
కేకే-5 గనిలో ప్రమాదం.. ఒకరికి గాయాలు
మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కేకే-5 గనిలో ప్రమాదం జరగింది. గనిలో మూడో సీమ్లో 14 లెవెల్ వద్ద ఎస్డీఎల్ యంత్రంతో ఆపరేటర్ శంకర్ పనిచేస్తుండగా ఒక్కసారిగా సైడ్ వాల్ కూలింది.

మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కేకే-5 గనిలో ప్రమాదం జరగింది. గనిలో మూడో సీమ్లో 14 లెవెల్ వద్ద ఎస్డీఎల్ యంత్రంతో ఆపరేటర్ శంకర్ పనిచేస్తుండగా ఒక్కసారిగా సైడ్ వాల్ కూలింది.

ఈశాన్య భారతంలో ప్రకృతి కోపానికి, పొంగిపొర్లిన వరద రాకాసికి జీవితం అల్లకల్లోలమైన వేళ.. ఓ మూగజీవం మరణపు అంచుల దాకా వెళ్లి నిలబడింది. 53 ఏళ్ల వయసున్న జాయ్మతి అనే ఆడ ఏనుగు వరద ఉధృతిలో కొట్టుకుపోయి సాయం కోసం దిక్కుతోచని స్థితిలో అలమటించింది.అయితే, మానవత్వం ఇంకా చావలేదని నిరూపిస్తూ అటవీ శాఖ, స్థానిక ప్రజలు దాన్ని ప్రాణాలతో ఒడ్డుకు చేర్చారు. తీవ్ర గాయాలతో రోదిస్తున్న ఆ ఐరావతానికి ఇప్పుడు ఊహించని రీతిలో పునర్జన్మ లభించబోతోంది. అత్యవసర శస్త్రచికిత్సల కోసం ఈ ఏనుగును ఏకంగా ప్రత్యేక విమానంలో గుజరాత్లోని అత్యంత ప్రాచుర్యం పొందిన వంతారా ఆసుపత్రికి తరలిస్తున్నారు. దేశ చరిత్రలోనే ఒక ఏనుగును విమానంలో తరలించడం ఇదే తొలిసారి!గత జులై నెలలో నాగాలాండ్, అస్సాం ప్రాంతాలను ముంచెత్తిన వరదల్లో జాయ్మతి కొట్టుకుపోయింది. ఉద్ధృతంగా పారే నీటి ప్రవాహంలో రాళ్లు, రప్పలు గుద్దుకోవడంతో దాని దేహమంతా క్షతగాత్రమైంది. నడుము, చెవులు, తోక, పొత్తికడుపు భాగాల్లో లోతైన గాయాలయ్యాయి.అంతకుముందే కలప మోసే పనుల్లో ఒక కాలు విరిగిపోవడంతో నడవలేని స్థితిలో ఉన్న ఈ ఏనుగు, వరద దెబ్బకు ఒక కంటి చూపును కూడా శాశ్వతంగా కోల్పోయింది. కంటి నుంచి నిరంతరం నీరు కారుతున్నా, అడుగు తీసి అడుగు వేయలేక నరకయాతన అనుభవిస్తున్నా.. ఆ మూగజీవి కళ్లలో జీవించాలనే ఆశ మాత్రం చావలేదు. ఏనుగు కోసం సుప్రీంకోర్టు తీర్పు! కస్టడీకి ఇస్తూ కామెంట్స్రోడ్డు ప్రయాణపు నరకం వద్దు.. ఆకాశ మార్గాన వంతారాకు!గాయపడిన ఏనుగును రోడ్డు మార్గాన వందల కిలోమీటర్లు తీసుకెళ్తే, ఆ ప్రయాణపు నొప్పులను తట్టుకోవడం దాని వల్ల కాదు. ఈ పరిస్థితిని గమనించిన వెటర్నరీ వైద్యులు దాని ప్రయాణ భారాన్ని తగ్గించేందుకు విమానంలో తరలించడమే సరైన మార్గమని నిర్ణయించారు. అనంత్ అంబానీ నేతృత్వంలోని వంతారా సంస్థ వెంటనే స్పందించి, నిపుణులైన వైద్య బృందం సంరక్షణలో జాయ్మతికి ఎలాంటి శ్రమ కలగకుండా ప్రత్యేకంగా సిద్ధం చేసిన విమానంలో గుజరాత్లోని
ఎర్రబెల్లి దయాకర్ రావుకు గాయాలు.. పాదయాత్రలో పోలీసుల తోపులాట జనగామ జిల్లాలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు చేపట్టిన పాదయాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దేవరుప్పుల, కొడకండ్ల మండల రైతులకు ఎస్సార్ఎస్పీ కాలువ ద్వారా సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎర్రబెల్లి ఈ పాదయాత్ర చేపట్టారు. సింగరాజుపల్లి గ్రామం వద్ద ధర్నా చేస్తున్న ఎర్రబెల్లిని పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో తోపులాట జరిగింది. దీంతో ఆయన నుదుటిపై గాయాలయ్యాయి. స్థానిక వైద్యుల చేత ప్రాథమిక చికిత్స చేయించిన అనంతరం పోలీసులు ఆయనను దేవరుప్పుల పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ వార్తకు సంబంధించిన

