
కేకే-5 గనిలో ప్రమాదం.. ఒకరికి గాయాలు
మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కేకే-5 గనిలో ప్రమాదం జరగింది. గనిలో మూడో సీమ్లో 14 లెవెల్ వద్ద ఎస్డీఎల్ యంత్రంతో ఆపరేటర్ శంకర్ పనిచేస్తుండగా ఒక్కసారిగా సైడ్ వాల్ కూలింది.

మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కేకే-5 గనిలో ప్రమాదం జరగింది. గనిలో మూడో సీమ్లో 14 లెవెల్ వద్ద ఎస్డీఎల్ యంత్రంతో ఆపరేటర్ శంకర్ పనిచేస్తుండగా ఒక్కసారిగా సైడ్ వాల్ కూలింది.

Smartphone: ఉల్లిపాయ చిట్కా గురించి ఎంత చర్చ జరిగినా, అది మీ ఫోన్ను చల్లబరుస్తుందనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదు. వైరల్ హ్యాక్స్ను ఉపయోగించే బదులు, మీ ఫోన్ ఎందుకు వేడెక్కుతోందో అసలు కారణాన్ని కనుక్కోవడమే అత్యంత సురక్షితమైన, ఉత్తమమైన మార్గం.

European T20 Premier League: యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (European T20 Premier League, ETPL) పోరులో బెల్ఫాస్ట్ వోల్వ్స్ (Belfast Wolves) అదరగొట్టింది. ఆస్ట్రేలియా దిగ్గజాలు గ్లెన్ మ్యాక్స్వెల్, మాథ్యూ హెడెన్ జట్ల నడుమ సాగిన మ్యాచ్లో 23 ఏళ్ల యువ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించాడు. దీంతో హెడెన్ టీమ్ ఊహించని రీతిలో కుప్పకూలి భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది.

Best Camera Smartphones : భారత మార్కెట్లో రూ. 30వేల లోపు కెమెరా స్మార్ట్ఫోన్లు లభ్యమవుతున్నాయి. రెడ్మి, వివో, మోటరోలా, శాంసంగ్, నథింగ్ ఫోన్లు పవర్ ఫుల్ కెమెరాలు, OIS, టెలిఫోటో జూమ్, ఆకట్టుకునే ఫోటోగ్రఫీ ఫీచర్లతో కొనుగోలుదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి.
iPhone 17 Pro Price: ఇటీవల ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ సహా ఫోల్డబుల్ ఐఫోన్ డ్యూయో మోడల్స్ను యాపిల్ విడుదల చేసింది. వీటి ధరలు చూస్తే మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. డ్యూయో ప్రారంభ ధర రూ. 3 లక్షలకుపైనే. అయితే ఈ క్రమంలో ఇప్పుడు ఐఫోన్ 17 ప్రో 256 GB పై భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్, అదనపు బోనస్, బ్యాంక్ క్యాష్బ్యాక్ వంటి ప్రయోజనాలు కలిపితే ధర రూ. 70 వేలకు తగ్గుతుంది.
Vodafone Idea: ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియాకు మళ్లీ మంచి రోజులు వచ్చినట్లు కనిపిస్తున్నాయి. గడిచిన ఏడాది కాలంలో వీఐ షేరు 100 శాతం పెరిగింది. ఇప్పుడు ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్టియం ఏకంగా రూ. 33,250 కోట్ల మేర లోన్ ఇచ్చేందుకు అంగీకరించడంతో ఇన్వెస్టర్లు ఈ స్టాక్ కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ క్రమంలో వీఐ షేరు ర్యాలీకి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

iPhone 18 Pro, Pro Max వచ్చేశాయి.. తొలిసారి ఫోల్డబుల్ iPhone Duo లాంచ్!

iPhone 18 Pro, iPhone 18 Pro Max సిరీస్ రిలీజ్.. ధర ఎంతంటే..? ఆ రోజు నుంచే మార్కెట్ లోకి

Deepika Padukone | దీపిక మెటర్నిటీ ఫొటోలు.. చిన్నారి దువా ఎంత క్యూట్గా ఉందో..!
Deepika Padukone: బేబీ బంప్తో దీపికా పదుకొణె.. కూతురు దువా బర్త్డే సందర్భంగా క్యూట్ ఫొటోలు షేర్ చేసిన రణవీర్ సింగ్

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తాజాగా తన ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఇందులో రణవీర్ భార్య, హీరోయిన్ దీపికా పదుకోన్ బేబీ బంప్ తో ఉంది. త్వరలో ఆమె తల్లి కాబోతుంది. ఈ ఫొటోలో రణవీర్ - దీపికాల కూతురు దువా కూడా ఉంది.

OnePlus Nord CE 6 : కొత్త వన్ప్లస్ ఫోన్ కొంటున్నారా? క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S జెన్ 4 ప్రాసెసర్తో కొత్త ఫోన్ కొనేందుకు చూస్తుంటే ఈ అద్భుతమైన ఆఫర్ మీకోసమే.. వన్ప్లస్ నార్డ్ సిఇ 6 అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో మీ బడ్జెట్ ధరలోనే లభిస్తోంది. ఈ ఫోన్ 8000mAh బ్యాటరీతో పాటు బ్యాంక్ ఆఫర్లు, ధర తగ్గింపుతో మొత్తంగా రూ. 35వేల కన్నా తక్కువ ధరకే లభిస్తోంది. వన్ప్లస్ నార్డ్ సిఇ 6పై తగ్గింపులు, ఆఫర్లు, ధర వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ధర, ఆఫర్లు : వన్ప్లస్ నార్డ్ సీఇ 6 ఫోన్ 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్కార్ట్లో రూ. 36,920 ధరకు లిస్టు అయింది. బ్యాంక్ ఆఫర్లతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కార్డులపై రూ. 34,720 తగ్గింపు పొందవచ్చు. దాంతో ధర రూ. 29,250కు తగ్గుతుంది. అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ. 29,250 వరకు తగ్గించవచ్చు. కానీ, ఎక్స్ఛేంజ్ ఆఫర్ అనేది మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్ బట్టి రేటు ఉంటుంది. ఫీచర్లు, స్పెసిఫికేషన్లు : వన్ప్లస్ నార్డ్ సిఇ 6లో 6.78-అంగుళాల 1.5K ఎఫ్హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఉంది. రిజల్యూషన్ 2772×1272 పిక్సెల్స్, 144Hz రిఫ్రెష్ రేట్, 450ppi పిక్సెల్ డెన్సిటీ, 19.6:9 యాస్పెక్ట్ రేషియో, 3840Hz పీడబ్ల్యుఎం డిమ్మింగ్, 3600 నిట్స్ వరకు బ్రైట్నెస్ అందిస్తుంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ అడ్రినో 810 జీపీయూతో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7ఎస్ జెన్ 4 ప్రాసెసర్తో రన్ అవుతుంది. Read Also : Redmi 17 5G Launch : వారెవ్వా.. కొత్త రెడ్మి 17 5G ఫోన్ అతి చౌకైన ధరలో.. ఫస్ట్ సేల్ ఎప్పుడంటే? వన్ప్లస్ నార్డ్ సీఈ 6 ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 16పై రన్ అవుతుంది. కొలతలు 16.25 సెం.మీ

దులీప్ ట్రోఫీ2026లో భాగంగా అద్భుత ప్రదర్శన చేసిన కెప్టెన్ తిలక్ వర్మ తన జట్టు సౌత్ జోను ఒంటిచేత్తో ఫైనల్ చేర్చాడు. ఈ క్రమంలో టెస్ట్ క్రికెట్పై కీలక వ్యాఖ్యలు చేశాడు. స్పోర్ట్స్ డెస్క్: దులీప్ ట్రోఫీ2026లో భాగంగా అద్భుత ప్రదర్శన చేసిన కెప్టెన్ తిలక్ వర్మ తన జట్టు సౌత్జోను ఒంటిచేత్తో ఫైనల్ చేర్చాడు. నార్త్ జోన్తో జరిగిన సెమీ ఫైనల్లో సౌత్ జోన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జట్టును విజయపథంలో నడిపించిన తిలక్ వర్మ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు సొంతం చేసుకున్నాడు. ప్రజంటేషన్ సందర్భంగా తిలక్ వర్మ టెస్ట్ క్రికెట్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘రెడ్ బాల్ క్రికెట్ ఆడడాన్ని ఎంతో ఇష్ట పడుతా. నాకు టెస్ట్ క్రికెట్ అంటే చాలా ఇష్టం. వైట్బాల్ క్రికెట్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తానని నేనెప్పుడు కల కనలేదు. అదంతా దేవుడే ప్లాన్ చేశాడని భావిస్తున్నాను. తొలుత టీ20ల ద్వారా టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన నేను తర్వాత వన్డే క్రికెట్ కూడా ఆడాను. కానీ టెస్ట్ క్రికెట్లో నా బలాన్ని నిరూపించుకోవాలని ఎదురుచూస్తున్నా' అని తిలక్ పేర్కొన్నాడు. 'ఎప్పటికైనా భారత టెస్టు క్రికెట్ జట్టులో ఆడాలన్నదే నా కల. అది త్వరలోనే నెరవేరుతుందని ఆశిస్తున్నాను. ఐపీఎల్ కారణంగా వైట్బాల్ క్రికెట్లో టీమిండియాకు ఎంపికయ్యాను. కానీ ఐపీఎల్కు రాకముందే రెడ్ బాల్ క్రికెట్లో చాలా కష్టపడ్డాను. అందుకే టెస్టు క్రికెట్ ఆడడాన్ని ప్రేమించడంతో పాటు ఎంజాయ్ చేస్తాను. రంజీ ట్రోఫీ ఆడాలనుకుంటున్నప్పటికీ అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా అదీ జరగడం లేదు. అందుకే అవకాశం వచ్చినప్పుడే టెస్ట్ క్రికెట్లో వీలైనంత మేర రాణించాలని భావించాను' అని తిలక్ వెల్లడించాడు. కేరళ సీఎంతో రొనాల్డ్ సోదరి భేటీ.. వీడియో వైరల్ సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు.. నలుగురి బెయిల్ పిటిషన్ల డిస్మిస్

