'ధర్మస్థల నియోజకవర్గం' వంటి చిత్రాలు కూడా ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అల్లరి నరేష్ 'రంభ ఊర్వశి మేనక' మూవీ కూడా ఈ వీక్ లోనే రావాల్సింది. కానీ సెన్సార్ ఇబ్బందులు వల్ల విడుదలపై సందిగ్దత నెలకొంది.సెప్టెంబర్ రెండో వారంలో వినాయక చవితి పండగ సందర్భంగా మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి. కార్తి ‘సర్దార్’.. సుహాస్ - సూరి ప్రధాన పాత్రల్లో నటించిన ‘మండాడి’.. సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’.. ఆనంద్ దేవరకొండ 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్'.. ఫహాద్ ఫాజిల్ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'.. మాధవ్ ‘మారెమ్మ’ సినిమాలు సెప్టెంబర్

టెక్ ప్రపంచంలో సెప్టెంబర్ నెలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ నెల నుంచి పండుగల సీజన్ ప్రారంభమవుతుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థలు తమ నయా ఫ్లాగ్షిప్, మిడ్-రేంజ్ ప్రొడక్ట్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సమాయత్తమయ్యాయి. వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హంగులు, అధునాతన కెమెరా సెన్సార్లు, శక్తివంతమైన ప్రాసెసర్లతో 10కి పైగా సరికొత్త స్మార్ట్ఫోన్లు ఈ నెలలో మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాయి. ఈ జాబితాలో ప్రతిష్టాత్మకమైన, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడల్ యాపిల్ ‘ఐఫోన్ 18 ప్రో’. ప్రతిసారి డిజైన్, సాంకేతికతలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే యాపిల్ ఈసారి ఏఐ ఏకీకరణ, అత్యంత నాణ్యమైన పెరిస్కోప్ లెన్స్, మెరుగైన బ్యాటరీ లైఫ్తో వినియోగదారులను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. యాపిల్ వార్షిక మెగా ఈవెంట్లో సెప్టెంబర్ ద్వితీయార్థంలో ఈ ఫోన్లు అధికారికంగా ఆవిష్కృతం కానున్నాయి. ఈ నెలలో మార్కెట్లోకి రానున్న కొన్ని మోడళ్లు కింది విధంగా ఉన్నాయి. కంపెనీలు ఇప్పటికే వీటి ఫీచర్లను ప్రకటించాయి. అయితే వీటి ధరలకు సంబంధించిన వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro): నెక్స్ట్-జెన్ A20 బయోనిక్ చిప్సెట్, అధునాతన ఏఐ ఫీచర్లతో రానుంది. వీవో T5 (Vivo T5): భారత మిడ్-రేంజ్ మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని అత్యుత్తమ డిజైన్, కెమెరా సామర్థ్యంతో బడ్జెట్ విభాగంలో పోటీకి దిగుతోంది. పోకో F9 (Poco F9): గేమింగ్ ప్రియులను ఆకట్టుకునేలా ఫాస్ట్ ఛార్జింగ్, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, తక్కువ ధరలో గరిష్ట పనితీరును అందించనుంది. శామ్సంగ్, వన్ప్లస్, రియల్మీ, షావోమీ సంస్థలు కూడా తమ సరికొత్త వేరియంట్లను ఈ సెప్టెంబర్లో ఆవిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాయి. మొత్తానికి, సెప్టెంబర్ 2026 స్మార్ట్ఫోన్ పరిశ్రమకు అత్యంత కీలకమైన నెలగా మారనుంది. మీ పాత ఫోన్ను అప్గ్రేడ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ నెలలో రాబోయే ఈ సరికొత్త

తెలంగాణలో మరో విమానాశ్రయం నిర్మాణానికి కేంద్రం సిద్ధమవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్త ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉన్న ఈ ప్రాంత ప్రజల సౌకర్యార్థం తప్పకుండా విమానాశ్రయం నిర్మించాలని అధికారులను ఆదేశించారు.భద్రాద్రి కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ స్థల పరిశీలనకు రానున్న కేంద్ర సాంకేతిక బృందంఈ మేరకు నాలుగు నుంచి ఐదు ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించేందుకు కేంద్ర సాంకేతిక బృందం సెప్టెంబర్ 7న తెలంగాణలో పర్యటించనుందని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రితో భేటీ అయి, గతంలో పరిశీలించిన రెండు స్థలాలు సాంకేతిక కారణాలతో అనుకూలం కాకపోవడంతో కొత్తగా గుర్తించిన స్థలాల వివరాలు తెలిపారు.నివేదిక అనుకూలంగా వస్తే కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్యలుకొత్త స్థలాల్లో భౌగోళిక, వాతావరణ పరిస్థితులు, విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన సాంకేతిక అంశాలను బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది. వారి నివేదిక అనుకూలంగా వస్తే కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్యలు చేపడుతుందని తెలిపారు. ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు సాంకేతిక బృందాన్ని పంపించేందుకు చొరవ తీసుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి, కేంద్ర ప్రభుత్వానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు.ఈ ప్రాజెక్ట్ తీర్ధ యాత్రికులకే కాదు ప్రాంత అభివృద్ధికి కీలకం ఈ ప్రాజెక్టు భద్రాచలం తీర్థయాత్రికులు, స్థానిక ప్రజలకు గొప్ప ఉపయోగం చేకూర్చనుంది.సింగరేణి పారిశ్రామిక ప్రాంతంతో పాటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలం రామాలయం సందర్శనకు వచ్చే భక్తులకు, వ్యాపారవేత్తలకు ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఎంతో మేలు జరుగుతుంది. రవాణా సౌకర్యాలు మెరుగై, ఈ ప్రాంత సమగ్ర ఆర్థిక పురోగతికి బాటలు పడతాయని భావిస్తున్నారు.తెలంగాణలో కొత్త ఎయిర్ పోర్ట్ ల నిర్మాణానికి కేంద్ర సహకారం తెలంగాణా రాష్ట్రంలో కొత్త ఎయిర్ పోర్ట్ ల నిర్మాణానికి కేంద్రం నుండి సహకారం లభిస్తోంది, ఇప్పటికే వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ పూర్తి చేసి

వరుణ్ తేజ్ నటించిన హిట్ హారర్ కామెడీ చిత్రం కొరియన్ కనకరాజు ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. థియేటర్లలో మంచి విజయం సాధించిన ఈ చిత్రం సెప్టెంబర్ 4 నుంచి డిజిటల్లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వరుణ్ తేజ్ కెరీర్లో పెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది

రవితేజ ఇరుముడి సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. రెండు వారాలు గడిచినా హౌస్ఫుల్స్తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో సినిమా ఓటీటీ రిలీజ్ డేట్పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నెట్ఫ్లిక్స్ డిజిటల్ హక్కులను దక్కించుకుంది. థియేట్రికల్ రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదిరినప్పటికీ, సెప్టెంబర్ 18 తర్వాతే ఓటీటీ రిలీజ్ ఉండవచ్చని తెలుస్తోంది
పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా రేపు (సెప్టెంబర్ 2) బుల్లితెరపై పవర్ స్టార్ సినిమాలు సందడి చేయబోతోన్నాయి. మామూలుగానే ఏ టైంలో అయినా సరే ఏ ఛానెల్ పెట్టినా బుల్లితెరపై ఛానెల్స్లో ఏదో ఒక సినిమా వస్తూనే ఉంటుంది. అలా బుల్లితెరపై 24 గంటలు వినోదానికి అయితే కొరత ఉండదు. ఇంట్లో ఉండే వారికి, మహిళలకు బుల్లితెర అనేది రిలాక్స్, ఎంటర్టైన్మెంట్ మోడ్ను ఇస్తుంది. ఇక రేపు అంటే బుధవారం అన్ని ఛానెల్స్లో ప్రసారం అయ్యే సినిమాల లిస్ట్ ఓ సారి చూద్దాం.డీడీ యాదగిరి చానెల్లో ఉదయం 9 గంటలకు హాలీవుడ్ తెలుగు డబ్డ్ మూవీ ద బాయూ, రెండు గంటలకు నువ్వెక్కడుంటే నేనక్కడుంటా రానున్నాయి. ఈటీవీ ప్లస్లో రాత్రి తొమ్మిదిన్నరకి బీరువా రానుంది. ఈటీవీలో మధ్యాహ్నం 12 గంటలకు, రాత్రి పదిన్నరకి సుస్వాగతం రానుంది. ఈటీవీ సినిమాలో ఏడు గంటలకు అల్లుడి కోసం, ఉదయం 10 గంటలకు మంచి మనుషులు, ఒంటి గంటకు పిల్ల నచ్చింది, సాయంత్రం నాలుగు గంటలకు అల్లరి ప్రేమికుడు, ఏడు గంటలకు సుస్వాగతం, రాత్రి పది గంటలకు కృష్ణ నటించిన శక్తి, మిడ్ నైట్ ఒంటి గంటకు మళ్లీ అల్లుడి కోసం మూవీని రిపీట్ మోడ్లోనే ప్రసారం చేయనున్నారు