కోల్కతాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడి ఓ హోటల్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు తొమ్మిది మంది మరణించారు. ఆరుమందికి పైగా గాయపడ్డారు. వారిలో ఒకరిద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే భయాందోళనలకు వ్యక్తమౌతోన్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చారు.నగరంలోని ప్రీ స్కూల్ స్ట్రీట్లో ఉన్న హోటల్ ఇది. ఈ వేకువ జామున 1:45 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తొలుత దట్టమైన పొగ అలముకుంది. ఈ వెంటనే భగ్గుమంటూ మంటలు చెలరేగాయి. గాఢనిద్రలో ఉన్న వాళ్లు తేరుకుని బయటపడే లోపే అగ్నికీలలు హోటల్ మొత్తం వ్యాపించాయి. అక్కుడున్న ఫర్నిచర్, కర్టెన్లు, ఇతర వస్తువులు.. మంటలు త్వరగా వ్యాప్తిచెందడానికి కారణం అయ్యాయి.ఈ ఘటనలో ఊపిరాడక కొందరు, మంటల బారిన పడి మరికొందరు మరణించారు. మృతుల్లో ఒకరు బంగ్లాదేశీయుడు ఉన్నట్లు గుర్తించారు. అతను వైద్యం కోసం కోల్కతా వచ్చినట్లు తేలింది. సమాచారం అందిన వెంటనే అయిదు అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. భవనం అంతా దట్టమైన పొగ అలుముకోవడంతో లోపలికి వెళ్లడం అగ్నిమాపక సిబ్బందికి అత్యంత కష్టతరంగా మారింది.అమెరికా పౌరసత్వ రికార్డుల తనిఖీ మొదలెట్టినట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటననిచ్చెనల సహాయంతో పై అంతస్తులకు చేరుకోవడానికి కూడా సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. స్థానిక పోలీసులతో పాటు విపత్తు నిర్వహణ బృందాలు కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలను పర్యవేక్షించాయి. ఈ మంటలు.. పక్కనే ఉన్న మరికొన్ని హోటళ్లు, వ్యాపార సముదాయాలకు కూడా మంటలు వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆరుమందిని సహాయక సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.మంటల బారిన పడ్డ హోటల్ కు పశ్చిమ బెంగాల్ ఫైర్ సర్వీసెస్ ప్రధాన కార్యాలయం సమీపంలోనే ఉండటంతో రెస్క్యూ

ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఓ బ్యాటర్ కొట్టిన బంతి అంపైర్ తాకింది. అతడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్పోర్ట్స్ డెస్క్: ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఓ బ్యాటర్ కొట్టిన బంతి అంపైర్ తాకింది. అతడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన న్యూఢిల్లీ టైగర్స్, ఈస్ట్ ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే... న్యూఢిల్లీ టైగర్స్ ఇన్నింగ్స్లో 18వ ఓవర్లో లక్ష్య తరేజా అనే బ్యాటర్ పవర్ఫుల్ స్ట్రైట్ డ్రైవ్ ఆడాడు. ఆ బంతి కాస్త మెయిన్ అంపైర్గా ధర్మేశ్ భరద్వాజ్ చెవి భాగంలో బలంగా తాకింది. అంపైర్ అప్రమత్తమై కిందికి వంగినప్పటికీ బంతి నుంచి తప్పించుకోలేకపోయాడు. వెంటనే అంపైర్ను పరీక్షించిన ఫిజియోలు మైదానం నుంచి బయటకు పంపించారు. ప్రస్తుతం అతడికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని సమాచారం. అయితే ఈ అంపైర్కు మైదానంలో బంతి తాకడం ఇదే తొలిసారి కాదు. ఇదే సీజన్ ఆరంభంలో మరో బ్యాటర్ ఆడిన స్ట్రైట్ డ్రైవ్ అతని భుజానికి బలంగా తాకింది. కానీ ఆ సమయంలో పెద్ద గాయం కాలేదు. అంపైర్ను గాయపర్చిన లక్ష్య తరేజా 25 బంతుల్లో ఫోర్తో 21 పరుగులు చేశాడు. మరోవైపు ఈ వీడియోను చూసిన నెటిజన్లు 'పాపం అంపైర్' అంటూ సానుభూతి చూపిస్తున్నారు. అంపైర్లు కూడా హెల్మెట్లు వాడాలని, టీ20 ఫార్మాట్లో తప్పనిసరి చేయాలని సూచిస్తున్నారు. డీఆర్ఎస్తో ఊహించని లైఫ్.. పడిక్కల్ను హగ్ చేసుకున్న రాహుల్! బుల్లెట్ త్రోతో అంపైర్ను భయపెట్టిన సిరాజ్.. వీడియో వైరల్

IND vs SL: భారత్, శ్రీలంక మధ్య గాలె వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శ్రీలంక ప్రధాన బ్యాటర్ దినేష్ చండీమాల్ ఫీల్డింగ్ చేస్తూ మెడకు తీవ్ర గాయమవడంతో మైదానం నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. లంక జట్టుకు ఇది కోలుకోలేని దెబ్బగా మారింది. గాలె టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు భారత్ రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేస్తున్న లంక బౌలర్ నువన్ తుషార బౌలింగ్లో భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన షాట్ ఆడాడు. ఆ బంతిని బౌండరీ దాటకుండా ఆపేందుకు దినేష్ చండీమాల్ ఎంతో వేగంగా పరుగెత్తాడు. బంతిని ఆపడంలో విజయం సాధించినప్పటికీ, ఆ వేగంలో నియంత్రణ కోల్పోయి నేలను బలంగా ఢీకొట్టడంతో ఆయన మెడ భాగానికి తీవ్రమైన దెబ్బ తగిలింది. గాయం తీవ్రత కారణంగా చండీమాల్ మైదానంలోనే తీవ్ర నొప్పితో కిందపడిపోయాడు. ఆయన పరిస్థితిని గమనించిన తోటి ఆటగాళ్లు వెంటనే ఫిజియోను పిలిచారు. మైదానంలోకి పరుగెత్తుకొచ్చిన వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ నొప్పి తగ్గకపోవడంతో, ఆయనను మైదానం నుంచి బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇది కూడా చదవండి: Cricket Records: సచిన్ ఖాతాలో ఎవరూ బ్రేక్ చేయలేని ‘వరల్డ్ రికార్డ్’..100 ఏళ్లయినా ఇది బద్దలవడం అసాధ్యమే చండీమాల్ గాయపడి మైదానం వీడటం శ్రీలంక జట్టును తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గాలె టెస్టులో కొండంత లక్ష్యాన్ని ఛేదించాల్సిన సమయంలో జట్టులో అత్యంత అనుభవజ్ఞుడైన ప్రధాన బ్యాటర్ అందుబాటులో లేకపోవడం లంక అవకాశాలను దెబ్బతీసే అంశం. మొదటి ఇన్నింగ్స్లో ఆయన కేవలం 4 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయినప్పటికీ, రెండో ఇన్నింగ్స్లో ఆయన కీలకంగా మారతాడని లంక యాజమాన్యం ఆశించింది. ఆయన మెడ గాయం ఎంత తీవ్రంగా ఉందనే దానిపై శ్రీలంక క్రికెట్ బోర్డు నుంచి ఇంకా అధికారిక ప్రకటన