నెలకు రూ.2 లక్షల జీతం వస్తే.. ఇంకేం కావాలి.. ఇక జీవితానికి తిరుగులేదని చాలామంది భావిస్తారు. కానీ బెంగళూరుకు చెందిన టెక్ ప్రొఫెషనల్ శశాంక్ దీక్షిత్ మాత్రం ఇదే ఆదాయం ఒక దశలో కెరీర్కు ‘డేంజర్’గా మారొచ్చంటున్నారు. ఆయన చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం ఉద్యోగ నెటిజన్లలో విస్తృత చర్చకు దారితీసింది. శశాంక్ దీక్షిత్ వాదన ప్రకారం.. నెలకు రూ.2 లక్షలు సంపాదించడం ప్రమాదకరమని చెప్పడానికి కారణం ఆ మొత్తం ఎక్కువగా ఉండటం కాదు. ‘జస్ట్ ఎనఫ్’గా అనిపించడం అసలు సమస్య. ఈ స్థాయి ఆదాయం ఒక వ్యక్తికి మంచి జీవనశైలిని అందించడంతో పాటు, ప్రస్తుత ఉద్యోగం, కెరీర్ గురించి కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదనే భావనను కలిగించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులకు ‘బాగానే సంపాదిస్తున్నా’ అని చెప్పడానికి, వారాంతాల్లో హాయిగా గడపడానికి, రోజువారీ ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ ఆదాయం సరిపోతుందని ఆయన పేర్కొన్నారు. దీంతో ఒక దశలో ఉద్యోగి తన సామర్థ్యాన్ని పెంచుకోవడం కంటే.. ప్రస్తుత జీతాన్ని కాపాడుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉందని వివరించారు. దీక్షిత్ చెప్పిన మరో కీలక అంశం ‘కంఫర్ట్ జోన్’. మంచి జీతం, సౌకర్యవంతమైన జీవితం అలవాటైన తర్వాత ఉద్యోగం వదిలి స్టార్టప్ ప్రారంభించడం, కెరీర్ మార్చుకోవడం లేదా తక్కువ జీతంతో కొత్త అవకాశాన్ని ఎంచుకోవడం రిస్క్గా కనిపిస్తుంది. ‘ఇప్పటికే కోల్పోవడానికి ఏదో ఉంది’ అనే ఆలోచన అక్కడ మొదలవుతుందని ఆయన అంటున్నారు. ఫలితంగా ఒకప్పుడు చేయాలనుకున్న పనులను ‘వచ్చే నెల’, ‘వచ్చే ఏడాది’ అంటూ వాయిదా వేసుకుంటూ వెళ్లే పరిస్థితి ఏర్పడవచ్చని హెచ్చరించారు. చివరకు ఆశయం పోయిందని కాదు.. దాన్ని పట్టించుకోనంతగా సంపాదించడం మొదలుపెట్టామని గ్రహించే పరిస్థితి రావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దీక్షిత్ పోస్ట్కు పలువురు ఉద్యోగులు మద్దతు తెలిపారు. మంచి జీతం కొన్నిసార్లు ‘బంగారు పంజరం’లా మారుతుందని, సౌకర్యాన్ని వదులుకోవడం కష్టమవుతుందని కొందరు తమ అనుభవాలను పంచుకున్నారు. మరికొందరు మాత్రం
సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలంటే కేవలం భారీ విజువల్స్, వందల కోట్ల బడ్జెట్, స్టార్ కాస్టింగ్ మాత్రమే ఉంటే సరిపోదని మరోసారి రుజువైంది. బలమైన కథ, గుండెలను తాకే భావోద్వేగాలు ఉంటే చిన్న చిత్రాలు కూడా ప్రపంచ స్థాయి బాక్సాఫీస్ను షేక్ చేయగలవని అనేక సినిమాలు నిరూపించాయి. మన దగ్గర వచ్చిన 'హనుమాన్' వంటి చిత్రాలు అల్ప బడ్జెట్తో వచ్చి ఊహించని వసూళ్లు సాధించినట్లే, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఒక చైనీస్ ఫ్యామిలీ డ్రామా భారీ సంచలనం సృష్టిస్తోంది. అదే 'డియర్ యూ' (Dear You). హాంగ్చున్ లాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం చైనీస్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర తిరగరాస్తోంది. 2026 ఏప్రిల్ 30న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా సుమారు 14 మిలియన్ డాలర్ల బడ్జెట్తో (మన భారతీయ కరెన్సీలో రూ. 132 కోట్లు) రూపుదిద్దుకుంది. అయితే ఈ చిన్న బడ్జెట్తో తెరకెక్కిన చిత్రం బాక్సాఫీస్ వద్ద రాబట్టిన వసూళ్లు చూసి గ్లోబల్ ట్రేడ్ వర్గాలు సైతం నోరెళ్లబెడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా చైనాతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో ఏకంగా 300 మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. అంటే ఇండియన్ రూపాయిల్లో ఈ వసూళ్లు దాదాపు రూ. 2,849 కోట్లకు పైగానే ఉండటం విశేషం! పెట్టిన పెట్టుబడికి ఏకంగా ఇరవై రెట్లకు పైగా లాభాలను తీసుకొచ్చి 2026లో గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద సంచలనాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. చైనీస్ భాషలో 'డియర్ యూ' అంటే 'అమ్మమ్మకు ప్రేమలేఖ' అనే ఆత్మీయ భావం వస్తుంది. అప్పులు, కుటుంబ సమస్యల్లో కూరుకుపోయిన ఒక యువకుడు, థాయ్లాండ్లో కోటీశ్వరుడిగా స్థిరపడ్డాడని భావిస్తున్న తన తాతను వెతికేందుకు బయలుదేరడంతో ఈ కథ ప్రారంభమవుతుంది. తీరా అక్కడికి వెళ్లాక దశాబ్దాల క్రితం నాటి ఒక హృదయవిదారక రహస్యం బయటపడుతుంది. వలసల నేపథ్యం, మానవ అనుబంధాలు, ఫ్యామిలీ ఎమోషన్స్ చుట్టూ

దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ 2026లో సౌత్ జోన్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. నార్త్ జోన్తో జరిగిన రెండో సెమీఫైనల్లో సౌత్జోన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్పోర్ట్స్ డెస్క్: హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ అద్భుత ప్రదర్శనతో దులీప్ ట్రోఫీ 2026లో సౌత్ జోన్ జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-2 వేదికగా నార్త్ జోన్తో జరిగిన రెండో సెమీఫైనల్లో సౌత్ జోన్ 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 182 పరుగుల లక్ష్యాన్ని సౌత్ జోన్ 43.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. మ్యాచ్ విషయానికి వస్తే.. రెండో ఇన్నింగ్స్లో 7 వికెట్లు కోల్పోయి 267 స్కోరుతో బుధవారం ఆటను కొనసాగించిన నార్త్ జోన్.. 297 పరుగులకే ఆలౌటైంది. అనంతరం181 పరుగుల లక్ష్యాన్ని సౌత్ జోన్ 43.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు రికీ భుయ్ (42), నారాయణ్ జగదీశన్ (43) శుభారంభం అందించారు. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన కెప్టెన్ తిలక్ వర్మ (51*) రెండో ఇన్నింగ్స్లో అర్ధ సెంచరీతో రాణించాడు. రవిచంద్రన్ స్మరన్ (32*) తిలక్ వర్మకు సపోర్టుగా నిలిచి.. జట్టును విజయ తీరాలకు చేర్చాడు. తొలి ఇన్నింగ్స్లో నార్త్ జోన్ 195 పరుగులకే ఆలౌటైంది. సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ (116 నాటౌట్; 250 బంతులు) శతకంతో మెరవడంతో తొలి ఇన్నింగ్స్లో సౌత్ జోన్ 312 పరుగులు చేసి.. 117 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రెండు ఇన్నింగ్స్ల్లోనూ అదరగొట్టిన తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. తొలి సెమీ ఫైనల్లో సెంట్రల్ జోన్పై 4 వికెట్ల తేడాతో ఈస్ట్ జోన్ గెలిచిన విషయం తెలిసిందే. సెప్టెంబరు 6 నుంచి చెపాక్ స్టేడియంలో దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ మొదలుకానుంది. తుదిపోరులో ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్ జోన్తో సౌత్ జోన్ తలపడనుంది
హాలీవుడ్ ప్రముఖ కథానాయిక, 'వండర్ వుమెన్' ఫేమ్ గాల్ గాడోట్ నటించిన సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం 'ది రన్నర్' (The Runner) ఎలాంటి ముందస్తు థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. లండన్ నేపథ్యంగా సాగే ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రం కేవలం ఇంగ్లీష్లోనే కాకుండా భారతీయ ప్రేక్షకుల కోసం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల డబ్బింగ్ వర్షన్లలో అందుబాటులో ఉండటం విశేషం. గాల్ గాడోట్ క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రాన్ని తెలుగు డబ్బింగ్లో కూడా అందుబాటులోకి తేవడంతో టాలీవుడ్ ఓటీటీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కథాంశం విషయానికి వస్తే.. లండన్లోని ఓ ప్రముఖ లాయర్ పాత్రలో గాల్ గాడోట్ నటించారు. ఒక రోజు ఉదయం జాగింగ్కు వెళ్లిన ఆమెకు ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఆమె కుమారుడిని కిడ్నాప్ చేసినట్లు బెదిరిస్తూ, అతడు చెప్పిన ఆదేశాలను కచ్చితంగా పాటించాలని షరతు విధిస్తాడు. సమయం తక్కువగా ఉండటంతో తన కుమారుడి ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ తల్లి ఎలాంటి సాహసాలు చేసింది? కిడ్నాపర్ల ప్లాన్ను ఎలా తిప్పికొట్టింది? అనే ఉత్కంఠభరిత అంశాలతో దర్శకుడు కెవిన్ మెక్డొనాల్డ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సీటు అంచున కూర్చోబెట్టేలా ఉన్న స్క్రీన్ప్లే ఈ సినిమాకు ప్రధాన బలం. గాల్ గాడోట్ గతంలో 'వండర్ వుమెన్', 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్', 'రెడ్ నోటీస్', 'హార్ట్ ఆఫ్ స్టోన్' వంటి బిగ్ బడ్జెట్ యాక్షన్ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో ఒకవైపు తల్లిగా భావోద్వేగాలను పండిస్తూనే, మరోవైపు రేసింగ్ యాక్షన్ సీన్స్లో తన నటనతో మెప్పించారు. డెమియన్ లూయిస్, ఆల్ఫ్రెడ్ ఎనోచ్ తదితరులు కీలక పాత్రలలో కనిపించారు. ఓటీటీ రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ చిత్రంపై మంచి

ఆ హీరో ఫ్యాన్స్ మీరున్న సిటీలో మీ కళ్ళ ముందు ఉండే ఉంటారు.. అచ్చు ఆ హీరోలాగానే హెయిర్ స్టైల్, డ్రెస్, ఫేస్ కట్స్ తో 24 అవర్స్ ఆన్ మై హీరో యాటిట్యూడ్ అనేలా ఉండటం కూడా ఆ హీరో ఫ్యాన్స్ నైజం. కానీ ఆ హీరో సుమారు 270 చిత్రాల్లో చేస్తే 180కి పైగా ప్లాప్స్. పైగా ముప్పై ఏళ్ల పాటు సరైన సోలో హిట్ లేదు. నిజం సైతం నిజామా అని ఆశ్చర్యపోయినా కూడా ఇది నిజమే. కానీ తన క్రేజ్, స్టార్డమ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఆయనే భారతీయ సినీ యవనికపై 'డిస్కో డాన్సర్'గా ముద్ర వేసుకున్న హీరో మిథున్ చక్రవర్తి. . 1976లో ప్రముఖ దర్శకుడు మృణాల్ సేన్ తెరకెక్కించిన 'మృగయ' అనే క్లాసిక్ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసిన మిథున్, తొలి సినిమాతోనే ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత 1982లో వచ్చిన 'డిస్కో డాన్సర్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించారు. అప్పట్లోనే ఈ చిత్రం 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆ కాలపు అతిపెద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. అక్కడ నుంచి మిథున్ ఇండియాలోనే మోస్ట్ డిమాండింగ్ స్టార్లలో ఒకరిగా మారారు. అయితే కాలం మారే కొద్దీ కథల ఎంపికలో వేగం, క్వాలిటీ కంటే క్వాంటిటీకే ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. 90ల కాలంలో ఏడాదికి పదుల సంఖ్యలో, తక్కువ బడ్జెట్ మరియు వేగంగా పూర్తయ్యే సినిమాల్లో నటిస్తూ రికార్డులు క్రియేట్ చేశారు. దీనివల్ల ఆయన ఖాతాలో ఓటములు ఎక్కువగా చేరుతూ వచ్చాయి. 1993 నుంచి 1998 మధ్యకాలంలోనే ఆయన నటించిన 33 చిత్రాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. అలా తన మొత్తం కెరీర్లో 350కి పైగా చిత్రాల్లో నటించగా, ఏకంగా 180కి పైగా సినిమాలు తీవ్రమైన డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. దాదాపు 30 ఏళ్ల పాటు బాక్సాఫీస్

ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థ ఆపిల్ కొత్త సీఈఓ జాన్ టెర్నస్ వార్షిక వేతన ప్యాకేజీకి సంబంధించి కీలక వివరాలు బయటపడ్డాయి. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ దాఖలు చేసిన నివేదిక ప్రకారం ఆయన 2027 ఆర్థిక సంవత్సరానికి గాను 58 మిలియన్ డాలర్లు అంటే సుమారు 485 కోట్ల రూపాయల టార్గెట్ కాంపెన్సేషన్ పొందనున్నారు. ఇందులో బేసిక్ జీతం 3 మిలియన్ డాలర్లు కాగా 55 మిలియన్ డాలర్ల విలువైన ఈక్విటీ షేర్లు భాగమై ఉన్నాయి. ఆపిల్ సీఈఓ గా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజునే ఈ భారీ ప్యాకేజీ వివరాలు వెల్లడించడం కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జాన్ టెర్నస్ 2001లో ఆపిల్ సంస్థలో ప్రొడక్ట్ డిజైన్ ఇంజనీర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి గత 25 ఏళ్లుగా కంపెనీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. 2021 నుంచి హార్డ్వేర్ ఇంజనీరింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్, ఆపిల్ వాచ్ వంటి కీలక ఉత్పత్తుల రూపకల్పనను ఆయనే పర్యవేక్షించారు. అనంతరం ఏప్రిల్ 20, 2026న కంపెనీ బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుని సెప్టెంబర్ 1 నుంచి ఆయన్ను కొత్త సీఈఓగా నియమించింది. దీంతో సుదీర్ఘ కాలం పాటు సీఈఓగా సేవలు అందించిన టిమ్ కుక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పాత్రలోకి మారారు. ఈ మార్పులతో కంపెనీ నాయకత్వ పంపిణీలో స్పష్టమైన వ్యూహం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా ఆపిల్ సీఈఓ ప్యాకేజీలో 75 శాతం పర్ఫార్మెన్స్ ఆధారిత రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్లు కాగా మిగిలిన 25 శాతం టైమ్ ఆధారిత ఈక్విటీగా కేటాయించారు. బోర్డు నిర్దేశించిన స్టాక్ మార్కెట్ లక్ష్యాలను అందుకోవడంపైనే ఈ ప్యాకేజీ ఆధారపడి ఉంటుంది. మరోవైపు సెప్టెంబర్ చివరి వరకు ఆపిల్ ఆర్థిక సంవత్సరం కొనసాగుతున్నందున 2026 చివరి వారాల కోసం ఆయనకు అదనంగా 2.5 మిలియన్ డాలర్ల ప్రొరేటెడ్ షేర్లు మంజూరయ్యాయి. అదే సమయంలో 15