Janmashtami 2026 Holiday: శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. 2026లో జన్మాష్టమి సెప్టెంబర్ 4, శుక్రవారం రోజున వచ్చింది. దీంతో ఈ పండుగ సందర్భంగా స్కూళ్లు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉంటుందా అనే ఆసక్తి చాలామందిలో ఉంది. జన్మాష్టమి సందర్భంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో సెలవు ఉండే అవకాశం ఉంది. అయితే అన్ని రాష్ట్రాల్లో ఒకే విధమైన సెలవు ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ, స్కూల్ బోర్డు నిర్ణయాలను బట్టి సెలవు మారవచ్చు. అందుకే విద్యార్థులు తమ స్కూల్ హాలిడే క్యాలెండర్ను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 4న పలు ప్రాంతాల్లో బ్యాంకు శాఖలు మూసి ఉండనున్నాయి. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, కోల్కతా, లక్నో, జైపూర్, భువనేశ్వర్, చండీగఢ్, కోచి, పాట్నా, రాంచీ, తిరువనంతపురం, శ్రీనగర్ వంటి నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. బ్యాంకు పనులు ఉన్నవారు ముందుగానే తమ బ్రాంచ్కు సెలవు ఉందో లేదో తెలుసుకోవడం మంచిది. అయితే ఆన్లైన్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం వంటి సేవలు సాధారణంగా అందుబాటులో ఉంటాయి. జన్మాష్టమి సందర్భంగా పలు రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవు ఇవ్వనున్నారు. ముఖ్యంగా కృష్ణుడి జన్మస్థలమైన మథుర, వృందావన్ ప్రాంతాల్లో వేడుకలు ప్రత్యేకంగా జరుగుతాయి. ఉత్తరప్రదేశ్తో పాటు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కూడా జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తారు. అయితే ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ స్కూళ్లు, CBSE, ICSE, రాష్ట్ర బోర్డు పాఠశాలలకు సెలవుల విషయంలో తేడాలు ఉండవచ్చు. జన్మాష్టమి కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ సెలవుగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ కార్యాలయాలు కూడా కొన్ని ప్రాంతాల్లో మూసి ఉండవచ్చు. దీనిపై సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అధికారిక సెలవుల జాబితానే తుది నిర్ణయంగా భావించాలి. ఈసారి సెప్టెంబర్ 4 శుక్రవారం కావడంతో శని, ఆదివారాలు సెలవుగా ఉండే

Kayadu Lohar: ‘డ్రాగన్’ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అస్సామీ బ్యూటీ కయాదు లోహర్కు ఆ తర్వాత వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ‘డ్రాగన్’ తర్వాత ఆమె నటించిన తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడంతో.. ఆమె క్రేజ్పై ప్రభావం పడిందనే చర్చ సినీ వర్గాల్లో సాగుతోంది. అయితే ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం కయాదు లోహర్కు వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ నెలలో వరుసగా మూడు సినిమాలతో ఆమె ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘డ్రాగన్’ సినిమాతో కయాదు లోహర్కు తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంలో ఆమె నటన, గ్లామర్కు మంచి రెస్పాన్స్ రావడంతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్గా మారిపోయారు. ఆ తర్వాత టాలీవుడ్లో విశ్వక్ సేన్ నటించిన ‘ఫంకీ’లో కనిపించారు. అలాగే మలయాళంలో టోవినో థామస్ నటించిన ‘పల్లి చట్టంబి’, ‘ఇదయం మురళి’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. దీంతో ‘డ్రాగన్’ తర్వాత వరుసగా మూడు ఇండస్ట్రీల్లోనూ పరాజయాలు ఎదుర్కొన్న హీరోయిన్గా కయాదు లోహర్ పేరు వినిపించింది. అయితే సెప్టెంబర్ నెలలో ఈ పరిస్థితులు మారే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఈ నెలలో కయాదు నటించిన మూడు క్రేజీ ప్రాజెక్టులు వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సెప్టెంబర్ 3న దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం ‘ఐ యామ్ గేమ్’ విడుదల కానుంది. ఈ సినిమాలో కయాదు కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అనంతరం సెప్టెంబర్ 4న జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన ‘ఇమ్మోర్టల్’ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ రెండు సినిమాలు వాస్తవానికి ఆగస్టులోనే విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాలతో సెప్టెంబర్కు వాయిదా పడ్డాయి. ఇక కయాదు లోహర్కు అత్యంత కీలకమైన సినిమా ‘ది ప్యారడైజ్’

బ్యాంకులు 14 రోజులు సెలవులు.. రాష్ట్రాల వారీగా పూర్తి హాలిడే లిస్ట్ ఏపీ, తెలంగాణ సహా ఈ రాష్ట్రాల్లో బ్యాంకులకు వరుస సెలవులు సెప్టెంబర్ హాలిడే లిస్ట్ ప్రకటించిన రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా September 2026 Bank Holidays : సెప్టెంబర్లో బ్యాంకు పనులు పెట్టుకున్నారా? అయితే, ఇది మీకోసమే.. ఈ నెలలో బ్యాంకింగ్ పనులు ఉన్నవారు ముందుగానే ఏ రోజు బ్యాంకులకు సెలవు ఉందో తెలుసుకోవడం బెటర్. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పలు పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో బ్యాంకు శాఖలకు సెలవులు ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించిన సెలవుల క్యాలెండర్ ప్రకారం.. అన్ని రాష్ట్రాల్లో ఒకే రోజున బ్యాంకులు మూతపడవు. స్థానిక పండుగలు, ప్రాంతీయ (September Bank Holidays) కార్యక్రమాలను బట్టి ఆయా రోజుల్లో సెలవుల్లో మార్పులు ఉంటాయి. సెప్టెంబర్లో వచ్చే వినాయక చవితితో పాటు ఇతర పండుగ సెలవులు, సాధారణ వారాంతపు సెలవులతో కలిపి కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులకు మొత్తం 14 రోజుల వరకు సెలవులు ఉండనున్నాయి. అయితే, ఈ బ్యాంకు సెలవులన్నీ దేశవ్యాప్తంగా ఒకేలా ఉండవు. మీరు ఉండే ప్రాంతంలో మీ హోం బ్యాంకు బ్రాంచ్ కు వెళ్లే ముందు బ్యాంకు సెలవు జాబితాను చెక్ చేసుకోవడం ఎంతైనా మంచిది. సెప్టెంబర్లో వీకెండ్ హాలిడేస్ ఇవే : సెప్టెంబర్ 2026లో 4 ఆదివారాలు, రెండో, నాల్గవ శనివారాలు కలిపి మొత్తం 6 జనరల్ హాలిడేస్ ఉన్నాయి. సెప్టెంబర్ 6 : ఫస్ట్ ఆదివారం సెప్టెంబర్ 12: రెండో శనివారం సెప్టెంబర్ 13: రెండో ఆదివారం సెప్టెంబర్ 20: మూడో ఆదివారం సెప్టెంబర్ 26: నాల్గవ శనివారం సెప్టెంబర్ 27: నాల్గవ ఆదివారం పండుగలు, ప్రత్యేక సెలవులివే : సెప్టెంబర్ 4 – జన్మాష్టమి : జన్మాష్టమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, గుజరాత్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్

September New Rules: ప్రతి నెలా మొదటి తేదీ సామాన్యుడి ఆర్థిక పరిస్థితికి, దైనందిన జీవితానికి సంబంధించిన అనేక కొత్త మార్పులను తీసుకువస్తుంది. ఈ రోజు, సెప్టెంబర్ 1, 2026 నుండి, వంటగ్యాస్ ధరల నుండి విమాన ఛార్జీలు, అద్దె, కార్ల కొనుగోళ్ల వరకు దేశవ్యాప్తంగా అనేక ముఖ్యమైన మార్పులు అమల్లోకి వచ్చాయి. కొన్ని నిబంధనలు ఉపశమనం కలిగించినప్పటికీ, చాలా నిర్ణయాలు జేబుపై భారాన్ని పెంచడం ఖాయం. ఈ రోజు నుండి అమల్లోకి వచ్చిన ఈ ప్రధాన మార్పులను నిశితంగా పరిశీలిద్దాం. 1. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లు ఖరీదైనవిగా మారాయి: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోగ్రాముల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరను పెంచాయి. ఢిల్లీలో ఒక్కో సిలిండర్ ధర రూ.9.50 పెరిగి రూ.2,747.50కి చేరింది. అయితే, సాధారణ ప్రజలకు ఊరటనిస్తూ, 14.2 కిలోగ్రాముల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. 2. విమాన ఇంధనం (ATF) ధరలు పెరిగాయి: ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు 5.46% (సుమారుగా లీటరుకు రూ.6.28) పెరిగాయి. కొత్త ధరలు ఇప్పుడు లీటరుకు రూ.121.28 గా ఉన్నాయి. పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా, విమానయాన సంస్థలు భవిష్యత్తులో విమాన ఛార్జీలను పెంచే అవకాశం ఉంది. 3. ముంబైలో ఆటో, నలుపు-పసుపు టాక్సీ ఛార్జీలు పెరిగాయి: ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR) పరిధిలో ప్రయాణించే ప్రయాణికులు ఇకపై ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఆటో-రిక్షా కనీస ఛార్జీని రూ.26 నుండి రూ.27కు, నలుపు-పసుపు టాక్సీల ప్రారంభ ఛార్జీని రూ.31 నుండి రూ.33కు పెంచారు. ఈ కొత్త ఛార్జీలు మొదటి 1.5 కిలోమీటర్ల వరకు వర్తిస్తాయి. 4. టాటా, హ్యుందాయ్ కార్లను కొనడం మరింత ఖరీదైనది: మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఇకపై ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ముడిసరుకుల ఖర్చులు, ద్రవ్యోల్బణాన్ని కారణంగా చూపుతూ, టాటా మోటార్స్, హ్యుందాయ్ ఎంపిక చేసిన మోడళ్లపై రూ.25,000