14 మందికి తీవ్రగాయాలు శ్రావణ సోమవారం, నాగపంచమి కావడంతో బిహార్లోని అశోక్ధామ్ గుడికి పోటెత్తిన జనం మృతుల కుటుంబాలకు రూ. 4లక్షల పరిహారం బిహార్ సీఎం సమ్రాట్ చౌదరి ప్రకటన ఉజ్జయినిలోనూ తోపులాట.. 13మందికి గాయాలు లఖిసరాయ్, ఆగస్టు 17: శ్రావణ సోమవారం వేళ బిహార్లోని ప్రముఖ శైవ క్షేత్రం వద్ద విషాదం చోటు చేసుకుంది. లఖిసరాయ్ జిల్లాలోని అశోక్ధామ్ ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న రైల్వే స్టేషన్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. శ్రావణ సోమవారంతో పాటు నాగపంచమి ఒకే రోజు రావడంతో పరమశివుడికి జలాభిషేకం చేసేందుకు ఊహించని రీతిలో భక్తులు పోటెత్తారని అధికారులు తెలిపారు. ఉదయం 6:30 గంటల ప్రాంతంలో భారీ జనసందోహం కారణంగా బారికేడ్లు విరిగి భక్తులు ఒకరిపై ఒకరు పడటంతో ప్రమాదం జరిగిందని వివరించారు. బిహార్ సీఎం సామ్రాట్ చౌదరి మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. ఉజ్జయినిలోనూ తొక్కిసలాట శ్రావణ సోమవారం, నాగుల చవితి పర్వదినాలు పురస్కరించుకుని మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలోనూ భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే తెరుచుకునే నాగచంద్రేశ్వర ఆలయాన్ని దర్శించుకునేందుకు లక్షలాది మంది తరలి రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. హరిసిద్ధి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్ల నుంచి కరెంట్ షాక్ వస్తోందంటూ ఒక్కసారిగా వదంతులు వ్యాపించడంతో తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్లోని తారాపీఠ్లో కాళీ ఆలయంలో దర్శనానికి వచ్చిన భక్తులు బస చేసిన హోటల్లో అగ్ని ప్రమాదం జరిగి ఎనిమిది మంది చనిపోయారు. ఇవి కూడా చదవండి పేదల ఆరోగ్యం.. మా బాధ్యత: సీఎం రేవంత్రెడ్డి స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యం.. ఎఫ్డీఏపై హైకోర్టు గుస్సా

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Son in law attacks on mother In law in jagtial: సాధారణంగా దంపతుల మధ్య వివాదాలు రావడం కామన్. చాలా మంది వీటిని మాట్లాడుకుని పరిష్కరించుకుంటారు. కానీ కొంత మంది చిన్న చిన్న విషయాలకు గొడవల్ని పెద్దది చేసుకుని డైవర్స్ వరకు వెళ్లిపోతారు. అంతే కాకుండా దాడులు చేయడం లేదా సుపారీ గ్యాంగ్ లతో హత్యలు చేయించడానికి సైతం వెనుకాడటంలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జగిత్యాల జిల్లా పట్టణం గాంధీ నగర్ లో చోటు చేసుకున్న ఘటన స్థానికంగా దుమారంగా మారింది. జగిత్యాల పట్టణంలో గాంధీనగర్ లో ఉన్న ఒక అల్లుడు ప్రశాంత్.. ఇల్లు ఊడుస్తున్న తన అత్త నర్సవ్వపై కత్తితో దాడి చేశాడు. కొన్ని రోజులుగా అల్లుడు, కూతురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీనికి తన అత్త నర్సవ్వ కారణమని అల్లుడు కోపం పెంచుకున్నాడు. అదను కోసం చూసి ఆదివారం తెల్లవారుజామున ఇల్లుడుస్తున్న అత్తపై కత్తితో దాడి చేశాడు. Read more: KTR: ప్రభుత్వంకు అసలు సోయి ఉందా..?.. కంటి వెలుగు పథకంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. పలు చోట్ల ఆమెకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో అత్త ఒక్కసారిగా షాక్ అయ్యింది. గట్టిగా అరుపులు పెట్టడంతో చుట్టుపక్కల వారు రావడంతో అతగాడు పరుగులు పెట్టాడు. వెంటనే గాయపడ్డ నర్సవ్వను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్