విధి చేసిన గాయం ఆ పసిపాప కాళ్లను తుంచేసింది. వయసు ఏడేళ్లు.. ఆడుతూ పాడుతూ బడికి వెళ్లాల్సిన సమయంలో ఒక కాలు లేక నరకం అనుభవిస్తోంది. ఊతకర్ర లేదు, చక్రాల కుర్చీ అంతకంటే లేదు.. కానీ, చదువుకోవాలనే ఆ చిన్నారి సంకల్పం ముందు ఆ వైకల్యం కూడా ఓడిపోయింది! విపరీతమైన పేదరికం, ఒంటికాలితో కుంటుతూ వెళ్లాల్సి వస్తున్నా సరే.. చదువుపై ఉన్న ఆరాటంతో రోజూ వందల మీటర్లు దూకుతూ బడి బాట పడుతోంది ఉత్తరప్రదేశ్ బాలిక రాగిణి. ఈ పసిపాప కష్టాన్ని చూసి ఇటు ఊరి జనం, అటు నెటిజన్లు కన్నీటి పర్యంతమవుతున్నారు.ఆరు నెలల వయసులోనే కోలుకోలేని దెబ్బ!యూపీలోని బల్లియా జిల్లా దిఘేడా గ్రామ పంచాయతీ పరిధిలోని రాణీపూర్ గ్రామానికి చెందిన ఏడేళ్ల రాగిణి కథ ఇది. ఈ చిన్నారికి కేవలం ఆరు నెలల వయసు ఉన్నప్పుడే ఒక దారుణమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో పాప ఒక కాలు తీవ్రంగా దెబ్బతింది. తండ్రి రెక్కాడితే గానీ డొక్కాడని కూలీ. తీవ్రమైన పేదరికం వల్ల ఆ చిన్నారికి సరైన వైద్యం చేయించలేకపోయారు. కాలక్రమేణా ఒక కాలు పూర్తిగా పాడైపోయింది. అలాగని రాగిణి ఇంట్లో కూర్చోలేదు. తోటి పిల్లలు బడికి వెళ్తుంటే తాను కూడా వెళ్తానని ఏడ్చేది. అలా స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతిలో చేరింది. Viral Video: వరదలో చిక్కుకున్న బైకర్.. చున్నీతో ప్రాణాలు కాపాడిన నవ వధువురోడ్డుపై ఏడుస్తూనే పాఠశాలకు..ఇంటి నుంచి బడికి ఉన్న 400 మీటర్ల దూరాన్ని రాగిణి ఒంటికాలితో ఎగురుతూ, కుంతుతూ చేరుకుంటుంది. ఈ ప్రయాణం ఆ చిన్నారికి నరకప్రాయంగా మారింది. దారి మధ్యలో అలసిపోయి, నొప్పి తట్టుకోలేక రోడ్డుపైనే కూర్చుని ఏడుస్తూ నాకే ఎందుకీ శిక్ష దేవుడా అని ప్రశ్నిస్తుంటుంది. మళ్లీ కాసేపటికి కన్నీళ్లు తుడ్చుకుని ఒంటికాలితోనే బడి వైపు అడుగులు వేస్తుంది. ఈ దయనీయ స్థితిని చూసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అమిత్ పాల్ యాదవ్

టీ5 సిరీస్లో వివో కొత్త స్మార్ట్ఫోన్ను భారత్లో విడుదల చేసింది. 7,050mAh బ్యాటరీ, 6.83 అంగుళాల 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో ఈ ఫోన్ వచ్చింది. 144Hz వరకు రిఫ్రెష్ రేట్, 50MP కెమెరా, 4కే వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సెప్టెంబర్ 9 నుంచి ఫ్లిప్కార్ట్లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి.వివో టీ5 5జీ ధర రూ.34,999 నుంచి మొదలవుతుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ఇది. 8జీబీ + 128జీబీ మోడల్ రూ.39,999, 8జీబీ + 256జీబీ ధర రూ.44,999. టాప్ వేరియంట్ 12జీబీ + 256జీబీ ధర రూ.49,999గా కంపెనీ నిర్ణయించింది. యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులతో రూ.4,000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. రాయల్ బ్రాంజ్, సిల్వర్ గ్రీన్ రంగుల్లో ఫోన్ అందుబాటులో ఉంటుంది.ఫోన్లో 6.83 అంగుళాల 1.5కే 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే ఉంది. 1260×2800 పిక్సెల్ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉన్నాయి. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68, ఐపీ69 రేటింగ్స్ ఇచ్చారు.4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో చిప్సెట్, మీడియాటెక్ ఎన్పీయూ 850 ప్రాసెసర్తో ఫోన్ పనిచేస్తుంది. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఉన్నాయివెనుక రెండు కెమెరాలు ఉన్నాయి. 50MP సోనీ ఐఎంఎక్స్882 మెయిన్ కెమెరాకు ఓఐఎస్ సపోర్ట్ ఉంది. దీనికి 8MP అల్ట్రావైడ్ కెమెరా జత చేశారు. ముందు 32MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 4కే వీడియో రికార్డింగ్
5/5దులీప్ ట్రోఫీ 2026/27 సీజన్లో సౌత్ జోన్ ఫైనల్కు దూసుకెళ్లింది. నార్త్ జోన్తో జరిగిన సెమీ ఫైనల్లో కెప్టెన్ తిలక్ వర్మ అద్భుతమైన కెప్టెన్ ఇన్నింగ్స్తో జట్టును ముందుండి నడిపించాడు. ఏడు వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని అందించి, టైటిల్ పోరుకు అర్హత సాధించేలా చేశాడు. సెప్టెంబర్ 6 నుంచి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే ఫైనల్లో ఇషాన్ కిషన్ నేతృత్వంలోని ఈస్ట్ జోన్తో సౌత్ జోన్ తలపడనుంది.మ్యాచ్ చివరి రోజు 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ జోన్కు కెప్టెన్ తిలక్ వర్మ (79 బంతుల్లో 51 నాటౌట్) అండగా నిలిచాడు. మొదటి ఇన్నింగ్స్లో కీలకమైన సెంచరీ (116 నాటౌట్)తో జట్టును ఆదుకున్న తిలక్, రెండో ఇన్నింగ్స్లోనూ అదే బాధ్యతాయుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. రవిచంద్రన్ స్మరణ్ (32 నాటౌట్)తో కలిసి నాలుగో వికెట్కు అబేధ్యంగా 80 పరుగులు జోడించి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు.అంతకుముందు నాలుగో రోజు ఆట ప్రారంభించిన నార్త్ జోన్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలని భావించింది. అయితే, సౌత్ జోన్ పేసర్ ఎండీ నిధీశ్ వారి ప్రణాళికలను దెబ్బతీశాడు. వరుస విరామాల్లో వికెట్లు తీసి నార్త్ జోన్ పతనాన్ని శాసించాడు. చివరి మూడు వికెట్లను పడగొట్టి, ఇన్నింగ్స్లో మొత్తం 5 వికెట్లు (5/56) సాధించాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అతనికి ఇది 10వ ఐదు వికెట్ల ప్రదర్శన. దీంతో నార్త్ జోన్ రెండో ఇన్నింగ్స్లో 297 పరుగులకు ఆలౌట్ అయింది.లక్ష్య ఛేదనలో సౌత్ జోన్కు ఓపెనర్ రికీ భుయ్ (42) దూకుడైన

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Mamitha Baiju Hospitalised News: చిత్రసీమలో వరుస విజయాలతో అద్భుతమైన క్రేజ్ సంపాదించుకున్న ప్రముఖ యువ కథానాయిక మమితా బైజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను ప్రస్తుతం ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటన రద్దు..వేడుకలు వాయిదా.. సెప్టెంబర్ 5న ఆస్ట్రేలియాలో అత్యంత వైభవంగా జరగాల్సిన 'క్లైడ్ ఓనం 2026' వేడుకలకు మమితా బైజు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. అయితే అకస్మాత్తుగా ఆమె ఆరోగ్యం క్షీణించడంతో, వైద్యుల సలహా మేరకు ఆమె తన ఆస్ట్రేలియా పర్యటనను పూర్తిగా రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని 'క్లైడ్ మలయాళీ అసోసియేషన్' సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటిస్తూనే, ఆమె లేకపోవడంతో ఓనం వేడుకలను కూడా తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అభిమానులకు క్షమాపణలు చెప్పిన మమిత.. ఈ మేరకు క్లైడ్ మలయాళీ అసోసియేషన్ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మమితా బైజు ఈ వీడియోలో స్వయంగా మాట్లాడుతూ.. అనారోగ్య కారణాల వల్ల, వైద్యుల సూచనల మేరకు తాను ప్రయాణం చేయలేకపోతున్నానని తెలిపారు. ప్రయాణాలు చేయడం వల్ల శారీరక నొప్పులు, అలర్జీలు పెరుగుతాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణించవద్దని డాక్టర్లు హెచ్చరించారని, పూర్తి విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారని చెప్పారు. తనను ఎంతగానో ఆహ్వానించిన నిర్వాహకులకు, ఆస్ట్రేలియా అభిమానులకు క్షమాపణలు చెబుతూ, త్వరలోనే పూర్తిగా కోలుకుని కలుసుకుంటానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న క్రేజ్.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో

నిత్యం గొంతు సమస్యలతో ఇబ్బంది పడతుంటే ఇది తాగితే రిలీఫ్ నిత్యం గొంతు సమస్యలతో ఇబ్బంది పడతుంటే ఇది తాగితే రిలీఫ్ Prasanna Yadla 02 september 2026 Pic credit - Pinterest కొందరు నిత్యం గొంతు సమస్యలతో ఇబ్బంది పడతూనే ఉంటారు అలాంటి వాళ్లు ఈ బోన్ సూప్ తాగితే మంచిది గొంతు సమస్యలు ముందుగా మీరు మటన్ తీసుకుని ఎముకలను బాగా కడిగి పసుపు, ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి మటన్ ఆ తరువాత వీటిని ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ వేసి దాల్చిన చెక్క, నాలుగు లవంగాలు, 5 యాలకులు వేసి వేయించాలి. ప్రెషర్ కుక్కర్లో ఇంకా దీనిలో ఉల్లిపాయ, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి 5 నిముషాలు పచ్చి వాసన పోయే దాకా వేయించాలి. ఉల్లిపాయ, అల్లం-వెల్లుల్లి పేస్ట్ ఇక ఇప్పుడు క్లీన్ చేసిన మటన్ బోన్స్ కూడా 5 నిమిషాల పాటు వీటిని బాగా వేయించాలి. మటన్ బోన్స్ ఇంకా దీనిలో కొద్దిగా పసుపు, ఒక టీ స్పూన్ కారం, టీ స్పూన్ మిరియాల పొడి ఉప్పు వేసి కలపాలి. ఈ బోన్స్ మొత్తం మునిగేలా నీళ్లు పోసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి, 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి దించడమే మటన్ బోన్ సూప్ (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి

ఆంజనేయుడి కంటే ముందే రామాయణంలో సీతమ్మ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన వీరుడు జటాయువు. అదే పేరుతో ఢిల్లీ జూలో నివసిస్తున్న ఒక ఈజిప్షియన్ రాబందు జీవితం కూడా ఒక రకంగా విషాదకరమైన పోరాటమే! గత ఇరవై ఏళ్లుగా నాలుగు గోడల మధ్య, ఎవరూ లేని ఒంటరితనంతో.. నిశ్శబ్దంగా నరకం అనుభవించిన ఈ జటాయువు జీవితంలోకి ఎట్టకేలకు ఒక వెలుగురేఖ రాబోతోంది. రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ.. అతనికి ఒక భాగస్వామిని తెచ్చేందుకు ఢిల్లీ జూ అధికారులు ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్వేషణ మొదలుపెట్టారు.సుమారు ఇరవై ఏళ్ల క్రితం సుదూర ప్రాంతాల నుంచి వలస వస్తూ దారితప్పి, గాయపడి ఢిల్లీ తీరంలో వాలినప్పుడు అధికారులు ఈ రాబందును రక్షించారు. ఢిల్లీ జూకి తీసుకొచ్చి ప్రేమాభిమానాలతో జటాయువు అని పేరు పెట్టారు. అయితే కాలం గడిచేకొద్దీ వయోభారం, ఆరోగ్య సమస్యలతో జూలోని మిగతా రాబందులు ఒక్కటొక్కటిగా కన్నుమూశాయి. చివరికి జటాయువు మాత్రం ఒంటరిగా మిగిలిపోయాడు.సాధారణంగా ఈజిప్షియన్ రాబందులు 25 ఏళ్లకు పైగానే జీవిస్తాయి. 5 ఏళ్ల వయస్సు నుంచే జంటగా మారి ఒకే భాగస్వామితో జీవితాంతం కలిసి ఉంటాయి. కానీ మన జటాయువు మాత్రం తన జీవితంలోని బంగారంలాంటి సమయాన్నంతటినీ తోడు లేకుండానే గడిపేశాడు. ఇప్పుడు ఈ ఒంటరితనానికి ముగింపు పలికేందుకు అధికారులు నిబంధనల ప్రకారం జంతు మార్పిడి విధానంలో రెండు ప్రముఖ జూలతో చర్చలు జరుపుతున్నారు.జూలో ఒంటరి జీవితాలు.. మరో 16 జీవులకు తోడు కోసం వెతుకులాట!కేవలం జటాయువు మాత్రమే కాదు, ఢిల్లీ జూలో తోడు లేక రోదిస్తున్న జీవులు మరో 15 వరకు ఉన్నాయి. 2021లో తీసుకొచ్చిన రెండు మగ ఆస్ట్రిచ్లకు (ఉష్ట్రపక్షులు) ఆడ తోడు లేదు. అలాగే 2018 నుంచి ఒక రియా పక్షి, 2022 నుంచి ఒక మగ బార్న్ గుడ్లగూబ, గ్రే లాంగూర్, బ్లాక్ స్వాన్, చిన్న భారతీయ పునుగుపిల్లి వంటివి కూడా జంటలు లేక ఒంటరిగా

'ప్రేమలు' మూవీతో యూత్ హార్ట్స్ లో తిష్ట వేసిన భామ మమితా భైజు. రీసెంట్ గా విశ్వనాధ్ అండ్ సన్స్ తో భారీ హిట్ అందుకొని సౌత్ ఇండియా క్రేజీ హీరోయిన్ గా మారింది. ఇప్పుడు ఉన్నట్టుండి హఠాత్తుగా ఆసుపత్రిలో జాయిన్ కావడం అభిమానులతో పాటు పరిశ్రమ వర్గాలని షాక్ కి గురి చేస్తుంది. హాస్పిటల్ లో జాయిన్ కావడానికి గల కారణాన్ని అధికారకంగా ప్రకటించకపోయినా జ్వరం, , ఆస్తమా, అలర్జీ లాంటి సమస్యలతో బాధపడుతున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ నెల 5న ఆస్ట్రేలియా దేశంలోని మెల్బోర్న్లో జరగాల్సి ఉన్న 'క్లైడ్ మలయాళీ' ఓణం వేడుకలకి మమిత చీఫ్ గెస్ట్ గా హాజరుకావాల్సి ఉంది. దీంతో ఆ పర్యటన కూడా రద్దయింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా మమిత బైజూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆ వీడియోలో 'ఆస్ట్రేలియా పర్యటన రద్దు కావడం నాకు చాలా పెద్ద లోటు. అనుకున్న దాని ప్రకారం రాలేకపోతున్నందుకు ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నాను. వీలైతే ఎలాగైనా రావాలని అనుకున్నాను కానీ ఆరోగ్య పరిస్థితి సహకరించడం లేదు" అని ఆవేదన వ్యక్తం చేశారు. మమిత ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలిసిన వెంటనే ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.సినిమాలతో నిరంతరం బిజీగా గడపడం, తీవ్రమైన పని ఒత్తిడి వల్లనే ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్న సమయంలో మమిత బైజూ ఇలా ఆసుపత్రి పాలవ్వడం అందరినీ కలవరపెట్టినప్పటికీ, వైద్యుల పర్యవేక్షణలో ఆమె త్వరలోనే కోలుకొని మళ్లీ షూటింగ్లలో పాల్గొంటారని అభిమానులు ఆశిస్తున్నారు. సంకల్ప సాధకుడు కల్యాణ్ బాబు.. తమ్ముడికి మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే విషెస్ 200 కోట్లకి చేరువలో: మరో డివోషనల్

మాస్ మహారాజ రవితేజ, నక్షత్ర, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్, హరిహర సుతుడు అయ్యప్ప ల 'ఇరుముడి' 200 కోట్ల రూపాయిలు చేరుకోవడానికి రెడీ అవుతుంది. తాజాగా ఇరుముడి నుంచి సరికొత్త డివోషనల్ వీడియో సాంగ్ 'కార్తీక మాసం' విడుదలై అభిమానులని ప్రేక్షకులని ఎంతోగానో ఆకట్టుకుంటోంది. స్వామి అయ్యప్ప భక్తి పారవశ్యాన్ని, మండల దీక్షా నియమాలను ఎంతో లోతుగా ఆవిష్కరించిన ఈ పాట ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకేలా ఉంది. ఈ అద్భుతమైన గీతానికి దర్శకుడు శివ నిర్వాణ స్వయంగా సాహిత్యాన్ని అందించగా, జి. వి. ప్రకాష్ కుమార్ తో కలిసి శివ నిర్వాణ ఆలపించాడు 4 నిమిషాల 5 సెకన్ల నిడివితో ఉండగా నేరుగా శబరిమల భక్తి లోకంలోకి తీసుకెళ్తుంది. "ఇది మరి కార్తీక మాసం స్వామి... తలపై చన్నీళ్ల స్నానం కాని మనసే మరింత భద్రం స్వామి" అంటూ సాగే లిరిక్స్ దీక్షా ధారుల జీవితాన్ని, శారీరక కష్టాలను దాటి పొందే ఆధ్యాత్మిక ప్రశాంతతను ప్రతిబింబిస్తాయి. భక్తులు పడే తపన, చలిలో ఉదయాన్నే చేసే స్నానాలు, కటిక నేలపై పడుకునే నిరాడంబరమైన జీవనశైలిని చాలా సహజంగా ఈ పాటలో వర్ణించారు. పాటలోని అతి ముఖ్యమైన అంతరార్థం ఏమిటంటే— "కనిపించని శత్రువు కాదు, యుద్ధం కాదీ మండల దీక్ష... నాతోటి నేనే చేసే యుద్ధమే ఈ దీక్ష". బయటి సమాజంతో లేదా శత్రువులతో చేసే పోరాటం కాదు మండల దీక్ష, మనలోని అహంకారాలు, ద్వేషాలు, కామక్రోధాలపై మనతో మనమే చేసే అంతర్యుద్ధం అనే గొప్ప సందేశాన్ని ఈ పాటకు శివ నిర్వాణ అందించారు. అలాగే "నేను అంటే నువ్వే అంటూ స్వామి పదవి ఇచ్చావు... ద్వేషాల్ని దూరం చేసి వర్ణాన్ని ఒక్కటి చేసి" అని అయ్యప్ప దీక్షలోని సమభావనను ఎత్తిచూపారు. కులమతాల భేదం లేకుండా, చిన్నపెద్ద తారతమ్యం లేకుండా నల్లటి దుస్తులు ధరించి ప్రతి ఒక్కరినీ 'స్వామి' అని పిలుచుకునే ఆచారాన్ని

థియేటర్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ప్యాకేజ్డ్ మూవీ 'పంజా' జోరు కొనసాగుతూ ఉంది.ఆ ఏరియా, ఈ ఏరియా అని కాకుండా ఆల్ ఏరియాస్ హౌస్ ఫుల్ బోర్డ్స్ తో దర్శనమిస్తున్నాయి. నిన్న ప్రీమియర్స్ ప్రదర్శించడం, అవి కూడా ఫుల్ కావడం కూడా ఒక రికార్డు. డిజాస్టర్ మూవీకి ఈ స్థాయి క్రేజా అని ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన కేవలం 3 గంటల్లోనే హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో 150కి పైగా షోలు పూర్తిగా సోల్డ్ అవుట్ కావడం పవన్ మేనియాకు అద్దం పడుతోంది. నైజాం ఏరియాలో రీ రిలీజ్ మొదటి రోజే 1.2 కోట్ల షేర్ సాధించి ట్రేడ్ పండితులను సైతం షాక్కి గురిచేసింది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 220కి పైగా స్క్రీన్లలో రిలీజవ్వగా ప్రతి థియేటర్ వద్ద 100% ఆక్యుపెన్సీ నమోదు కావడం గమనార్హం. ఈ రీ-రిలీజ్ హంగామా కేవలం థియేటర్ల లోపలే కాదు, బైట కూడా జాతరను తలపిస్తోంది. అభిమానులు బ్యానర్లు, కటౌట్లు, పాలాభిషేకాలు మరియు బాణసంచా కాల్పులతో థియేటర్ కాంప్లెక్స్లను పండగ వాతావరణంగా మార్చేశారు. ‘పాప రాయుడు’ పవర్ ఫుల్ సీన్స్, ఇంటర్వెల్ ఫైట్ అండ్ మేజర్ క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ వస్తున్నప్పుడు థియేటర్లలో ఆడియెన్స్ చేస్తున్న విజిల్స్, కేకలతో హాల్స్ దద్దరిల్లుతున్నాయి. కాలం మారినా, ఏళ్లు గడిచినా 'జై' రోల్ లో పవన్ ప్రదర్శించిన రోల్ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుందని చెప్పడానికి రీ రిలీజ్ ఒక ఉదాహరణ. 2011 డిసెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా రూ. 30 కోట్ల భారీ బడ్జెట్తో విడుదలైన ‘పంజా’, అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రూ. 28 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆశించిన స్థాయిలో వాణిజ్య విజయం సాధించలేకపోయింది. అయితే, కాలక్రమేణా ఈ సినిమాకు ఒక ప్రత్యేకమైన కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా స్టైలిష్ విజువల్స్, యువన్ శంకర్ రాజా అందించిన ఐకానిక్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి అత్యంత ఉద్రిక్త రూపం దాల్చింది. రష్యాపై మునుపెన్నడూ లేని రీతిలో అతిపెద్ద డ్రోన్ దాడులు చేయడానికి సిద్ధమైనట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఏ క్షణంలోనైనా ఈ దాడులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున రష్యా గగనతలం పౌర విమానయానానికి ఎంతమాత్రం సురక్షితం కాదని, మాస్కోలోని విమానాశ్రయాలు కూడా తమ లక్ష్యాలలో భాగమేనని ఆయన స్పష్టం చేశారు. పౌర విమానాలు తమ టార్గెట్ కాదనే ఉద్దేశంతోనే ముందస్తుగా ఈ బహిరంగ హెచ్చరిక జారీ చేశామని, అంతర్జాతీయ విమానయాన సంస్థలు, విదేశీ ప్రభుత్వాలు ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణించి ఆ ప్రాంతంలో ప్రయాణాలను తక్షణమే నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. రష్యా స్వయంగా ప్రారంభించిన యుద్ధం వల్లే నేడు ఆ దేశానికి ఈ దుస్థితి ఎదురైందని ఆయన వ్యాఖ్యానించారు. జెలెన్స్కీ చేసిన ఈ బహిరంగ హెచ్చరికలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉక్రెయిన్ వైఖరి ఉగ్రవాదుల తీరును తలపిస్తోందని ఆరోపించారు. అంతర్జాతీయంగా తమపై ఎంత ఒత్తిడి వచ్చినా, ఉగ్రవాద తరహా చర్యలకు పాల్పడుతున్నవారితో ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని పుతిన్ తెగేసి చెప్పారు. ఈ పరిణామాల మధ్యనే మంగళవారం రాత్రి ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా జరిపిన విధ్వంసకర దాడుల్లో 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు, రష్యా సైన్యంలో చేరిన 51 మంది భారతీయులు ఈ యుద్ధంలో మృతి చెందినట్లు వెలువడిన వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి

ప్రపంచదేశాల ఎయిర్లైన్స్ సంస్థలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచదేశాల ఎయిర్లైన్స్ సంస్థలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు తాజాగా కీలక హెచ్చరికలు జారీ చేశారు. రష్యా గగనతలం దాదాపుగా మూతబడినట్టేనని చెప్పారు. ఆవైపు వెళ్లొద్దని హెచ్చరించారు. రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు పెరిగిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మేమేమీ పౌర విమానయాన సంస్థలను టార్గెట్ చేయడం లేదు. కానీ రష్యా గగనతలంలో భారీ స్థాయిలో డ్రోన్స్ ఉండటం వల్ల రిస్క్ను పరిగణనలోకి తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. రష్యా ప్రారంభించిన యుద్ధం వల్ల ఆ దేశ గగనతలమే మూత పడే స్థితి వచ్చిందని చెప్పారు. సెయింట్ పీటర్స్ బర్గ్, మాస్కో వంటి నగరాల గగనతలంలో విమానాలను ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ అద్యక్షుడి వ్యాఖ్యలను రష్యా అధ్యక్షుడు పుతిన్ ఖండించారు. అవి ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ప్రతిబింబిస్తున్నాయని మండిపడ్డారు. తామూ ఉక్రెయిన్పై దాడులను కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ఇటీవల కిర్గిస్థాన్లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో కూడా పుతిన్ ఉక్రెయిన్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘వాళ్లు చర్చలకు సిద్ధమేనని అంటున్నారు. కానీ ఉగ్రవాదులతో ఎలాంటి చర్చలు ఉండవు’ అని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, పాశ్చాత్య దేశాల ఎయిర్లైన్స్ ఇప్పటికే రష్యాకు విమానాల రాకపోకలను నిలిపివేశాయి. చైనా ఎయిర్లైన్స్ సేవలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇక రష్యా గగనతలంలో పౌర ఎయిర్లైన్స్ సంస్థలకు రిస్క్ ఉందని పౌరవిమానయాన రంగ కన్సల్టెన్సీ సంస్థ ఆస్ప్రే ఫ్లైట్ సొల్యూషన్స్ చెప్పింది. ప్రస్తుతం, రష్యా సరిహద్దుకు 300 కిలోమీటర్ల లోపల వరకూ ఉక్రెయిన్ డ్రోన్ దాడులు జరుగుతున్నాయని చెప్పింది. దాడుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. పెళ్లింటిపై దాడి చేస్తారా? యూఎస్పై భగ్గుమన్న ఇరాన్ సుప్రీం లీడర్ ఉక్రెయిన్పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి

ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. మరి మెగా స్టార్ చిరంజీవికి ఉండే ఆనందం అంతా ఇంతా కాదు. ప్రతి సంవత్సరం పవన్ కి తనదైన శైలిలో శుభాకాంక్షలు చెప్తూ అభిమానుల్లో జోష్ నింపుతూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం మాత్రం అంతకు మించిన ట్వీట్ తో సోషల్ మీడియాకి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవడం టూ డే టాక్ అఫ్ ది డే. 'ఎక్స్' వేదికగా 'సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు.కేవలం చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగానే కాకుండా ప్రజా జీవితంలో జనసేనానిగా, ఏపీ డిప్యూటీ సీఎంగా ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్నాడు. అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రమించని గుణం, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే తత్వం పవన్ సొంతం. కళ్యాణ్ బాబు ఆయురారోగ్యాలతో, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ ప్రజలకు మరింతగా సేవ చేసే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలి" అని ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఘనంగా జరుగుతున్నాయి. అభిమానుల్లో మరింత జోష్ నింపేలా 'పంజా' మూవీ ఈ రోజు రీ రిలీజై థియేటర్స్ లో సందడి చేస్తుంది. అంతర్జాతీయ సినిమా వేదికగా జమ్మూకశ్మీర్.. రూ. 96 లక్షల ప్రైజ్ మనీతో వైభవంగా వేడుకలు.!
30 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఎముకలు బలహీనపడుతూ వస్తాయి. దీంతో తరచూ ఎముకల నొప్పి వేధిస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు ఎక్కువగా ఉండే గింజలు, విత్తనాలు డైట్లో చేర్చుకోవడం చాలా అవసరం. ఈ నేపథ్యంలో 30 ఏళ్లలోనూ ఎముకలను బలంగా ఉంచే ఆ గింజలు ఏంటో తెలుసుకుందాం. అన్ని గింజలతో పోలిస్తే బాదం గింజల్లో కాల్షియం, మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వయసు పెరిగినా ఎముకలు బలంగా ఉండాలంటే రోజూ నాలుగైదు బాదం గింజలు నానబెట్టి తినడం చాలా మంచిది. గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, ఫాస్పరస్ ఎక్కువగా లభిస్తాయి. రోజూ గుప్పెడు గుమ్మడి గింజలు తినడం ద్వారా ఎముకలు పెలుసుబారకుండా చూసుకోవచ్చు. నువ్వుల్లో ఎముకల బలానికి సహాయపడే కాల్షియం, జింక్ ఎక్కువగా లభిస్తాయి. అందుకే పిల్లలతో పాటు పెద్దలు ఎముకలు బలానికి నువ్వులతో చేసిన ఆహారాలు తినడం చాలా మంచిది. చియా సీడ్స్లో కాల్షియంతో పాటు ఫాస్పరస్, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకల బలాన్ని పెంచడంలో సహాయపడతాయి. వాల్నట్స్లో హెల్తీ ఫ్యాట్స్, మెగ్నీషియం మెండుగా ఉంటాయి. ఇవి ఎముకల బలాన్ని పెంచుతాయి. ఆస్టియోపోరోసిస్ రాకుండా కాపాడుతాయి. అవిసె గింజల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇంఫ్లమేషన్ తగ్గించి ఎముకలను బలంగా ఉంచుతాయి. పిస్తా గింజల్లో విటమిన్ బి6, పొటాషియం వంటి పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. రోజూ గుప్పెడు పిస్తా గింజలు తింటే ఎముకలను బలంగా ఉంచుకోవచ్చు. పొద్దుతిరుగుడు గింజల్లో మెగ్నీషియం, కాపర్, విటమిన్ ఇ వంటి ఆవశ్యక పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకలను హెల్తీగా ఉంచుతాయి

ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ లేని లైఫ్ను ఊహించుకోవడం కూడా కష్టమే. కాల్స్ మాట్లాడటం దగ్గర్నుంచి ఇంటర్నెట్, బ్యాంకింగ్, ఎంటర్టైన్మెంట్ వరకు అన్నింటికీ ఫోనే ఆధారం. కూడు, గూడు మాదిరిగా ఫోన్ కూడా మనిషి నిత్యావసర వస్తువుల్లో భాగమయ్యింది. ఇలా నిత్యజీవితంలో ఎంతో కీలకంగా మారిన స్మార్ట్ ఫోన్ ను చాలా జాగ్రత్తగా వాడాలి... ముఖ్యంగా బ్యాటరీ, ఛార్జింగ్ విషయంలో చేసే చిన్నచిన్న పొరపాట్లు పెద్ద సమస్యలకు దారితీయొచ్చు. మరీముఖ్యంగా ఛార్జింగ్ తీసేటప్పుడు చాలామంది కామన్ గా ఓ తప్పు చేస్తుంటారు, కానీ దాన్ని పెద్దగా పట్టించుకోరు... అదే ఫోన్, ఛార్జర్ రెండింటిని డ్యామేజ్ చేయవచ్చు. చాలామంది ఫోన్ లో ఛార్జింగ్ ఫుల్ అయ్యాక ఛార్జర్ కేబుల్ను పట్టుకుని గబుక్కున లాగేస్తుంటారు. ఇది పూర్తిగా తప్పుడు పద్ధతి. ఇలా ఛార్జర్ కేబుల్ను లాగినప్పుడు దాని లోపల ఉండే సన్నని వైర్లు, కనెక్టర్పై అనవసరంగా ఒత్తిడి పడుతుంది. పదేపదే ఇలాగే చేస్తే ఛార్జింగ్ కేబుల్ తొందరగా పాడైపోతుంది. అంతేకాదు మీ ఫోన్లో కూడా ఛార్జింగ్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది… కొన్నిసార్లు ఫోన్ బ్యాటరీపై ఒత్తిడి పెరిగి పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఫోన్ నుండి ఛార్జర్ ను వేరుచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఫోన్ నుండి ఛార్జర్ తీసేసే సరైన పద్ధతి ఏంటి? ఫోన్ నుండి ఛార్జింగ్ కేబుల్ తీసేటప్పుడు వైర్ను పట్టుకుని లాగకూడదు... ఫోన్కు కనెక్ట్ అయి ఉన్న ప్లాస్టిక్ లేదా మెటల్ భాగాన్ని (కనెక్టర్ హెడ్) వేళ్లతో పట్టుకుని నెమ్మదిగా బయటకు తీయాలి. దీనివల్ల కేబుల్పై ఎలాంటి ఒత్తిడి పడదు, అది ఎక్కువ కాలం మన్నుతుంది. ఇలా జాగ్రత్తగా చార్జర్ ను తొలగించడం వల్ల ఫోన్ బ్యాటరీ కూడా సేఫ్ గా ఉంటుంది. ఒకవేళ మీ ఫోన్ ఛార్జింగ్ కేబుల్ పాడైపోయినా లేదా వైర్లు బయటకు కనిపిస్తున్నా దాన్ని వాడటం అస్సలు మంచిది కాదు. అలాంటి డ్యామేజ్ అయిన కేబుల్స్.. ఛార్జింగ్

Fake PhonePe Payment: హైదరాబాద్ అంబర్పేటలో ఏటీఎంల వద్ద అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని నకిలీ ఫోన్పే, గూగుల్పే యాప్లతో మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులతో పాటు ఓ బాల నేరస్థుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు బైకులు, నాలుగు మొబైల్ ఫోన్లు, రూ.12,500 నగదును స్వాధీనం చేసుకున్నట్లు అంబర్పేట ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. అంబర్పేట శివంరోడ్డులోని ఎస్బీఐ ఏటీఎం వద్ద నగదు తీసుకునేందుకు లేదా డిపాజిట్ చేసేందుకు వచ్చే వారిని నిందితులు టార్గెట్ చేసేవారని పోలీసులు తెలిపారు. మాటల్లో పెట్టి.. ఫోన్పే లేదా గూగుల్పే ద్వారా డబ్బులు పంపిస్తామని నమ్మించేవారు. బాధితుల నుంచి నగదు తీసుకున్న తర్వాత.. నకిలీ యాప్ ద్వారా తయారు చేసిన ‘ట్రాన్సాక్షన్ సక్సెస్’ స్క్రీన్ను చూపించి అక్కడి నుంచి పరారయ్యేవారని పోలీసులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: House Construction: ఇంటి స్లాబ్పై లక్షలోపే రేకుల ఇల్లు నిర్మాణం.. దేనికి ఎంత ఖర్చు..! ఈ తరహా మోసాలకు సంబంధించి గత నెలలో అంబర్పేట పోలీసులకు నాలుగు ఫిర్యాదులు అందినట్లు ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. అంబర్పేట ఎస్బీఐ పర్సనల్ బ్యాంకింగ్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో నిందితులను గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు మొబైల్ ఫోన్లు, రూ.12,500 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుల పాత్రపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్పే, గూగుల్పే లావాదేవీల సమయంలో స్క్రీన్షాట్ లేదా ‘పేమెంట్ సక్సెస్’ మెసేజ్ను మాత్రమే నమ్మి నగదు ఇవ్వవద్దని పోలీసులు సూచించారు. డబ్బు నిజంగా తమ ఖాతాలో జమ అయ్యిందో లేదో బ్యాంక్ యాప్, ఖాతా బ్యాలెన్స్ లేదా ఇతర అధికారిక మార్గాల ద్వారా స్వయంగా ధృవీకరించుకున్న తర్వాతే నగదు ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ఇది కూడా చదవండి