దేశంలో వాతావరణం రూటు మార్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆగస్టు నెల ఉడుకెత్తిపోయింది. భారత వాతావరణ శాఖ (IMD) తెలిపిన వివరాల ప్రకారం 1901 నుంచి చూస్తే, అంటే గత 125 ఏళ్ల హిస్టరీలోనే ఈసారి ఆగస్టు అత్యంత వేడి నెలగా నమోదైంది. సాధారణంగా ఆగస్టులో వర్షాలు దంచి కొట్టాలి. కానీ ఈసారి వానలు తగ్గుముఖం పట్టి ఎండలు మండిపోయాయి. సెప్టెంబరు నెలలో కూడా పెద్దగా వర్షాలు పడేలా కనిపించడం లేదు. ఈ నెలలో కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని ఐఎండీ తన రిపోర్టులో స్పష్టం చేసింది. దీనికి ప్రధాన కారణం పసిఫిక్ మహాసముద్రంలో బలంగా మారిన 'ఎల్ నినో' అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఏడాది ఆగస్టులో దేశ వ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత 28.01 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇది సాధారణం కంటే 0.67 డిగ్రీలు ఎక్కువ. రాత్రి వేళల్లో ఉండే సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత కూడా 24.36 డిగ్రీలకు చేరుకుని 125 ఏళ్ల రికార్డును తిరగరాసింది. వర్షాల విషయానికి వస్తే దేశంలో ఆగస్టులో కేవలం 213.3 మిమీ వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇది సాధారణం కంటే 16 శాతం తక్కువ. 2001 సంవత్సరం తర్వాత చూస్తే ఇదే 7వ అత్యల్ప వర్షపాతం కావడం గమనార్హం. ఆగస్టు 31 నాటికి దేశంలో మొత్తం వర్షపాతం లోటు 14 శాతంగా ఉంది. వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర మాట్లాడుతూ.. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన మధ్యస్థ నుంచి తీవ్రమైన 'ఎల్ నినో' పరిస్థితులే ఈ తీవ్రమైన మార్పులకు కారణమని చెప్పారు. పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం వల్ల మాన్సూన్ వ్యవస్థ దెబ్బతింటోంది. ఆగస్టు నెలలో 4 అల్పపీడనాలు ఏర్పడి దాదాపు 26 రోజుల పాటు యాక్టివ్గా ఉన్నప్పటికీ, వాటి ప్రభావం కేవలం ఇండో-గంగా మైదాన ప్రాంతాలకే పరిమితమైంది. దీంతో మిగిలిన దేశమంతా వర్షాలు లేక ఎండలు, తీవ్రమైన

ఈ మాస ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ నెల ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. ఈ మాసం మేష రాశివారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. చేపట్టిన ప్రతి పని సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. తండ్రి తరపు నుంచి స్థిరాస్తి లాభాలు పొందుతారు. సంతానం విద్యా విషయాలలో మంచి ఫలితాలు పొందుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మాసం చివరన బంధు మిత్రులతో వివాదాలు ఉంటాయి. ఈ మాసం వృషభ రాశివారికి అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో రాణిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు తొలగుతాయి. ఆదాయానికి లోటు ఉండదు. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. తల్లితరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. పాత మిత్రులతో సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. మిథున రాశివారికి ఈ మాసం గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారు ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. అవసరానికి బంధు మిత్రుల నుంచి డబ్బు సహాయం లభిస్తుంది. గతంలో ఉన్న సమస్యలను రాజీ చేసుకుంటారు. దాయాదులతో ఉన్న వివాదాల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మీ పలుకుబడి మరింత పెరుగుతుంది. దూర ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభిస్తాయి. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు
పల్లవి ఇచ్చిన స్ట్రోక్కి పార్వతికి హార్ట్ స్ట్రోక్ వస్తుంది. దెబ్బకి వెళ్లి హాస్పిటల్ బెడ్పై పడుతుంది. దారుణం ఏమంటే.. హాస్పిటల్లో ఆమె దగ్గర సహాయకురాలిగా పల్లవే ఉంటుంది. ఎప్పుడెప్పుడు కళ్లు తెరుస్తుందా? ఎప్పుడెప్పుడు పీక పిసికిచంపేద్దామ్మా అన్నంత కసిగా ఎదురుచూస్తుంటుంది పల్లవి. ఇక ఈరోజు (సెప్టెంబర్ 01) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. చావు నుంచి తప్పించుకుని పార్వతి కళ్లు తెరుస్తుంది. ఎదురుగా పల్లవి ఉండేసరికి.. ఆమె గుండె గుప్పెట్లోకి వచ్చేసినంత పని అవుతుంది. ‘ఏంటి అత్తయ్యా అలా చూస్తున్నావ్.. ఇప్పుడు ఎలా ఉంది’ అని చాలా కూల్గా అడుగుతుంది పల్లవి. ప.. ప.. ప అని బిత్తరచూపులు చూస్తుంటుంది పార్వతి. దాంతో పల్లవి.. ‘మీకు హార్ట్ ఎటాక్ వచ్చింది నా గురించేనని నాకు అర్థమైంది.. అందుకే ఇంత టెన్షన్ పడుతున్నావ్ అని నాకు తెలుసు. నా గురించి నిజం తెలిసిన వెంటనే.. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అవనికి చెప్పేద్దాం అని అనుకున్నావ్ కదా.. మీరు అవనికి చెప్పేసి ఉంటే.. నన్ను ఫుట్బాల్ ఆడుకునేది. నా జీవితం రోడ్డున పడేది. మీ కొడుకు కమల్ నన్ను చంపేసి ఉండేవాడు.కాళ్లు పట్టుకోను.. పీక పట్టుకుంటా.. నేను అదృష్టవంతురాల్ని కాబట్టి అలా జరగలేదు. మీరు దురదృష్టవంతురాలు కాబట్టి హార్ట్ ఎటాక్ వచ్చింది. మీది విశాల హృదయం కాబట్టి.. ఇన్నాళ్లూ క్షమిస్తూ వచ్చారు. నేను మామయ్యని చంపాలనుకున్నది మొదలు.. చంటి బిడ్డని కిడ్నాప్ చేయించడం వరకూ.. అన్నీ మీకు తెలిసిపోయాయి కాబట్టి.. మీరు నన్ను క్షమించరని నాకు తెలుసు. క్షమించరు కాబట్టి.. మీ కాళ్లు పట్టుకుని బ్రతిమిలాడలేను. కాబట్టి పీక పట్టుకుంటున్నా అంటూ టకీ మని పార్వతి పీకపట్టేస్తుంది పల్లవి. నా గురించి మీకు తెలిసిన నిజాలను ఎవరికీ చెప్పకుండా ఉంటే.. మీరు హ్యాపీగా ఉంటారు.. మీ ఫ్యామిలీ కూడా సేఫ్గా ఉంటుంది.. లేదంటే ఎవ్వర్నీ వదిలను చంపేస్తా. తేడా వచ్చిందో ఫొటోకి దండపడిపోద్ది
నేను నిన్ను ఎంతో నమ్మాను మమ్మి.. తల్లిచాటు బిడ్డలా ఉన్నా... నువ్వేం చెప్తే అది చేశా.. చివరకు నాకు ఇష్టం లేని ఇందుని పెళ్లి చేసుకోమన్నావ్.. నేను కూడా చేసుకుంటా అని అన్నా.. నీ మీద నాకు అంత నమ్మకం, ప్రేమ అని మదన్ అంటాడు. ఆ మాటలకు రేఖ కన్నీరు పెట్టుకుంటుంది. కానీ నువ్వేం చేశావ్.. నన్ను మోసం చేశావ్.. ఈ లక్కీ గాడు అంటేనే నాకు నచ్చదు.. నా రూంలో ఉంటేనే కంపరంగా ఉంటుంది.. వాడు నన్ను మాట వరసకి తమ్ముడు అంటేనే తట్టుకోలేకపోయేవాడ్ని.. కానీ ఇప్పుడు వాడే నీ కన్న కొడుకు.. నా రక్తం పంచుకుని పుట్టాడని తెలిసేలా చేశావ్.. నేనే నీ లోకం అని అనుకున్నా.. కానీ నీకు ఇంకో లోకం ఉందని తెలిసింది.. రాజు.. నువ్వంటే నాకు కోపం.. కానీ ఈ విషయాన్ని బయట పెట్టి.. నా కళ్లు తెరిపించావ్ థాంక్స్ అని అంటాడు మదన్. నువ్వు ఆవేశంలో, కోపంలో ఉన్నావ్ మదన్ అని రాజు అంటాడు. లేదు అన్నీ ఆలోచించుకునే అంటున్నా అని మదన్ అంటాడు. అల్లుడు ఎక్కడికి వెళ్తావ్ అని భ్రమరం, శేషు అడిగితే.. ఎక్కడికో వెళ్తాను.. ఇక్కడ మాత్రం ఉండలేను.. మా మమ్మీని, ఈ లక్కీ గాడ్ని చూస్తూ ఇక్కడ ఉండలేను అని మదన్ అంటాడు.నేను వాడికి మొహం చూపించలేక.. తమ్ముడు.. తమ్ముడు అని పరిగెత్తుకుంటూ వస్తుంది భ్రమరం. అల్లుడు ఇల్లు వదిలి వెళ్లిపోతోన్నాడు.. నీ కొడుకుని నువ్వు ఆపవా? అని అడుగుతుంది భ్రమరం. ఈ సమాజానికి మొహం చూపించలేక వాడు వెళ్లిపోతోన్నాడు.. నేను వాడికి మొహం చూపించలేక ఈ రూం నుంచి బయటకు రావడం లేదు.. నేను ఏం చేయాలి.. వాడు ఏం చేయాలని అనుకుంటున్నాడో.. చేయనివ్వు అని భూషణ్ కోపంతో రగిలిపోతోంటాడు. దీనికి కారణమైన ఆ రేఖను మాత్రం వదిలి పెట్టొద్దు రా.. నిన్ను, నా అల్లుడ్ని మోసం చేసిందని