ఉత్తర్ప్రదేశ్లో పెను విషాదం చోటుచేసుకుంది. సంభాల్ జిల్లా పబ్లిక్ స్కూల్లో స్వాతంత్ర్య దినోత్సవానికి ఏర్పాట్లు చేస్తుండగా ప్రమాదం జరిగింది. లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్లో పెను విషాదం చోటుచేసుకుంది. సంభాల్ జిల్లా పబ్లిక్ స్కూల్లో స్వాతంత్ర్య దినోత్సవానికి ఏర్పాట్లు చేస్తుండగా ప్రమాదం జరిగింది. కొందరు విద్యార్థులు జెండాను పాఠశాల భవనంపై ఏర్పాటు చేసేందుకు వెళ్లారు. ప్రమాదవశాత్తూ స్లాబ్ కూలిపోవడంతో విద్యార్థులు కిందపడ్డారు. అదే సమయంలో శిథిలాల కింద చిక్కుకుని ఆరేళ్ల చిన్నారి మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పనీర్, నెయ్యి సహా అనలాగ్ పాల ఉత్పత్తులపై పూర్తి నిషేధం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు తీవ్ర జ్వరం

హైదరాబాద్: విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ మహిళను సినీ నిర్మాత బొమ్మకు మురళికి చెందిన కారు ఢీ కొనడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన బుధవారం రాత్రి అబిడ్స్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ పరుశురామ్ తెలిపిన మేరకు.. నాంపల్లి ఆండాలమ్మబాడ ప్రాంతానికి చెందిన సునీత గన్ఫౌండ్రీలోని ఎస్బీఐలో హౌస్ కీపింగ్గా పనిచేస్తోంది. బుధవారం రాత్రి ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా అబిడ్స్ చాపల్ రోడ్డు వద్ద ఎదురుగా రోడ్డుపై నిలిచి ఉన్న కారు ఒక్కసారిగా అతివేగంతో వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె కాలు విరిగి తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ మహానందను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. డ్రైవర్ను చంపుకోండి: నిర్మాత మురళి బాధితురాలి వైద్యానికి అవసరమైన ఖర్చు భరించాలని స్థానికులు డ్రైవర్ను కోరారు. అయితే తాను కేవలం డ్రైవర్మాత్రమేనని.. యజమాని అయిన ప్రొడ్యూసర్ బొమ్మకు మురళితో మాట్లాడాలని సమాధానం చెప్పాడు. దీంతో వారు నిర్మాతతో మాట్లాడారు. అయితే అతను.. డ్రైవర్నే డబ్బులు అడగాలని, తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనకు చెప్పకుండా కారు బయటకు తీసుకెళ్లాడని.. కావాలంటే మీరు చంపుకోండి.. పోలీస్ కేసు పెట్టుకోండి అని అన్నారు. తాను ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని దురుసుగా మాట్లాడాడు. ఇదిలా ఉండగా నిర్మాత భార్యను షాపింగ్ కోసం తీసుకువచ్చి కారును రోడ్డుపైనే ఆపి నిద్రపోయాడు. ప్రొడ్యూసర్ భార్య డ్రైవర్కు ఫోన్ చేయడంతో ఒక్కసారిగా నిద్రలేచి కారును స్టార్ట్ చేయగా మహిళను ఢీకొట్టినట్లు విచారణలో తేలిందని ఇన్స్పెక్టర్ పరశురామ్ తెలిపారు. హీరో శర్వానంద్ 'జార్జ్ క్రిష్' మూవీ ప్రారంభం (ఫొటోలు) ‘అమీర్ లోగ్’ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ (ఫొటోలు) 'ప్యార్ ప్రేమ కళ్యాణం'మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు) కర్నూలులో వైఎస్ జగన్కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు) సొల్లు కబుర్లు ఎందుకు...? దమ్ముంటే నిరూపించు మామయ్య..! బోండా ఉమాకు ఇచ్చిపడేసిన పేర్ని