డేటింగ్ యాప్ ఓ యువకుడి కొంపముంచింది. యాప్లో అమ్మాయి ఫొటో చూసి డేటింగ్ మొదలెట్టిన ఆ యువకుడు స్కామ్కు గురయ్యాడు. నేరగాళ్లు తెలివిగా అతడి వద్ద నుంచి వేల రూపాయలు దోచేశారు. ఇంటర్నెట్ డెస్క్: డేటింగ్ యాప్ ఓ యువకుడి కొంపముంచింది. యాప్లో అమ్మాయి ఫొటో చూసి డేటింగ్ మొదలెట్టిన ఆ యువకుడు స్కామ్కు గురయ్యాడు. నేరగాళ్లు తెలివిగా అతడి వద్ద నుంచి వేల రూపాయలు దోచేశారు. ఈ సంఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత యువకుడు రెడ్డిట్లో తనకు జరిగిన మోసంపై ఓ పోస్టు పెట్టాడు. ఆ పోస్టులో ఏం జరిగిందో వివరించాడు. ‘డేటింగ్ యాప్ ద్వారా షెల్లీ అనే అమ్మాయితో డేటింగ్ మొదలెట్టాను. కొన్ని రోజుల పాటు ఫోన్లో మాట్లాడుకున్నాము. ఆఫీస్ వర్క్ కారణంగా ఆమెను నేరుగా కలవలేకపోయాను. కానీ, తరచుగా ఫోన్లో మాట్లాడుకునే వాళ్లం. ఆఫీస్ వర్క్ నుంచి విరామం దొరకటంతో ఆమెను కలవాలని అనుకున్నాను. ఆమెకు ఫోన్ చేసి కలుద్దామన్నాను. ‘నేను ఓ సిగరెట్ ప్యాకెట్ ఆర్డర్ పెట్టాను. దాన్ని నువ్వు డెలివరీ తీసుకో’ అని ఆమె చెప్పింది. రాన్ అనే వ్యక్తి ఫోన్ నంబర్ ఇచ్చింది. అతడికి ఆన్లైన్లో డబ్బులు పంపిస్తే.. తాను స్వయంగా వచ్చి డబ్బులు ఇస్తానని ఆమె చెప్పింది. నాకు కొంచెం విచిత్రంగా అనిపింది’.. ‘మా అమ్మ బిజినెస్ చేస్తోంది. మా దగ్గర ఆన్లైన్ క్యాష్ కంటే నగదు ఎక్కువగా ఉంది’ అని చెప్పింది. నేను ఆమె మాటలు నమ్మక తప్పలేదు. ఆమె ఇచ్చిన నంబర్ను సంప్రదించాను. ఆన్లైన్ ద్వారా అతడికి కొంత డబ్బులు పంపాను. తర్వాతి నుంచి ఇద్దరూ నా నంబర్ బ్లాక్ చేశారు. నన్ను మోసం చేయడానికి చాలా పక్కాగా ప్లాన్ వేశారు. ఎంతో జాగ్రత్తగా వాళ్లు మనుషుల్ని ఫూల్స్ చేసి, డబ్బులు దోచేస్తున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. బాబర్ ఆజమ్కు జ్వరం.. పాక్ జట్టులో మరింత గందరగోళం!
Yash Baxi World Record 2026 : ఏ చిన్న లెక్క చేయాలన్నా ఇప్పడందరూ ఫోన్లోనే కాలుక్యులేటర్ ఓపెన్ చేసి లెక్కించేస్తారు. లేదంటే ఏఐ, గూగుల్ సాయంతో తమకు కావాల్సిన విషయాలను తెలుసుకుంటారు. కానీ మనసులోనే 120 దేశాల్లో ఎక్కడెంత టైమ్ అవుతుందని కేవలం 5 నిమిషాల్లోనే చెప్పి ప్రపంచ రికార్డు సాధించాడు అహ్మదాబాద్కు చెందిన ఓ యువకుడు. 21 ఏళ్ల వయసు కల్గిన యశ్ హేమాంగ్ బక్షి ఈ రికార్డును సాధించగా.. అంతా ఆశ్చర్యపోతున్నారు. ఎలాంటి డివైజ్లు, చార్టులు, కనీసం కాగితం సహాయం లేకుండా కేవలం తన మెదడు శక్తితోనే 120 దేశాల స్థానిక సమయాన్ని 5.14 నిమిషాల వ్యవధిలోనే లెక్కించి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో.. ప్రపంచంలోని వివిధ కాలమానాలు, అర్ధగంట, 45 నిమిషాల తేడాల వ్యత్యాసాలను కూడా అత్యంత ఖచ్చితత్వంతో గణించి అందరినీ ముగ్ధులను చేశాడు.పాత రికార్డును తిరగరాసిన యష్ బక్షి..!గతంలో భారత ప్రమాణ సమయం ఆధారంగా 101 దేశాల స్థానిక సమయాన్ని 14 నిమిషాల 42 సెకన్లలో లెక్కించి 'ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్', 'ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్'లలో యశ్ తన పేరును నమోదు చేసుకున్నాడు. అయితే ఈసారి తన స్వంత రికార్డునే తిరగరాస్తూ.. ఏకంగా 120 దేశాల సమయాన్ని కేవలం 5.14 నిమిషాల్లోనే చెప్పి సరికొత్త ప్రమాణాన్ని నెలకొల్పాడు. 'వరల్డ్ రికార్డ్ యూనియన్' ప్రతినిధి షరీఫా హనీఫా ఈ ఘనతను స్వయంగా పరిశీలించి అధికారికంగా ప్రపంచ రికార్డుగా ప్రకటించారు.ఇదీ చూడండి: ఒకే కుటుంబానికి 20 గిన్నిస్ వరల్డ్ రికార్డులు.. అబ్బురపరుస్తోన్న హైదరాబాదీ ఫ్యామిలీయశ్ సాధించిన ఈ అరుదైన మైలురాయి వెనుక ఆయన గురువు కమలేష్ సుర్తి ఎంతో శ్రమించారు. గత కొన్నేళ్లుగా యశ్కు శిక్షణ ఇస్తున్న కమలేష్ సుర్తి.. బట్టీ పట్టే విధానం కాకుండా విద్యార్థులలోని సహజ ప్రతిభను గుర్తించి దానికి తగిన శిక్షణ ఇవ్వడంలో ప్రసిద్ధులు. "యశ్

మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా ఇరాన్పై తాజా దాడులకు దిగింది. ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కు చెందిన లక్ష్యాలపై విరుచుకుపడింది. ఒమన్ గల్ఫ్లో అమెరికా యుద్ధనౌకలపై ఇరాన్ క్షిపణులను ప్రయోగించడమే దీనికి కారణం. దీనికి ప్రతిగా ఇరాన్ సైతం వైమానిక దాడులతో బెంబేలెత్తిస్తోంది. జోర్డాన్, బహ్రెయిన్.. ఇతర గల్ఫ్ దేశాల్లో అమెరికాకు చెందిన బేస్ క్యాంప్ లపై బాంబుల వర్షాన్ని కురిపించింది.ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. నిన్నటి వరకు చల్లారినట్టే కనిపించిన ఈ యుద్ధం.. మళ్లీ మొదటికొచ్చినట్టయింది. మున్ముందు మరింత తీవ్రంగా దాడులు చేపడతామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ప్రకటించడం.. అక్కడి తీవ్రతకు అద్దం పట్టినట్టయింది. ఈ దాడులను అటు అమెరికా, ఇటు ఇరాన్.. ఆత్మరక్షణలో భాగమని చెప్పుకొన్నాయి.ఈస్టర్న్ టైమ్ జోన్ ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ఇరాన్లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ లక్ష్యాలపై దాడులు ప్రారంభించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. దీనిపై తన అధికారిక ఎక్స్ ప్లాట్ ఫామ్ పై పోస్ట్ పెట్టింది. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలు, ఆ ప్రాంతంలో మోహరించిన అమెరికన్ సైనికులపైనా ఐఆర్జీసీ దాడుల ప్రయత్నాలకు ప్రతీకారానికి దిగామని తెలిపింది.ఇకపై తిరుమలలో ఎయిర్ పోర్ట్ తరహా స్మార్ట్ లగేజీ సిస్టమ్: జీఎంఆర్ ఎంట్రీఇరాన్లోని ఖేష్మ్ ఐలాండ్, జాస్క్, సిరిక్ రీజియన్, జిరోఫ్ట్ ఎయిర్ పోర్ట్ సమీపంలో కూడా పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ తెలిపింది. అంతే ఘాటుగా స్పందించింది. తన భూభాగం నుంచి అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దీన్ని ధృవీకరించింది. జోర్డాన్లోని ప్రిన్స్ హసన్ ఎయిర్ బేస్, బహ్రెయిన్లోని అమెరికా సైనిక స్థావరాలపై తాము భారీగా బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేశామని ప్రకటించింది.బంగారం ధరల పతనానికి సడన్ బ్రేక్- షార్ప్ రీబౌండ్అమెరికాకు చెందిన అత్యాధునిక ఆర్క్యూ-4

Karimnagar: పోగొట్టుకున్న ఫోన్ను బాధితుడికి అందించిన కరీంనగర్ పోలీసులు! Karimnagar: కరీంనగర్ రూరల్, దుర్షేడ్ గ్రామానికి చెందిన కొల్లూరి అంజయ్య అనునతడు గత సంవత్సరం కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్ లో తన యొక్క ఐక్యు సెల్ ఫోన్ పోగొట్టుకొనగా కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినాడు. పోలీసులు సి.ఈ.ఐ.ఆర్ టెక్నాలజీ సహాయంతో పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను ట్రేస్ చేసి పెద్దపల్లి లో పట్టుకోవడం జరిగింది. అట్టి ఫోను యజమాని అయిన కొల్లూరి అంజయ్య కు ఇన్స్పెక్టర్ ఏ.నిరంజన్ రెడ్డి సెల్ ఫోను ను అందజేశారు. సెల్ ఫోన్ ను ట్రేస్ చేయడంలో కృషి చేసిన టెక్ టీం కానిస్టేబుల్ చిట్యాల రాంసాయి మరియు ఫైజాన్ లను సిఐ ఏ. నిరంజన్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా సీఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఎవరు కూడా విలువైన వస్తువులను అజాగ్రత్తగా పర వేసుకోకూడదని జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. పొరపాటున అజాగ్రత్తగా ఏదైనా విలువగల వస్తువులను పోగొట్టుకొనిన, దొంగిలించబడ్డ వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఫిర్యాదు చేయాలని తెలిపారు

ఎలక్ట్రిక్ కారు (ఈవీ) కొన్నవారికి ఛార్జింగ్ స్టేషన్ వెతుక్కోవడం పెద్ద తలనొప్పి అనుకుంటే పొరపాటే. అసలు సమస్య తమ సొంత ఇల్లు లేదా అపార్ట్మెంట్లోని ఎలక్ట్రికల్ వ్యవస్థ దానిని తట్టుకోలేకపోవడమే కావచ్చు. సొంత ఇల్లు ఉన్నవారికి ఛార్జర్ ఏర్పాటు చేసుకోవడం సులభంగా అనిపించినా, అపార్ట్మెంట్లలో నివసించే వారికి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఛార్జర్ ఒక్కటే కాదు, భవనం వైరింగ్, ట్రాన్స్ఫార్మర్, మొత్తం సొసైటీ విద్యుత్ వ్యవస్థ అదనపు లోడ్ను మోయగలదా అన్నదే అసలు ప్రశ్న. అందుకే, ఈవీ కొనేముందే ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.ఇంటికి తగినంత సాంక్షన్డ్ లోడ్ ఉందా?సాధారణంగా ఇళ్లకు 3-4 కిలోవాట్ల (కేడబ్ల్యూ) సాంక్షన్డ్ లోడ్ ఉంటుంది. కానీ, ఒక ఈవీ ఛార్జర్ కారు, ఛార్జర్ రకాన్ని బట్టి అదనంగా 7.5 కేడబ్ల్యూ లేదా అంతకంటే ఎక్కువ లోడ్ను జోడిస్తుంది. "ఈవీ యజమానులు ఇంట్లో ఛార్జింగ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఇది ఇంట్లోని ఇతర ఉపకరణాల కంటే చాలా భిన్నమైన లోడ్ అని అర్థం చేసుకోవాలి. ఒక కారును 8 నుంచి 10 గంటల పాటు ఛార్జ్ చేయడానికి కనీసం 7.5 కేడబ్ల్యూ అదనపు లోడ్ అవసరం. ఫాస్ట్ ఛార్జర్లకు 22 కేడబ్ల్యూ వరకు అవసరం పడొచ్చు" అని ఛార్జర్ ఆన్ వీల్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ అనిల్ కుమార్ ఎన్డీటీవీకి తెలిపారు. దీనివల్ల ఇంటికి కేటాయించిన అసలు లోడ్ కంటే వినియోగం భారీగా పెరిగిపోతుంది. కాబట్టి, మొదటగా మీ విద్యుత్ కనెక్షన్ సాంక్షన్డ్ లోడ్ ఎంత ఉందో