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. PRTUTS: పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యల పరిస్కారం కోరుతూ.. నేడు చలో హైదరాబాద్ కార్యక్రమం, ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమం చేపడుతున్నట్లు పీఆర్టీయూ రాష్ట్ర సంఘం వెల్లడించింది. 50వేల మందితో ఈ మహాధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావస్తున్నా..ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో హామీల్లో సెంటీమీటర్ కదలిక కూడా లేదని ఆయన ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు 3 డీఏలు పెండింగ్ లో ఉంటేనే గగ్గోలో పెట్టారని.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో 6 డీఏలు పెండింగ్ పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. ఆ సమయంలో బకాయి బిల్లులు రూ.4,000 కోట్లుగా ఉండేవని, కానీ ఇప్పుడు అవి రూ.16,000 కోట్లకు చేరాయని అన్నారు. 4 నెలలుగా ఈహెచ్ఎస్ నిధులు కోత విధించినప్పటికీ, ఏ ఆసుపత్రిలోనూ హెల్త్ కార్డులు ఇప్పటికీ చెల్లడం లేదని ఆయన ఆరోపించారు. మేనిఫెస్టోలోని హామీలను, వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమైనందుకు నిరసనగా మంగళవారం ఇందిరా పార్కులో "చలో హైదరాబాద్" అనే భారీ నిరసన చేపట్టనున్నట్లు పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్ రెడ్డి ప్రకటించారు. ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల హక్కులు, భవిష్యత్తును కాపాడుకోవాలనే లక్ష్యంతో, పీఆర్టీయూ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తెలంగాణలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు నేడు హైదరాబాద్లోని ఇందిరా పార్కులో భారీ నిరసన చేపట్టారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న తమ న్యాయబద్ధమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని
LPG Price: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మరోసారి ధరల భారం పెరిగింది. సెప్టెంబర్ నెల ప్రారంభం రోజున ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను (Commercial LPG Cylinder Price) పెంచాయి. దీంతో వాణిజ్య సిలిండర్ వినియోగించే రెస్టారెంట్లు, హోటళ్లు, బేకరీలు, క్యాంటిన్ల వంటి సంస్థలపై అదనపు భారం పడుతుంది. అయితే, గృహ అవసరాలకు ఉపయోగించే 14.2 కిలోల సిలిండర్ ధరలను స్థిరంగా కొనసాగిస్తూ సామాన్యులకు ఊరట కల్పించారు. మరి నగరాల వారీగా సిలిండర్ ధరలు ఎంత పెరిగాయో తెలుసుకుందాం.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) విడుదల చేసిన తాజా ధరల ప్రకారం 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 9.50 మేర పెరిగింది. దీంతో ఒక్క సిలిండర్ ధర రాజధాని నగరంలో రూ. 2,747.50 వద్దకు చేరుకుంది. ఇక ఆర్థిక రాజధాని ముంబైలోనూ రూ. 9.50 పెరగడంతో రూ. 2691.50 నుంచి రూ. 2701 వద్దకు పెరిగింది. హైదరాబాద్ నగరంలో రూ. 11 మేర పెరిగి రూ.2,996 వద్దకు చేరింది. చెన్నై నగరంలో 19 కిలోల సిలిండరే ర్టు రూ. 2916.50 వద్దకు పెరిగింది. అంటే ఒక్క సిలిండర్ పై రూ. 10.50 మేర పెంచారు. ఇతర నగరాల్లోనూ ధరలు పెరిగాయి. అయితే గత ఆగస్టు నెలలో వాణిజ్య సిలిండర్ ధరలను స్వల్పంగా తగ్గించిన సంగతి తెలిసిందే. నగరం 19 కిలోల సిలిండర్ కొత్త ధరలు ఢిల్లీ రూ.2747.50 ముంబై రూ.2691.50 హైదరాబాద్ రూ.2996 చెన్నై రూ.2916.50 గురుగ్రామ్ రూ.2764 నోయిడా రూ.2747.50 లఖ్నవూ రూ.2870 పాట్నా రూ.3044 స్థిరంగానే 14.2 కిలోల సిలిండర్ ధరవాణిజ్య వినియోగ సిలిండర్ ధరలను మరోసారి పెంచినప్పటికీ గృహ వినియోగానికి ఉపయోగించే 14.2 కిలోల సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయకుండా స్థిరంగానే కొనసాగించారు. ప్రస్తుతం హైదరాబాద్లో 14.2 కిలోల
జ్యోత్స్న పెళ్లి మా బాధ్యత అంటూ ముక్కు మొహం తెలియని గొట్టంగాడ్ని తీసుకొచ్చి.. ఆమె గొంతుకోసిన దీప, కార్తీక్లకు సరైన రీతిలో బుద్ధి చెప్పాడు సూరజ్. అసలు జ్యోత్స్నని ఇంత మోసం చేయడానికి కారణం మీరేనంటూ.. అసలు దీపా, కార్తీక్లు లేకపోతే ఆ ఇంట్లోకి అడుగుపెట్టేవాడ్ని కాదంటూ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు సూరజ్. ఇక తన మనవరాలి పెళ్లి పీటలపై ఆగిపోవడానికి.. సుమిత్ర హాస్పిటల్ పాలు కావడానికి కారణం దీప కార్తీక్లే కారణం అని వాళ్లని ఇంటి నుంచి వెళ్లగొట్టాడు శివన్నారాయణ. ఇక ఈరోజు (సెప్టెంబర్ 01) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. దీప, కార్తీక్లు కూర్చుని ముచ్చట్లు పెట్టుకుంటారు. సూరజ్ వెళ్తూ వెళ్తూ.. తన చేసిన తప్పుల్లో మనల్ని ఎందుకు భాగం చేశాడో అర్థం కావడం లేదు’ అని అంటుంది దీప. ‘నీకు ఇంకా అర్థం కాలేదా? సూరజ్ పక్కా ప్లాన్తో మనల్ని ఇరికించేశాడు. తండ్రి చావుకి పగ తీర్చుకోవడానికి సూరజ్, మాలిని, దక్షణమూర్తి ముగ్గురూ కలిసే ప్లాన్ చేశారు. సూరజ్ ముందే గ్రౌండ్ వర్క్ చేశాడు. . ముందు నాకు నా ద్వారా నీకు పరిచయం అయ్యాడు.మనమే వాడు మంచోడని సర్టిఫికేట్ ఇచ్చేశాం.. మనమే వాడి గురించి సరిగా తెలుసుకోకుండా.. సర్టిఫికేట్ ఇచ్చేశాం. డబ్బులు తీసుకోకుండా ఎవరైనా జాబ్ చేస్తారా? వాడు చేశాడు. మా నాన్న నాకు ఆరోజే చెప్పారు.. ‘ఒకడు తన సామర్థ్యాన్ని తగ్గించుకుని.. వెళ్లే అవకాశం ఉన్నా.. వెళ్లిపోకుండా ఉన్నాడంటే.. వాడ్ని ఏదో ఒక శక్తి ఆపుతుంది’ అని. ఆ శక్తి వాడి పగే. వాడే కోటేశ్వరుడైనప్పుడు వాడికెందుకు డబ్బు, జీతం. సూరజ్ విషయంలో మనం ఎప్పటికప్పుడు మోసపోతున్నాం.. మంచితనమే మనిషికి నిజమైన శత్రువు. దాన్ని అడ్డుపెట్టుకుని అందర్నీ మోసం చేసి.. మనల్ని దోషుల్ని చేశాడు. మన ఫ్యామిలీకి జరిగిన అన్యాయం చూస్తూ ఊరుకోం అని.. వాడు చాలా తెలివిగా మనల్ని మన ఫ్యామిలీకి దూరం చేశాడు.ఆ

సెప్టెంబర్లో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని, అదే సమయంలో ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే అధికంగా ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.ఐఎండీ అంచనాల ప్రకారం, సెప్టెంబర్లో దీర్ఘకాల సగటు (ఎల్పీఏ) వర్షపాతంలో 91 శాతం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాధారణంగా సెప్టెంబర్ నెలలో సగటు వర్షపాతం 167.9 మిల్లీమీటర్లుగా ఉంటుంది. దేశంలోని మెజారిటీ ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని, అయితే వాయవ్య, ఈశాన్య, తూర్పు, ఆగ్నేయ ద్వీపకల్పంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం లేదా అంతకంటే ఎక్కువ వర్షాలు కురవొచ్చని పేర్కొంది.మరోవైపు, దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. దీనివల్ల వాతావరణంలో వేడి, ఉక్కపోత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.పసిఫిక్ మహాసముద్రంలో బలమైన ‘ఎల్ నినో’ పరిస్థితులు నెలకొనడమే ఈ వాతావరణ మార్పులకు ప్రధాన కారణమని ఐఎండీ వివరించింది. ఈ ఎల్ నినో ప్రభావం మున్ముందు మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది. వర్షపాతం తగ్గడం వల్ల వ్యవసాయం, జలవనరులు, జలవిద్యుత్ ఉత్పత్తి, తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.ఈ నేపథ్యంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని, వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, రైతులు ప్రత్యామ్నాయ వ్యవసాయ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించింది. అక్టోబర్-డిసెంబర్ కాలానికి సంబంధించి ఈశాన్య రుతుపవనాలపై అంచనాలను సెప్టెంబర్ చివరి వారంలో విడుదల చేస్తామని ఐఎండీ వెల్లడించింది

నేటి రాశి ఫలాలు.. ఈరోజు శ్రీపరాభావ నామ సంవత్సరం, శ్రావణ మాసం, వర్ష రుతువు, దక్షిణాయనం, 2026 సెప్టెంబర్ 1వ తేదీ, మంగళవారం. పండితుల అభిప్రాయం ప్రకారం ఈరోజు ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది? ఏ రాశి వారు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి? ఖర్చులు తగ్గించుకోవాలి? ఆ పూర్తి వివరాలను తెలుసుకుందాం. మేష రాశి వారికి ఈరోజు శుభకరం. అదృష్టం కలిసి రావడం వల్ల కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త పనులను ప్రారంభిస్తారు. వృషభ రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉంది. ఇతరుల గొడవల్లో తలదూర్చకండి. కొత్త పనులు ప్రారంభించకండి. కర్కాటక రాశి వారికి ఈరోజు శుభకరంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులకు అనుకూలమైన రోజు, కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. పని ప్రదేశంలో ప్రశంసలు పొందడమే కాకుండా, సమాజంలో గౌరవం. ఆరోగ్యం కూడా కలిసి వస్తాయి. కుంభ రాశి వారికి ఈరోజు శుభకరంగా ఉంటుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులకు లాభ సూచనలు ఉన్నాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది, ప్రయాణాలు చేస్తారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. మీన రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. కొత్త పనులు లేదా కొత్త వ్యాపారాలు చేపట్టకుండా ఉండటం ఉత్తమం.(Disclaimer: ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం సాధారణ నమ్మకాలు, పంచాంగాలు, జ్యోతిష్య అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించబడిన సమాచారంగా పరిగణించరాదు. ఈ సమాచారాన్ని మా Zee Telugu News స్వతంత్రంగా ధృవీకరించలేదు.)

ఎల్నినో ప్రభావంతో సరైన వర్షాలు పడకపోవటంతో రాష్ట్రంలో ఖరీఫ్ పంటలు గట్టెక్కుతాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టు నెలలో వర్షపాతం గణనీయంగా పడిపోవటంతో పంటలు ఆశించినంతగా ఎదగలేదు. ప్రస్తుత వానాకాలం సీజన్లో మిగిలింది ఒకే నెల గత 3 నెలల్లో రాష్ట్రంలో 17శాతం లోటు వర్షపాతం పడిపోనున్న వరి, పత్తి, మొక్కజొన్న దిగుబడి ఇకపై వరి నాట్లు వేయొద్దని శాస్త్రవేత్తల సూచన ఎల్నినోతో దేశవ్యాప్తంగా వరిసాగులో తగ్గుదల హైదరాబాద్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): ఎల్నినో ప్రభావంతో సరైన వర్షాలు పడకపోవటంతో రాష్ట్రంలో ఖరీఫ్ పంటలు గట్టెక్కుతాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టు నెలలో వర్షపాతం గణనీయంగా పడిపోవటంతో పంటలు ఆశించినంతగా ఎదగలేదు. చిరు జల్లులు ఊరిస్తున్నా జలాశయాల్లోకి వరదనీరు వచ్చే పరిస్థితులు కనిపించకపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆగస్టులో రాష్ట్రంలో 38 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మొత్తంగా ఈ వర్షాకాలంలో గడిచిన మూడు నెలల్లో 17 శాతం లోటు వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాలకు జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలలే కీలకం. సెప్టెంబరులో సాధారణ వర్షపాతం 167.1 మి.మీ. ఇప్పటికే లోటు ఉండటంతో సెప్టెంబరులో సాధారణానికి మించి వర్షపాతం నమోదుకావాలి. అప్పుడే పంటలు గట్టెక్కుతాయని రైతులతోపాటు వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. గత 3 నెలల సాధారణ వర్షపాతం 740.6 మి.మీ కాగా... కురిసింది 473.8 మి.మీ మాత్రమే. ఆగస్టులో సాధారణ వర్షపాతం 215.8 మి.మీ కాగా... 134.5 మి.మీలు నమోదైంది. అంటే 38 శాతం లోటు. సెప్టెంబరులో కూడా వర్షాలు పడకపోతే భూగర్భ జలాలు మరింత పడిపోయి పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారుతాయని రైతులు అంటున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇకపై వరిపంట వేయవద్దని రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వేసినా పంట దిగుబడి ఆశించినంతగా రాదని చెబుతున్నారు. ఇప్పటికే సాగుచేసిన వరి పంటలో కూడా దిగుబడి తగ్గుతుందని అంటున్నారు. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 66

ఎల్ నినో ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడంలేదు... లోటు వర్షపాతం కొనసాగుతోంది. దీంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రైతులు ముందుగా ప్లాన్ చేసుకున్న ఖరీఫ్ సాగు దెబ్బతినవచ్చు... ఇలా రైతులకు నష్టాలు తప్పేలా లేవు. కానీ ఒక పంట పోయినంత మాత్రాన సాగు అవకాశాలు పూర్తిగా మూసుకుపోయినట్లు కాదు... సెప్టెంబర్ నెలలో కురిసే వర్షాలు, భూమిలో ఉండే తేమ, నీటిపారుదల సౌకర్యాన్ని బట్టి తక్కువ కాలంలో కోతకు వచ్చే కొన్ని పంటలను ఎంచుకోవచ్చు. దీనివల్ల తక్కువ సమయంలోనే మంచి దిగుబడి సాధించి మంచి ఆదాయం పొందవచ్చు... ఖరీఫ్ పంటనష్టాన్ని పూడ్చుకోవచ్చు. ఖరీఫ్ సీజన్లో వేరుశనగ, పప్పుధాన్యాల వంటి కొన్ని పంటలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఇవి వర్షాధార పంటలే అయినప్పటికి ఆ ప్రాంత వాతావరణ పరిస్థితులు, నేల స్వభావాన్ని బట్టి రైతులు ఏది వేయాలో నిర్ణయించుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో సెప్టెంబర్ నెలలో వేరుశనగ సాగును పరిశీలించవచ్చు... కానీ అన్ని జిల్లాలకు ఒకే రకమైన విత్తే సమయం సరిపోదు. కొన్ని ప్రాంతాల్లో సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్య కాలాన్ని వేరుశనగకు అనువైనదిగా సిఫార్సు చేస్తారు. నేల స్వభావం, వర్షపాతం, నీటిపారుదల సౌకర్యాన్ని బట్టి సరైన రకాన్ని ఎంచుకోవాలి. కాబట్టి విత్తనాలు కొనే ముందు మీ జిల్లాకు సంబంధించిన వ్యవసాయ శాఖ సిఫార్సులను తెలుసుకోవడం చాలా ముఖ్యం. కేవలం సీజన్ను చూసి హడావుడిగా విత్తనాలు వేయడం కంటే పొలంలో తగినంత తేమ ఉందో లేదో నిర్ధారించుకోవాలి. పెసలు, మినుములు వంటి పప్పుధాన్యాల పంటలు కూడా కొన్ని ప్రాంతాల్లో స్వల్పకాలిక సాగుకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా నీరు నిలవని నేలల్లో, అవసరమైన తేమ లభించే ప్రాంతాల్లో వీటిని ఎంచుకోవచ్చు. పొలంలో విత్తనాలు వేయడానికి ముందు సరైన పద్ధతిలో విత్తన శుద్ధి చేయాలి. దీంతో మొలకశాతం బాగుంటుంది, పంట తొలిదశలో ఆరోగ్యంగా పెరుగుతుంది. నేల స్వభావాన్ని బట్టి వీటిని ఏకపంటగా లేదా కొన్ని

ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. గతంలో ప్రకటించిన ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ వస్తోన్నారు. ఏపీ, తెలంగాణల నుంచి రాకపోకలు సాగించే రైళ్లు ఇవి. నర్సాపూర్, హైదరాబాద్, చర్లపల్లి, తిరుపతి వంటి స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు వివిధ ప్రధాన గమ్యస్థానాల మధ్య అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వీటిల్లో మెజారిటీ రైలు సర్వీసులను పొడిగించారు. ప్రయాణికుల నుండి అపూర్వ ఆదరణ అందుతున్న నేపథ్యంలో తాజా చర్యలు తీసుకున్నారు.తాజాగా నర్సాపూర్ నుంచి ట్యుటికోరిన్ (తూత్తుకుడి) ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. మొదటి రైలు సెప్టెంబర్ 7వ తేదీన పట్టాలెక్కనుంది. 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ మార్గంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు రైల్వే అధికారులు. దీనికి సంబంధించిన హాల్ట్ స్టేషన్ల వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఉదయం 8 గంటలకు అడ్వాన్స్ బుకింగ్ సైతం ప్రారంభమైంది.సెప్టెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో ప్రతి సోమవారం రాత్రి 11:30 గంటలకు ట్యుటికోరిన్ నుంచి బయలుదేరే నంబర్ 06019 ప్రత్యేక రైలు.. మూడో రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే 12: 20 నిమిషాలకు నర్సాపూర్ కు చేరుకుంటుంది.సెప్టెంబర్ 9, 16, 23, 30వ తేదీల్లో ప్రతి బుధవారం తెల్లవారు జామున 4 గంటలకు నర్సాపూర్ నుంచి బయలుదేరే నంబర్ 06020 ప్రత్యేక రైలు మరుసటి రోజు తెల్లవారు జామున 4:30 గంటలకు ట్యుటికోరిన్ చేరుకుంటుంది.ఏపీ, తెలంగాణ మీదుగా తమిళనాడుకు నూతన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్- హాల్ట్ స్టేషన్లుట్యుటిమేలూర్, కోవిల్ పట్టి, సత్తూర్, విరుధునగర్, మధురై, కొడైకెనాల్ రోడ్, డిండిగల్, తిరుచిరాపల్లి, తంజావూరు, కుంభకోణం, మైలాడుథురై, చిదంబరం, తిరుపాద్రిపులియూర్, విల్లుపురం, చెంగల్పట్టు, తాంబరం, చెన్నై ఎగ్మూర్, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్ మీదుగా ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయి

Telangana Politics : తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి... వరుసగా రెండుసార్లు సీఎంగా చేశారు. ఇక ఆయన తనయుడు కల్వకుంట్ల తారక రామారావు (KTR) సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్... ఆ పార్టీ సీఎం అభ్యర్థి కూడా ఆయనే అనేది పొలిటికల్ టాక్. అయితే కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కూడా సీఎం రేసులో ఉన్నారా? అంటే అవుననే జవాబు వినిపిస్తోంది. బిఆర్ఎస్ పార్టీ ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసిన ఆమె తండ్రి, సోదరుడికి పొలిటికల్ గా దూరమయ్యారు... ఇటీవల కొత్త పార్టీ పెట్టారు. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పేరు కలిసివచ్చేలా తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ పెట్టారు... దీంతో ఆమె ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ క్రమంలో కవిత పలువురు ముఖ్యమంత్రులకు ఆధ్యాత్మిక సలహాదారుగా ఉన్న ఓ జ్యోతిషుడిని కలిశారు... ఇలా మరోసారి వార్తల్లో నిలిచారు కవిత. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రముఖ జ్యోతిషులు రాధన్ పండిట్ వేత్రివేల్తో సమావేశమయ్యారు. హైదరాబాద్లోని కవిత నివాసానికి రాధన్ పండిత్ విచ్చేశారు... ఆమెతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ మీటింగ్కు సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో పొలిటికల్ గా ప్రాధాన్యం సంతరించుకుంది. కవిత, రాధన్ పండిత్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి... ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్గా మారింది. రాధన్ పండిట్ ప్రముఖ రాజకీయ జ్యోతిషులు. ఆయన చూసే జాతకాలు, చెప్పే జోస్యాలు కరెక్ట్గా జరుగుతాయని చాలామంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు నమ్ముతారు. దేశవ్యాప్తంగా చాలా మంది రాజకీయ నాయకులకు, సెలబ్రిటీలకు ఈయనే ఆధ్యాత్మిక, జ్యోతిష సలహాదారు. వేద జ్యోతిషం, న్యూమరాలజీలో ఆయనకు ఏకంగా నలభై ఏళ్లకు పైగా

భారత్-అఫ్గానిస్థాన్ మధ్య వచ్చే నెల జరగాల్సిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. మ్యాచ్ల తేదీలను కొన్ని రోజులు ముందుకు జరపాలని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) ప్రతిపాదించినట్లు సమాచారం. ఇంటర్నెట్ డెస్క్: భారత్-అఫ్గానిస్థాన్ మధ్య వచ్చే నెల జరగాల్సిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. మ్యాచ్ల తేదీలను కొన్ని రోజులు ముందుకు జరపాలని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) ప్రతిపాదించినట్లు సమాచారం. దీనిపై ఏసీబీ, బీసీసీఐ మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ.. ఇప్పటివరకు అధికారిక నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఈ మూడు టీ20 మ్యాచ్లు సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో జరగాల్సి ఉంది. అయితే వీటిని సెప్టెంబర్ 11, 13, 14 తేదీలకు మార్చాలని ఏసీబీ నుంచి బీసీసీఐకి ప్రతిపాదన వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందులో సెప్టెంబర్ 14న గణేశ్ చతుర్థి రోజున ఓ మ్యాచ్ నిర్వహించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. పండగ రోజున మ్యాచ్.. వ్యూయర్షిప్పై కన్ను గణేశ్ చతుర్థి సందర్భంగా మ్యాచ్ నిర్వహిస్తే టీవీ వ్యూయర్షిప్తో పాటు స్టేడియంలో ప్రేక్షకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగానే షెడ్యూల్ను ముందుకు జరపాలని కోరినట్లు తెలుస్తోంది. మూడు మ్యాచ్లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. అఫ్గానిస్థాన్ తొలిసారి భారత్తో ద్వైపాక్షిక సిరీస్కు ఆతిథ్యం ఇస్తుండటం ఈ సిరీస్ ప్రత్యేకత. అయితే మ్యాచ్లన్నీ భారత్లోనే జరగనున్నాయి. భారత్కు శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆగస్టు 27న ముగియనుంది. సెప్టెంబర్ 24న ఆసియా క్రీడలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మధ్యలో భారత జట్టుకు ఖాళీ సమయం ఉంది. బంగ్లాదేశ్తో సిరీస్ కూడా జరిగే అవకాశం లేనందున.. అఫ్గానిస్థాన్ సిరీస్ను ముందుకు జరపడం సాధ్యమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే షెడ్యూల్ మార్పుపై బీసీసీఐ, ఏసీబీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కుల్దీప్ యాదవ్పై వారికి

భారీగా పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు సెప్టెంబర్ నుంచి ఈ కార్ల ధరలు భారీగా పెంపు క్రెటా, వెన్యూ, ఎక్సెంట్, ఐ20, ఆరా మోడళ్ల ధరలివే Hyundai Car Prices : హ్యుందాయ్ కస్టమర్లకు బిగ్ షాకింగ్ న్యూస్.. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మరోసారి కార్లను ధరలను పెంచుతోంది. ఈ నిర్ణయంతో క్రెటా, వెన్యూ, ఎక్సెంట్, i20, ఆరా వంటి అనేక కార్ల ధరలు అమాంతం పెరగనున్నాయి. వ్యయ ఒత్తిళ్లను తగ్గించేందుకు ఈ కొరియన్ ఆటోమొబైల్ కంపెనీ భారతీయ విభాగం ఒక శాతం ధరల పెంపునకు ప్లాన్ వేస్తోంది. ఈ ధరలు వచ్చే సెప్టెంబర్ నెల ప్రారంభంలో అమల్లోకి రానున్నాయి. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.. మోడల్స్, వేరియంట్ బట్టి ధరలు : మోడళ్లు, వేరియంట్లను బట్టి ధరల పెంపు వేర్వేరుగా ఉంటుందని హ్యుందాయ్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన ఫైలింగ్లో తెలిపింది. పెరుగుతున్న ముడి పదార్థాలు, సరుకుల ధరలు, పెరిగిన నిర్వహణ ఖర్చులు, భౌగోళిక రాజకీయ, స్థూల ఆర్థిక అనిశ్చితులు వంటి కారణాలతో వాహనాల ధరలను పెంచక తప్పడం లేదని కంపెనీ పేర్కొంది. పెరిగిన ఖర్చుల భారాన్ని భరించడంతో పాటు యూజర్లపై ధరల ప్రభావాన్ని తగ్గించేందుకు కంపెనీ అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. Read Also : Pova 8 Pro 5G Sale : గేమింగ్ ఫోన్ ఇదిగో.. కొత్త పోవా 8 ప్రో 5జీ ఫస్ట్ సేల్.. ఫ్లిప్కార్ట్లో జస్ట్ ఎంతంటే? ప్రస్తుతం, కంపెనీ పోర్ట్ఫోలియోలో ఎంట్రీ-లెవల్ మోడల్ గ్రాండ్ i10 నియోస్ నుంచి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఐయోనిక్ 5 వరకు ఉన్నాయి. ఈ కార్ల ధరలు సుమారు రూ. 5.6 లక్షల నుంచి రూ. 55.7 లక్షల వరకు ఉన్నాయి. అంతేకాదు.. హ్యుందాయ్ పోర్ట్ఫోలియోలో క్రెటా, క్రెటా ఎలక్ట్రిక్, వెన్యూ, XTRE, i20, వెర్నా, ఆరా అల్కాజార్ వంటి అనేక మోడళ్లు ఉన్నాయి. రెండుసార్లు ధరలు పెంపు : హ్యుందాయ్