పర్వతారోహణ చేయాలన్న కోరిక చాలామందికి ఉంటుంది. కానీ కెరీర్ బిజీ, కుటుంబ బాధ్యతలు, ఇది సరైన వయసు కాదేమోనన్న సందిగ్ధత.. ఇలా వివిధ కారణాల వల్ల కొంతమంది ఈ కలను నెరవేర్చుకోలేకపోతారు. నిజానికి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇవేవీ అడ్డు కాదంటోంది శివానీ మెహ్రోత్రా. పర్వతారోహణ చేయాలన్న కోరిక చాలామందికి ఉంటుంది. కానీ కెరీర్ బిజీ, కుటుంబ బాధ్యతలు, ఇది సరైన వయసు కాదేమోనన్న సందిగ్ధత.. ఇలా వివిధ కారణాల వల్ల కొంతమంది ఈ కలను నెరవేర్చుకోలేకపోతారు. నిజానికి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇవేవీ అడ్డు కాదంటోంది శివానీ మెహ్రోత్రా. నాలుగు పదుల వయసుకి చేరువలో ఉన్నప్పుడు మౌంటెనీరింగ్పై ఆసక్తి పెంచుకున్న ఆమె.. ఇటీవలే తన 43 ఏళ్ల వయసులో యూరప్లోనే ఎత్తైన పర్వతం మౌంట్ ఎల్బ్రస్ను అధిరోహించింది. తద్వారా ‘వయసు సంఖ్య మాత్రమే’ అని నిరూపించి వార్తల్లో నిలిచింది. మరి, వృత్తిరీత్యా యోగా టీచర్ అయిన శివానీకి పర్వతాహరోణ చేయాలన్న ఆలోచన ఎలా కలిగింది? తెలుసుకుందాం రండి.. నిద్ర లేచింది మొదలు ఇంట్లో బాధ్యతలు, కెరీర్ బిజీలో పడిపోయి.. తమ అభిరుచుల్ని సైతం పక్కన పెట్టేస్తుంటారు చాలామంది మహిళలు. కానీ కొందరు మాత్రం కాస్త లేటు వయసులోనైనా వీటిపై దృష్టి పెడుతూ తమను తాము నిరూపించుకుంటారు.. ఇతరులకు స్ఫూర్తినిస్తుంటారు. శివానీ కూడా ఇదే కోవకు చెందుతుంది. ఉత్తరప్రదేశ్ సీతాపుర్కు చెందిన ఆమె.. వివాహం తర్వాత లక్నోలో స్థిరపడింది. పెళ్లయ్యాక గృహిణిగా, అమ్మగా బిజీగా మారిపోయింది. స్వతహాగా ఫిట్నెస్ లవర్ అయిన ఆమె.. సాహసాలు చేయడానికీ మక్కువ చూపుతుంది. ఈ ఇష్టమే తనను పర్వతారోహణ వైపు అడుగులేసేలా చేసిందంటోంది శివానీ. ‘ఓసారి స్నేహితులతో కలిసి మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి ట్రెక్కింగ్కి వెళ్లా. అప్పుడే నాకు పర్వతారోహణ పరిచయమైంది. ఈ అనుభవాన్ని ఎంతో ఎంజాయ్ చేశా. ఇక ముందూ మౌంటెనీరింగ్ చేయాలన్న కోరిక నాలో మొదలైంది. ఈ క్రమంలోనే కశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ప్రదేశ్లోని పలు

దులీప్ ట్రోఫీ సెమీ ఫైనల్లో ఈస్ట్ జోన్ ఘన విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ సెంట్రల్ జోన్ను నాలుగు వికెట్ల తేడాతో మట్టికరిపించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు.159 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్ జోన్కు యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ (43 బంతుల్లో 43) మెరుపు ఆరంభాన్ని అందించాడు. అయితే, సెంట్రల్ జోన్ బౌలర్ హర్ష్ దూబే నాలుగు వికెట్లు పడగొట్టి ఈస్ట్ జోన్పై ఒత్తిడి పెంచాడు. ఈ దశలో సంయమనంతో ఆడిన కెప్టెన్ ఇషాన్ కిషన్ (41 బంతుల్లో 39 నాటౌట్) జట్టుకు విజయాన్ని ఖరారు చేశాడు. అతనికి మహమ్మద్ షమీ (8 నాటౌట్) సహకరించాడు.అంతకుముందు, సెంట్రల్ జోన్ తమ రెండో ఇన్నింగ్స్లో కేవలం 158 పరుగులకే కుప్పకూలింది. ఈస్ట్ జోన్ బౌలర్లు ముకేశ్ కుమార్ 4 వికెట్లతో, మహమ్మద్ షమీ 3 వికెట్లతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ను దెబ్బతీశారు. కాగా, ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఇరు జట్లు 266 పరుగుల వద్ద సమానంగా నిలవడం విశేషం. ఈ విజయంతో, గత ఏడాది ఛాంపియన్ను టోర్నీ నుంచి నిష్క్రమింపజేసి, ఈస్ట్ జోన్ ఫైనల్కు దూసుకెళ్లింది

రష్యా- ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లకు పైగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాలు పరస్పరం డ్రోన్లు, మిసైల్స్ తో దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా ఉక్రెయిన్ పై రష్యా మరోసారి విరుచుకుపడింది. డ్రోన్లు, మిసైల్స్ తో విధ్వంసం సృష్టించింది. సెప్టెంబర్ 1 న ఉక్రెయిన్ పై రష్యా జరిపిన దాడుల్లో 12 మంది మృతి చెందారు. మృతుల్లో ఒక భారతీయుడు ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వెల్లడించారు. ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలే లక్ష్యంగా డ్రోన్ లు, మిసైల్స్ తో రష్యా దాడులు చేపట్టిందని అన్నారు. ఈ దాడుల్లో నివాస భవనాలు, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఇక ఆగస్టు 31 సోమవారం కూడా ఉక్రెయిన్ లోని ఒడెసా నగరంపై రష్యా దాడులు చేసింది. ఏరియల్ బాంబ్స్, డ్రోన్ లతో విరుచుకుపడింది. దాంతో నగరంలోని వేలాది కుటుంబాలు విద్యుత్ లేకుండా అంధకారంలోనే గడిపాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా వేదికగా పోస్టు పెట్టారు. ఇక తాజాగా జరిగిన దాడిలో 12 మంది మృతి చెందారని.. వారిలో ఒకరు భారతీయుడని అన్నారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలైన కీవ్, ఒడేసా, ఖేర్సన్, డొనెట్స్క్, జపోరిజియా, ఖార్కివ్, చెర్నిహివ్, జైటోమిర్, సుమీ అలాగే డినిప్రోలపై రష్యా చేపట్టిన దాడుల్లో డజన్ల కొద్దీ తీవ్రంగా గాయపడినట్లు జెలెన్ స్కీ స్పష్టం చేశారు. కీవ్ నగరంలోని రైల్వే డిపోపై జరిగిన దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. అలాగే ఈ దాడులకు బోరీస్పిల్ ప్రాంతంలోని ఐదంతుస్తుల భవనం కుప్పకూలింది. నలుగురు మృతి చెందారు. 13 మంది గాయపడ్డారు. ఇక 50 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం అని అధికారులు తెలిపారు. కీవ్ నగరంలో 350 మందితో కూడిన రెస్క్యూ బృందం సహాయక చర్యలను ముమ్మరం చేసిందని అన్నారు

దులీప్ ట్రోఫీ 2026 సీజన్లో ఈస్ట్ జోన్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీఫైనల్లో ఈస్ట్జోన్ 4 వికెట్ల తేడాతో సెంట్రల్ జోన్పై విజయం సాధించింది. స్పోర్ట్స్ డెస్క్: దులీప్ ట్రోఫీ (Duleep Trophy2026) ఫైనల్కు ఈస్ట్ జోన్ జట్టు దూసుకెళ్లింది. తొలి సెమీ ఫైనల్లో భాగంగా జరిగిన మ్యాచ్లో సెంట్రల్ జోన్పై ఈస్ట్ జోన్ వికెట్ల తేడాతో విజయం సాధించింది. 159 పరుగుల టార్గెట్ని ఇషాన్ కిషన్ జట్టు 39.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (40), కెప్టెన్ ఇషాన్ కిషన్ (39) రాణించారు. అభిమన్యు ఈశ్వరన్ 24, కుమార్ కుశాగ్ర 22 పరుగులు చేశారు. షమి (8*) విన్నింగ్ షాట్ కొట్టాడు. సెంట్రల్ జోన్ బౌలర్లలో హర్ష్ దూబే 4 వికెట్లు తీయగా, సారాంశ్ జైన్, యశ్ ఠాకూర్ చెరొక వికెట్ పడగొట్టారు. అంతకుముందు రెండో ఇన్నింగ్స్లో 45/3 స్కోరుతో ఇవాళ(మంగళవారం) ఆటను కొనసాగించిన సెంట్రల్ జోన్ 158 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ అమన్ మోఖడే (41) రాణించగా..అర్షద్ ఖాన్ (25), హర్ష్ దూబె (24), రింకు సింగ్ (20) పరుగులు చేశారు. ముకేశ్ కుమార్ 4, మహ్మద్ షమి 3 వికెట్లతో సత్తాచాటారు. అభిజిత్, అనుకుల్ రాయ్, కౌనైన్ ఖురేషీ ఒక్కో వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్లో ఇరుజట్లూ 266 పరుగులకు ఆలౌటయ్యాయి. సెప్టెంబరు 6 నుంచి చెపాక్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ మొదలుకానుంది. నార్త్ జోన్, సౌత్ జోన్ మధ్య జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో విజేతగా నిలిచిన జట్టుతో ఈస్ట్ జోన్ ఫైనల్లో తలపడనుంది

త్వరలో వన్ప్లస్ 16 సిరీస్ లాంచ్ 200MP కెమెరా, భారీ 9000mAh బ్యాటరీ సరికొత్త జనరేషన్ ఫ్లాగ్షిప్ ఇమేజింగ్ టెక్నాలజీ OnePlus 16 : వన్ప్లస్ అభిమానులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలో చైనాలో వన్ప్లస్ 16 సిరీస్ లాంచ్ కానుంది. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్లో 200MP కెమెరా, భారీ 9000mAh బ్యాటరీ ఉండొచ్చని అంచనా. అయితే, ఈ ఫోన్ లాంచ్ కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. గత ఏడాది చైనాలో లాంచ్ అయిన వన్ప్లస్ 15కి అప్గ్రేడ్గా రానుంది. ఈ ఫోన్ డిజైన్లో కూడా మార్పులు చేసే అవకాశం ఉంది. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి. కెమెరాలో భారీ అప్గ్రేడ్ : వన్ప్లస్ 16లో కీలక అప్గ్రేడ్లు రివీల్ అయ్యాయి. ఈ ఫోన్లో 200MP మెయిన్ సెన్సార్ ఉండొచ్చు. 50MP సోనీ పెరిస్కోప్, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉండే ఛాన్స్ ఉంది. అంతేకాదు.. 50MP ఆటోఫోకస్ కెమెరాతో ఫస్ట్ వన్ప్లస్ ఫోన్ ఇదే కానుంది. టిప్స్టర్ ప్రకారం.. వన్ప్లస్ 16 సరికొత్త జనరేషన్ ఫ్లాగ్షిప్ ఇమేజింగ్ టెక్నాలజీతో రానుంది. అంతేకాదు.. లీక్ల ప్రకారం ఈ ఫోన్లో 185Hz రిఫ్రెష్ రేట్తో BOE డిస్ప్లే ఉండొచ్చు. అదనంగా, ఈ-స్పోర్ట్స్ గేమింగ్ కోసం ట్రిపుల్-కోర్ టెక్నాలజీతో రానుంది. Read Also : Redmi K100 Leak : బ్యాటరీ బీస్ట్ వస్తోందోచ్.. ఈ కొత్త రెడ్మి K100 సిరీస్ రేంజే వేరబ్బా.. ఫీచర్లు చూస్తే ఫిదానే..! వన్ప్లస్ 16లో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో ఉంటుందని అంచనా. ఈ ఫోన్లో 24GB వరకు ర్యామ్, 1TB వరకు స్టోరేజ్ ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ పవర్ఫుల్ 9000mAh బ్యాటరీ, 100W వైర్డ్, 50W వైర్లెస్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ 17 ఆధారిత కలర్ఓఎస్ 17కు సపోర్ట్ చేస్తుంది. ఈ వన్ప్లస్ ఫోన్ IP68/IP69 ప్రొటెక్షన్ను అందిస్తుందని అంచనా. వాటర్, డస్ట్ నుంచి ప్రొటెక్ట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ బేస్ తెలిసిందే. సదరు ఫ్యాన్ బేస్ యొక్క ప్రకంపనలు వరల్డ్ వైడ్ గా 'వైఫె' లా తిరుగుతూనే ఉంటాయి. రేపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రేపు పవన్ స్టైలిస్ట్ మూవీలో ఒకటైన 'పంజా' 4K వెర్షన్లో భారీ స్థాయిలో రీ రిలీజ్ కాబోతుంది. ఎప్పడు లేని విధంగా ఈ రోజు నైట్ ప్రీమియర్స్ కూడా పడబోతున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ మహారాష్ట్రలోని పూణే నగరంలో కూడా ఈ రోజు ప్రీమియర్ ప్రదర్శిస్తుండటం, టికెట్స్ అన్ని అయిపోవడం ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరుస్తుంది. పూణేలోని ప్రధాన థియేటర్ల వద్ద భారీ కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేసి, బాణాసంచా కాల్చుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఐటీ నిపుణులు, విద్యార్థులు పెద్ద ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకుని థియేటర్లను హౌస్ఫుల్ చేస్తుండటంతో మహారాష్ట్ర బాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ సత్తా ఏంటో మరోసారి రుజువవుతోంది. దాదాపు 15 ఏళ్ల క్రితం నాటి సినిమా కూడా రీ-రిలీజ్ వేళ కొత్త సినిమాను తలపించేలా పూణే నగర వీధుల్లో మారుమోగిపోతుండటం పవర్ స్టార్కి ఉన్న తిరుగులేని మాస్ ఫాలోయింగ్కి సజీవ నిదర్శనం తెలుగు స్టేట్స్ లాగానే రీ రిలీజ్ ఈ స్థాయిలో వేడుకలా మారడం కూడా నిజంగానే ఒక అరుదైన విషయం. మరి ఈ నేపథ్యంలో తొలి రోజు ఏ మేర కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి. 2011 డిసెంబర్ 9న కోలీవుడ్ దర్శకుడు విష్ణువర్ధన్ మేకింగ్లో 33 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మితమైన ఈ సినిమా అప్పట్లోనే సరికొత్త స్టైలిష్ గ్యాంగ్స్టర్ లుక్తో అభిమానులను అలరించింది. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ, దాదాపు 40 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఆంధ్ర, నైజాం ప్రాంతాల్లోనే 15.86 కోట్ల షేర్ రాబట్టగా, కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.50 కోట్లు, ఓవర్సీస్లో 1.75