బుధ గోచారం వల్ల మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. వ్యాపారంలో సరైన నిర్ణయాలు తీసుకుని విజయం సాధిస్తారు. ఆకస్మిక ఆర్థిక లాభాలు అందుకునే సూచనలు ఉన్నాయి. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయి. మీ మాటతీరు మధురంగా మారి ఇతరులను ఆకట్టుకుంటుంది. ఫలితంగా సెప్టెంబర్ నెలలో వీరికి అదృష్టం రెట్టింపు అవుతుంది. అనుకున్నవన్నీ జరుగుతాయి. బుధుడు మీ కర్మ, ఆదాయ స్థానాల నుండి ప్రయాణించడం వల్ల ఆర్థికంగా చాలా కలిసివస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతాల పెంపు లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. ఆదాయ మార్గాలు పెరిగి, వ్యాపారంలో మంచి లాభాలు సాధిస్తారు. ఈ నెలలో ఆర్థికంగా ఎలాంటి సమస్యలు రావు. కుటుంబంలో కూడా ఆనందం రెట్టింపు అవుతుంది. ఈ రాశి 2వ, 3వ స్థానాల్లో బుధ సంచారం వల్ల ఆర్థికంగా బలం చేకూరుతుంది. ఉద్యోగులకు కోరుకున్న చోటికి బదిలీ (ట్రాన్స్ఫర్), ప్రమోషన్లు లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారవేత్తలు విజయవంతమైన లాభాలను అందుకుంటారు. మీపై మీకు ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. అనుకున్నవన్నీ సాధించగలుగుతారు. ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. సమాజంలోనూ, పని ప్రదేశంలోనూ మీ వాక్చాతుర్యం బాగా పనిచేస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే యోగం ఉంది. మీ జీవిత భాగస్వామి కూడా కెరీర్లో మంచి పురోగతి సాధిస్తారు. సెప్టెంబర్ నెలలో మీకు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. పాత పెట్టుబడుల నుంచి ఊహించని లాభాలు వస్తాయి. మనస్సులోని భయాలు, సంకోచాలు తొలగిపోయి ధైర్యం పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు, విదేశీ వ్యాపారం చేసే వారికి ఈ కాలం అత్యంత అనుకూలంగా ఉంటుంది

అత్యాధునిక ఫీచర్లతో తయారైన కియా సొరెంటో కారు త్వరలో మార్కెట్లోకి రానుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీసత్యసాయి జిల్లా... పెనుకొండ రూరల్ (ఆంధ్రజ్యోతి): అత్యాధునిక ఫీచర్లతో తయారైన కియా సొరెంటో కారు త్వరలో మార్కెట్లోకి రానుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలో ఉన్న కియా పరిశ్రమలో ఈ కారును తయారు చేశారు. సరికొత్త ఏఐ ఫీచర్లతో తయారైన తొలి సొరెంటో కారు ఉత్పత్తి లైన్ నుంచి బయటకు వచ్చిందని కియా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో గ్వాంగులీ తెలిపారు. సొరెంటోను సెప్టెంబరు 4న మార్కెట్లోకి విడుదల చేస్తామని, దేశంలోని కియా ఇండియా డీలర్షి్పలు, వెబ్సైట్ ద్వారా ప్రీ బుకింగ్స్కు అవకాశం కల్పించామని తెలిపారు

మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. ఈ మూవీ విడుదల తేదీని అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై.. సుమన్, సాయికుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర, వరుణ్ సందేశ్, వితికా షేరు వంటి వారు ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’ (Dharmasthala Niyojakavargam). జై జ్ఞాన ప్రభ తోట (Jai Jnana Prabha Thota) దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మిస్తోన్న ఈ పొలిటికల్ ఎంటర్టైనర్ చిత్ర విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. గురువారం హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్గా ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది. పీవీఆర్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నటుడు సుమన్ (Suman) మాట్లాడుతూ.. ఈ సినిమా చూశాక చెబుతున్నా.. కచ్చితం ఈ మూవీ అందరికీ నచ్చుతుంది. ఈ మూవీ మీద మొదటి నుంచి నాకు మంచి నమ్మకం ఉంది. సినిమా హిట్ అవుతుందనే ఆశిస్తూ వచ్చాను. డైరెక్టర్ జై జ్ఞాన ప్రభ కథ చెప్పినప్పుడే ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సినిమా అవుతుందని నమ్మాను. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను మా దర్శక నిర్మాతలు తెరకెక్కించారు. సెట్లో అన్నీ కుదరకపోతే ఒక్కోసారి షూటింగ్ క్యాన్సిల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకానీ, క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఈ చిత్రంలో ఒక మంచి పాత్ర చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. సెప్టెంబర్ 4న ఈ సినిమాను చూసి అందరూ ఆదరించాలని కోరుకుంటున్నానని తెలిపారు. పివిఆర్ సినిమాస్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉదయ్ మాట్లాడుతూ.. ‘‘ఈ మధ్య వస్తున్న సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి. అదే కోవలోనే ఈ ‘ధర్మస్థల నియోజకవర్గం’

డ్రగ్స్ రవాణాపై ఉమ్మడి పోరాటం, ఆర్థిక కారిడార్ల నిర్మాణం, బ్లూ ఎకానమీ విస్తరణ, దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణ కోసం అన్ని రాష్ట్రాలు సహకారంతో ముందుకు సాగాలని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పిలుపునిచ్చారు. చెన్నైలో 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. దేశ జీడీపీలో 30 శాతానికి పైగా వాటా కలిగిన దక్షిణాది రాష్ట్రాలు తయారీ, ఎగుమతులు, సేవల రంగాల్లో కేంద్రంగా నిలుస్తున్నాయని ఆయన గుర్తుచేశారు.ఆర్థిక కూటమిగా ఎదగాలితయారీ జోన్లు, లాజిస్టిక్స్ పార్కులు, ఫ్రైట్ కారిడార్ల ద్వారా దక్షిణ ప్రాంతం ఒక సమీకృత ఆర్థిక కూటమిగా పనిచేయాలని సీఎం విజయ్ ఆకాంక్షించారు. బెంగళూరులోని బొమ్మసంద్ర నుంచి హోసూర్ వరకు మెట్రో రైలు విస్తరణను స్వాగతించిన ఆయన, ఇది అంతర్రాష్ట్ర సహకారానికి ఒక నమూనా అని అభివర్ణించారు. ఈ పనులను వేగవంతం చేయాలని అధికారులను కోరారు.'డ్రగ్స్ రహిత దక్షిణ భారతం' కోసం మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై నిఘా సమాచారాన్ని పంచుకుంటూ, కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఆన్లైన్లో మందుల విక్రయాలపై నియంత్రణ, అనధికార పంపిణీపై చర్యలు తీసుకోవాలని కోరారు.సముద్ర తీరంతో అభివృద్ధిదక్షిణాది అభివృద్ధిలో బ్లూ ఎకానమీకి ప్రాధాన్యత ఇవ్వాలని విజయ్ అన్నారు. 1,076 కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్న తమిళనాడు.. పోర్టులు, తీరప్రాంత నౌకాయానం, మత్స్య పరిశ్రమ, సముద్ర ఆధారిత పరిశ్రమలు, పర్యాటకం వంటి రంగాల్లో ఇతర రాష్ట్రాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఆర్థిక సమాఖ్య విధానంపై మాట్లాడుతూ.. రాబోయే ఫైనాన్స్ కమిషన్ నిధుల కేటాయింపులో రాష్ట్రాల అవసరాలు, పనితీరు