టెక్ ప్రపంచంలో సెప్టెంబర్ నెలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ నెల నుంచి పండుగల సీజన్ ప్రారంభమవుతుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థలు తమ నయా ఫ్లాగ్షిప్, మిడ్-రేంజ్ ప్రొడక్ట్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సమాయత్తమయ్యాయి. వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హంగులు, అధునాతన కెమెరా సెన్సార్లు, శక్తివంతమైన ప్రాసెసర్లతో 10కి పైగా సరికొత్త స్మార్ట్ఫోన్లు ఈ నెలలో మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాయి. ఈ జాబితాలో ప్రతిష్టాత్మకమైన, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడల్ యాపిల్ ‘ఐఫోన్ 18 ప్రో’. ప్రతిసారి డిజైన్, సాంకేతికతలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే యాపిల్ ఈసారి ఏఐ ఏకీకరణ, అత్యంత నాణ్యమైన పెరిస్కోప్ లెన్స్, మెరుగైన బ్యాటరీ లైఫ్తో వినియోగదారులను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. యాపిల్ వార్షిక మెగా ఈవెంట్లో సెప్టెంబర్ ద్వితీయార్థంలో ఈ ఫోన్లు అధికారికంగా ఆవిష్కృతం కానున్నాయి. ఈ నెలలో మార్కెట్లోకి రానున్న కొన్ని మోడళ్లు కింది విధంగా ఉన్నాయి. కంపెనీలు ఇప్పటికే వీటి ఫీచర్లను ప్రకటించాయి. అయితే వీటి ధరలకు సంబంధించిన వివరాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఐఫోన్ 18 ప్రో (iPhone 18 Pro): నెక్స్ట్-జెన్ A20 బయోనిక్ చిప్సెట్, అధునాతన ఏఐ ఫీచర్లతో రానుంది. వీవో T5 (Vivo T5): భారత మిడ్-రేంజ్ మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని అత్యుత్తమ డిజైన్, కెమెరా సామర్థ్యంతో బడ్జెట్ విభాగంలో పోటీకి దిగుతోంది. పోకో F9 (Poco F9): గేమింగ్ ప్రియులను ఆకట్టుకునేలా ఫాస్ట్ ఛార్జింగ్, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, తక్కువ ధరలో గరిష్ట పనితీరును అందించనుంది. శామ్సంగ్, వన్ప్లస్, రియల్మీ, షావోమీ సంస్థలు కూడా తమ సరికొత్త వేరియంట్లను ఈ సెప్టెంబర్లో ఆవిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాయి. మొత్తానికి, సెప్టెంబర్ 2026 స్మార్ట్ఫోన్ పరిశ్రమకు అత్యంత కీలకమైన నెలగా మారనుంది. మీ పాత ఫోన్ను అప్గ్రేడ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ నెలలో రాబోయే ఈ సరికొత్త

అన్నదాతలకు గుడ్ న్యూస్.. అక్టోబర్లో ఖాతాల్లోకి రూ.6వేలు పీఎం కిసాన్ 24వ విడత, అన్నదాత సుఖీభవపై కీలక అప్డేట్ పీఎం కిసాన్ రూ.2వేలు, అన్నదాత సుఖీభవ రూ.4వేలు PM Kisan 24th Installment: రైతులకు నిజంగా పండగలాంటి వార్త.. పీఎం కిసాన్ 24వ విడత, అన్నదాత సుఖీభవకు సంబంధించి కీలక్ అప్డేట్ వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) 24వ విడత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు అతి త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. అక్టోబర్ తొలి వారంలోనే ఈ డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో పడే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.. అక్టోబర్లో PM Kisan 24వ విడత? దేశవ్యాప్తంగా అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద ఏడాదికి రూ.6వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ మొత్తాన్ని ఏడాదిలో 3 విడతలుగా, ఒక్కో విడతకు రూ.2వేలు చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఇదివరకే 23వ విడత నిధులు రైతులకు అందాయి. ఇప్పుడు 24వ విడత కోసం అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. మొదట ఈ విడతను వినాయక చవితి సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. లేటెస్ట్ డేటా ప్రకారం.. అక్టోబర్ తొలి వారంలో పీఎం కిసాన్ 24వ విడత విడుదలకు కేంద్రం ప్లాన్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ రైతులకు డబుల్ బెనిఫిట్.. ఒకేసారి రూ.6వేలు? : ఆంధ్రప్రదేశ్ రైతులకు మాత్రం ఈసారి అదనపు బెనిఫిట్ లభించే ఛాన్స్ ఉంది. పీఎం కిసాన్ కింద కేంద్రం అందించే రూ.6వేలు వార్షిక సాయానికి రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ పథకం కింద మరో రూ.14వేలు కలిపి మొత్తం రూ.20వేలు వార్షిక పెట్టుబడి సాయం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా ఇప్పుడు ఆ నిధుల విడుదలపై కసరత్తు జరుగుతోంది

ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో ఐఫోన్ 16 భారీ తగ్గింపుతో లభిస్తోంది బ్యాంకు ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్ ధర ఇంకా తగ్గుతుంది పవర్ఫుల్ చిప్, OLED డిస్ప్లే సామర్థ్యంతో కెమెరాలు Apple iPhone 16 Deal : ఆపిల్ లవర్స్కు పండగే.. ఫ్లిప్కార్ట్లో ఆపిల్ ఐఫోన్ 16 ధర భారీగా తగ్గింది. రూ. 79,900కు లాంచ్ అయిన ఈ ఐఫోన్ ఇప్పుడు రూ. 65వేల కన్నా తక్కువ ధరకే లభిస్తోంది. వినియోగదారులు బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో అసలు ధరను మరింత తగ్గించుకోవచ్చు. లిమిటెడ్ టైమ్ ఆఫర్ త్వరలో ముగియనుంది. మీరు ఈ ఐఫోన్ సొంతం చేసుకోవాలంటే ఇప్పుడే కొనేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో ఆపిల్ ఐఫోన్ 16 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఐఫోన్ 16 ఫ్లిప్కార్ట్ డీల్ : ఆపిల్ ఐఫోన్ 16 తొలుత రూ. 79,900 ధరకు లాంచ్ అయింది. కానీ, ప్రస్తుతం ఈ ఐఫోన్ ఫ్లిప్కార్ట్లో రూ. 15వేలు తగ్గింపుతో రూ. 64,900 ధరకు అమ్ముడవుతోంది. నేరుగా తగ్గింపుతో పాటు, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్కార్ట్ ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో అదనంగా రూ. 5,145 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఐఫోన్ ధర రూ. 59,755కు తగ్గుతుంది. Read Also : PM Kisan- Annadata Sukhibava : రైతులకు పండుగ గిఫ్ట్.. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవపై బిగ్ అప్డేట్.. ఆ తేదీనే ఖాతాల్లోకి డబ్బులు? ఫ్లిప్కార్ట్ 36 నెలలకు కేవలం రూ. 2,262 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను అందిస్తోంది. అంతేకాదు.. మీ పాత ఫోన్ ఇచ్చి రూ. 49,250 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందొచ్చు. అయితే, కచ్చితమైన ఎక్స్చేంజ్ వాల్యూ అనేది మీ పాత ఫోన్ బ్రాండ్, మోడల్ పర్ఫార్మెన్స్పై ఆధారపడి ఉంటుంది. ఐఫోన్ 16 ఇదే బెస్ట్ టైమ్? : ఆపిల్ త్వరలో ఐఫోన్ల ధరలను భారీగా పెంచనుంది. అయితే, దీనిపై కంపెనీ నుంచి ఎలాంటి

తెలంగాణ జానపద కళారంగంలో ఎంతో ప్రజాదరణ పొందిన జానపద నటులు, డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ల వ్యవహారం ఇప్పుడు సంచలన మలుపు తిరిగింది. సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన వేములవాడ హోటల్ రూమ్ ఘటన తర్వాత, ఈ వివాదం కాస్తా క్రిమినల్ కేసు వైపు వెళ్ళింది. హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో మాధురి రాథోడ్ తన ఫిర్యాదులో 'ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, నాతో శారీరక సంబంధం పెట్టుకుని తీవ్రంగా మోసం చేసాడు. కేవలం మోసం చేయడమే కాకుండా, నా పరువుకి భంగం కలిగించేలా ప్రవర్తించాడు. నా వ్యక్తిగత ఫోన్లో ఉన్న దృశ్యాలు, వీడియోలని ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత ద్వారా మార్ఫింగ్ వీడియోలని సృష్టించాడు. నాకు ఇతరులతో అక్రమ సంబంధాలు ఉన్నట్లు చిత్రీకరిస్తూ ఆ ఏఐ మార్ఫింగ్ వీడియోలని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసి తీవ్ర మనోవేదనకి గురిచేశాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఫిర్యాదులోని అంశాలని పరిశీలించిన పోలీసులు, ఈశ్వర్ సాయిపై నూతన భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 69 కింద కేసు నమోదు చేశారు. మోసపూరిత వాగ్దానాలు, పెళ్లి చేసుకుంటాననే నెపంతో శారీరక సంబంధం పెట్టుకోవడం వంటి నేరాల కింద ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఇది నాన్-బెయిలబుల్ అఫెన్స్ కావడంతో ఈ వ్యవహారం మరింత తీవ్రరూపం దాల్చింది. ఈశ్వర్ సాయి ప్రస్తుతం పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడిని పట్టుకునేందుకు నార్సింగి పోలీసులు రెండు ప్రత్యేక పోలీసు బృందాలని రంగంలోకి దించి జల్లెడ పడుతున్నారు. ఆగస్టు నెలలో వేములవాడలోని ఒక లాడ్జి లేదా హోటల్ గదిలో ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్లు కలిసి ఉన్న సమయంలో, ఈశ్వర్ సాయి భార్య శరణ్య అక్కడికి చేరుకోవడంతోవివాదం మొదలైన విషయం తెలిసిందే. టాక్సిక్ కి షాకింగ్ రేటింగ్ ఇచ్చిన మహేష్ కుమారుడు గౌతమ్ 'పుష్ప'లో చీరకట్టుపై అల్లు అర్జున్ షాకింగ్