తమిళనాడు ముఖ్యమంత్రి సీ. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం విద్యార్థులు మరియు యువతపై విధించిన వివాదాస్పద నిషేధ ఆదేశాలను వెనక్కి తీసుకుంటూ సంచలన నిర్ణయం ప్రకటించింది. ఎడమపక్ష పార్టీలు మరియు కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించే నిరసనల్లో విద్యార్థులు పాల్గొనకూడదంటూ జారీ చేసిన ఆదేశాలను ఆగస్టు 19న రద్దు చేసింది. జెన్ జీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురుకావడంతో విజయ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం చివరికి దిగిరాక తప్పలేదు. ఈ వివాదానికి సంబంధించిన నేపథ్యాన్ని పరిశీలిస్తే ఆగస్టు 14న స్కూల్ ఎడ్యుకేషన్ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగాలకు ప్రభుత్వం కొన్ని సూచనలు ఇచ్చింది. ప్రతిపక్షాలు మరియు విపక్ష విద్యార్థి సంఘాల నిరసనలకు యువత లొంగకుండా విద్యా శాఖలు, పోలీసులు, జిల్లా పరిపాలన యంత్రాంగం నిరోధించాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీనికి కొనసాగింపుగా ఆగస్టు 17న కాలేజియేట్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ప్రిన్సిపాల్స్కు లేఖ రాస్తూ ఆగస్టు 20లోగా నివేదిక సమర్పించాలని కోరింది. అత్యవసరంగా పంపిన ఈ కమ్యూనికేషన్ బయటకు రావడంతో తమిళనాడు వ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి. దీంతో విద్యాసంస్థలు మరియు విద్యార్థి సంఘాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమై వాతావరణం వేడెక్కింది. ఇదిలా ఉండగా జూలై 28న జరిగిన లా అండ్ ఆర్డర్ సమావేశంలో చీఫ్ సెక్రటరీ ఇచ్చిన సూచనల మేరకే విద్యాశాఖ ఈ చర్యలు చేపట్టినట్లు కథనాలు వెలువడ్డాయి. ప్రత్యేకంగా కొన్ని రాజకీయ సంస్థలను లక్ష్యంగా చేసుకుని నిరోధించడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనేనని విద్యార్థి లోకం భగ్గుమంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో జెన్ జీ మద్దతుతోనే టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని యువత గుర్తుచేస్తూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర నిరసనలు తెలిపింది. ఫలితంగా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరిగి రాజకీయంగా రచ్చ సాగింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 19న

దక్షిణాది రాష్ట్రాల మధ్య ఏళ్లుగా నలుగుతున్న జటిల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చెన్నై నగరం వేదికగా వ్యూహాత్మక అడుగు పడింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన కోవళంలోన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం అత్యంత కోలాహలంగా ప్రారంభమైంది. దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఉన్నత స్థాయి సదస్సు జరుగుతుండటంతో సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. భద్రతా కారణ దృష్ట్యా చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డు మార్గమంతటా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు.ఈ ప్రతిష్టాత్మక వేదికపై తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, పలువురు సీనియర్ అధికారులు ఆసీనులయ్యారు. ప్రాంతీయ సమన్వయాన్ని పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తున్నప్పటికీ.. రాష్ట్రాల మధ్య నిప్పు రాజేస్తున్న సరిహద్దు తగవులు, నదీ జలాల పంపిణీ పీటముడులు, అంతర్గత భద్రత వంటి కీలక అంశాలపైనే ప్రధానంగా మంతనాలు సాగుతున్నాయి. ప్రశాంత వాతావరణంలో పరస్పర సహకారం అందించుకోవాలనే ప్రతిపాదనలతో సమావేశం రసవత్తరంగా మారింది. క్షమాపణలు కోరిన సీఎం.. అసెంబ్లీ సాక్షిగా ఊహించని పరిణామంఅమిత్ షాతో తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ భేటీ.. కావేరి రగడ!సదస్సు ప్రారంభానికి ముందే రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో దాదాపు గంటపాటు ఏకాంతంగా సమావేశమై అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలపై చర్చించారు. ముఖ్యంగా కర్ణాటకతో వైరం రేపుతున్న కావేరి జలాల రగడను, మేకేదాటు ఆనకట్ట నిర్మాణంపై తమ వైఖరిని ఆయన అమిత్ షా ముందర గట్టిగా వినిపించారు. అంతేకాకుండా, ఇటీవల పొరుగు రాష్ట్రంలో ముగ్గురు తమిళులపై జరిగిన కాల్పుల కలకలం, నీటి విడుదల పై జరుగుతున్న ఆందోళనల అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి తక్షణ జోక్యాన్ని కోరినట్లు సమాచారం. విజయ్పై విరుచుకుపడిన పత్రిక.. సమస్యల సుడిగుండంలో పరిష్కారం దిశగా

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో సీఎం విజయ్కు (Vijay).. నటి త్రిష సెల్యూట్ చేయడం తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ అంశం రాజకీయంగా దుమారం రేపగా.. నటి సంజన తాజాగా దీనిపై స్పందించారు. ధైర్యం ఉంటే విజయ్ పాలన గురించి మాట్లాడాలని అన్నారు. ఆయన విజయవంతమైన రాజకీయ ప్రయాణాన్ని ఓర్వలేకే.. కొందరు వ్యక్తిగత దాడికి దిగుతున్నారని సంజన విమర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా విజయ్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై సంజన (Sanjjanaa Galrani) ప్రశంసలు కురిపించారు. ప్రజా సమస్యలపై ఆయన త్వరితగతిన స్పందిస్తూ.. ఇతర రాష్ట్రాల ప్రజలను కూడా ఆకర్షిస్తున్నారని అన్నారు. ‘‘విజయ్ రాష్ట్రాన్ని సమర్థంగా పరిపాలిస్తున్నారు కాబట్టి.. ఆయనపై ఆరోపణలు చేయలేకపోతున్నారు. వృత్తిపరంగా ఎలాంటి లోపాలు కనిపించనప్పుడు మాత్రమే వ్యక్తిగత ఎజెండాను వెతకడానికి ప్రయత్నిస్తారు. వారి పర్సనల్ లైఫ్ను లక్ష్యంగా చేసుకుని కించపరచాలని చూస్తారు. విజయ్ విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. కానీ మహిళలను లక్ష్యంగా చేసుకునే ఇలాంటి రాజకీయాలు ఎప్పటికీ ఆమోదయోగ్యం కావు’’ అని సంజన పేర్కొన్నారు. ఇక త్రిష (Trisha) గురించి సంజన మాట్లాడుతూ.. ఆమె చాలా గొప్ప నటి అని తెలిపారు. సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, గౌరవాన్ని సంపాదించుకున్నారని అన్నారు. విజయ్-త్రిష మధ్య ఉన్న బంధం వారి వ్యక్తిగత విషయమని తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా.. ఎదుటి వారి సాన్నిహిత్యాన్ని బట్టి వారి బంధం విషయంలో ఒక నిర్ణయానికి రావడాన్ని సంజన తప్పుపట్టారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు

భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టుల్ని ఉగ్రమూకలు దారుణంగా కాల్చి చంపాయి. దాంతో పాకిస్థాన్ పై భారత్ మే 7 నుంచి 10 వ తారీఖు వరకు ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. అలాగే సింధూ నదీ జలాల పంపిణీ ఒప్పందాన్ని కూడా నిలిపివేసింది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన నుంచి ఇరు దేశాల మధ్య వైమానిక సేవలు నిలిచిపోయాయి. పాకిస్థాన్ విమానాలకు భారత గగనతలం మూసివేస్తూ ఉండగా.. అటు భారత విమానాలకు పాకిస్థాన్ గగనతలం మూసివేస్తోంది. ఏడాదికిపైగా ఈ విధానం కొనసాగుతూ వస్తోంది. అయితే తాజాగా భారత్ విషయంలో పాకిస్థాన్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది.భారత విమానాలకు పాకిస్థాన్ గగనతలం మూసివేతను మరోసారి పొడిగించింది. ఈ మేరకు సెప్టెంబర్ 24 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాకిస్థాన్ ఎయిర్ పోర్ట్స్ అథారిటీ నోటమ్ జారీ చేసింది. ఈ పొడిగింపు ఆగస్టు 23 ఉదయం 10 గంటల 15 నిమిషాల నుంచి సెప్టెంబర్ 24 సాయంత్రం 4 గంటల 59 నిమిషాల వరకూ అమల్లో ఉండనుంది. భారత విమానాలపై గతంలో ఇచ్చిన పొడిగింపు తేదీ ఆగస్టు 23 న ముగుస్తున్న నేపథ్యంలో తాజాగా మరోసారి ఆ గడువును పొడిగిస్తూ నోటీస్ టూ ఎయిర్ మెన్(నోటమ్) ను జారీ చేసింది. 2022 లోని పాకిస్థాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకారం.. పాకిస్థాన్ ఎయిర్ స్పేస్ రెండు విభాగాలుగా ఉన్నాయి. అవి కరాచీ, లాహోర్.. ఈ నోటమ్ కరాచీ.. లాహోర్ కు అప్లికేబుల్ అవుతుంది.ఇక గతేడాది నుంచి భారత్ విమానాలకు పాకిస్థాన్ తన గగనతలాన్ని నిషేధిస్తూ వస్తుంది. ప్రతి నెలా ఈ గడువును పొడిగిస్తూ వస్తోంది. దాంతో భారత్ నుంచి