ఖరీదైన కొత్త స్మార్ట్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాల్ వైరల్ అవుతోంది.. ఇంటర్నెట్ డెస్క్: కొత్త ఫోన్ కొన్న యువకుడికి ఊహించని షాక్ తగిలింది. ఉత్తర ప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా పరిధిలో ఓ షాకింగ్ సంఘటన వెలుగుచూసింది. ఘజియాబాద్ నుంచి తన స్వగ్రామమైన దంకోర్కు తిరిగి వస్తున్న మజీద్ అనే యువకుడి జేబులో స్మార్ట్ఫోన్ అకస్మాత్తుగా పేలిపోయింది. నెల రోజుల క్రితమే కొనుగోలు చేసిన ఈ ఫోన్.. ప్రయాణంలో ఉండగా విపరీతంగా వేడెక్కింది. బాధితుడు ఫోన్ను జేబులోంచి బయటకు తీసేలోపే అది పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ ప్రమాదంలో మజీద్ దుస్తులకు నిప్పంటుకోవడంతో పాటు అతని రెండు చేతులకూ తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి ఫోన్ ముక్కలుముక్కలైంది. బాధితుడి ఆర్తనాదాలు విన్న చుట్టుపక్కల ప్రజలు వెంటనే స్పందించి మంటలు ఆర్పేసి.. చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఫోన్లోని లిథియం-అయాన్ బ్యాటరీ దెబ్బతినడం లేదా తయారీ సమయంలో ఏర్పడిన అంతర్గత లోపం కారణంగా బ్యాటరీలో సమస్య తలెత్తి ఫోన్ పేలి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. నాసిరకం ఛార్జర్లు, ఫోన్ని గంటల పాటు వాడటంతో హీట్ కావడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అవసరం లేనప్పుడు సాధ్యమైనంత వరకూ ఫోన్ను ఆఫ్ చేసుకొని ఉండటం మంచిదని సూచిస్తున్నారు. ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థికసాయం

హైదరాబాద్ అబిడ్స్లో కారు బీభత్సం సృష్టించింది. విధులు ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న మహిళపైకి కారు దూసుకెళ్లడంతో ఆమె తీవ్రంగా గాయపడింది.. హైదరాబాద్, ఆగస్టు 13: నగరంలోని అబిడ్స్లో బుధవారం మధ్యాహ్నం ఓ కారు బీభత్సం సృష్టించింది. నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న ఓ మహిళను కారు ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. వివరాల ప్రకారం.. గన్ఫౌండ్రీ ఎస్బీఐ బ్యాంకులో హౌస్కీపింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న సునీత.. విధులు ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో సినిమా నిర్మాత డ్రైవర్ మహానంద నడుపుతున్న కారు ఒక్కసారిగా ఆమెపైకి దూసుకెళ్లినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రమాదంలో సునీత కాలుకు ఫ్రాక్చర్ కావడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆమెను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు యజమాని.. ఫిల్మ్ ప్రొడ్యూసర్ బొమ్మకు మురళి యజమాని అని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటన అనంతరం ఆయనకు ఫోన్ చేసి సునీత చికిత్సకు అయ్యే ఖర్చులను భరించాలని కోరినట్లు చెప్పారు. అయితే డబ్బులు ఇవ్వనని దురుసుగా సమాధానం ఇచ్చినట్లు వారు వాపోయారు. వారి ఫిర్యాదు మేరకు.. అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో గది అద్దెలకు కళ్లెం.. పార్లమెంటరీ ఆరోగ్య కమిటీ కీలక సిఫారసు.. రాహుల్ గాంధీ పక్కనున్న వారెవరు.. కేంద్ర మంత్రి ప్రశ్నలకు కాంగ్రెస్ సమాధానం ఏంటంటే

Maripeda: మర్రిపెడ పోలీస్ స్టేషన్లో ప్రమాదం – ఏఎస్సైకి తీవ్ర గాయాలు! Maripeda: మహబూబాబాద్ మరిపెడ పోలీస్ స్టేషన్లో ప్రమాదం. శిథిలావస్థకు చేరిన భవనంలో విధులు నిర్వర్తిస్తున్న ఏఎస్సై శ్రీనివాసరావుపై సీలింగ్ పెచ్చులు ఊడిపడ్డాయి. గాయపడిన ఆయన భుజానికి దెబ్బతగలడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ AR Rahman son Ameen),కుమారుడు, గాయకుడు అమీన్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ AR Rahman son Ameen),కుమారుడు, గాయకుడు అమీన్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. చెన్నైలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో అమీన్తో పాటు ఆయనతో ప్రయాణిస్తున్న స్నేహితుడికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు సమాచారం. సోమవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో అమీన్ తన పోర్షే కారులో ఓ స్నేహితుడితో కలిసి గిండి వైపు వెళ్తున్నారు. ఒలింపియా టెక్ పార్క్ సమీపంలోని సిగ్నల్ వద్దకు చేరుకోగానే వేగంగా వచ్చిన వాగన్ ఆర్ కారు.. అమీన్ ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టినట్లు స్థానికుల నుంచి సమాచారం. ఈ ప్రమాదంలో అమీన్, ఆయన స్నేహితుడికి స్వల్ప గాయాలు కావడంతో స్థానికులు వెంటనే వారిని సమీపంలోని కావేరీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించిన అనంతరం ఇద్దరినీ డిశ్చార్జ్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. (Ameen road accident) ఇదిలా ఉండగా.. ప్రమాదానికి కారణమైనట్లు భావిస్తున్న వాగన్ ఆర్ కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. అతడిని కళైంగర్ సెంటెనరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై అడయార్ ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ వింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి సంబంధించిన రెండు వాహనాలను సీజ్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం ఎలా జరిగింది? ఎవరి నిర్లక్ష్యం కారణమనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. తండ్రి ఏఆర్ రెహమాన్ బాటలో సంగీత రంగంలోకి అడుగుపెట్టిన అమీన్ గాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు

హైదరాబాద్లోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి హైదర్ షాకోట్లో ఎస్ఎంపీ స్కూల్ సమీపంలో మహేంద్ర XUV కారు బీభత్సం సృష్టించింది. ఈ కారు ఢీకొని రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతిచెందారు. హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధి హైదర్ షాకోట్లో ఎస్ఎంపీ స్కూల్ సమీపంలో మహేంద్ర XUV కారు బీభత్సం సృష్టించింది. ఈ కారు ఢీకొని రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి మృతిచెందారు. రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగిని ఈ కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం రాపిడో బైక్పై వెళ్తున్న ఇద్దరినీ ఈ కారు ఢీకొట్టింది. బైక్పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. అందులో ఒకరికి కాలు విరిగింది. గాయపడిన వారిని ప్రైవేట్ ఆస్పత్రికి నార్సింగి పోలీసులు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ప్రమాదం తర్వాత కారును అక్కడే వదిలి నలుగురు యువకులు పరారయ్యారు. కారు నంబర్ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరించారు. ఢీకొట్టిన కారు శంషాబాద్కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఈ కారు అతివేగంగా దూసుకురావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కారులో ఉన్నవారు మద్యం మత్తులో ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుమురం భీమ్ ఆశయాల సాధనకు అందరూ ఐక్యంగా కృషి చేయాలి: మంత్రి సీతక్క తెలంగాణలో నక్సలిజం పూర్తిగా అంతమైంది: డీజీపీ సీవీ ఆనంద్ సీనియర్ సిటిజన్లే టార్గెట్గా సైబర్ కేటుగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు: సీపీ సజ్జనార్

శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం భారీ వర్షాలతో కూడిన పిడుగులు బీభత్సం సృష్టించాయి. మందస ఏజెన్సీ ప్రాంతంలోని పాతకోటలో పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. శ్రీకాకుళం: జిల్లాలో ఇవాళ (ఆదివారం) భారీ వర్షాలతో కూడిన పిడుగులు బీభత్సం సృష్టించాయి. మందస ఏజెన్సీ ప్రాంతంలోని పాతకోటలో పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను కట్ట సుమిద్రి, సవర జోరాగా గుర్తించారు. బాధితులంతా వ్యవసాయ పనులు చేస్తుండగా.. ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను స్థానికులు వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో పాతకోటలో విషాద ఛాయలు అలుముకోగా.. మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణం మారింది. శ్రీకాకుళం జిల్లాతో పాటు పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల కింద ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచిస్తున్నారు. ఎల్నినో వేళ పంటలకు పట్టిసీమ నీరే జీవాధారం: సీఎం చంద్రబాబు రాజమహేంద్రవరం వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి
అనంతపురం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పామిడి మండలం పొగరూరు సమీపంలోని బ్రిడ్జి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. లారీ - ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో రెండూ కూడా కల్వర్టుపై నుంచి కింద పడ్డాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 32 మందిలో 20 మందికి తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది. అటువైపు వెళ్తున్న వారు చూసి విషయాన్ని వెంటనే పోలీసులకు చెప్పడంతో, సహాయక చర్యలు మొదలయ్యాయి.హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న లారీ - ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ఘటనతో రెండు వాహనాలు కూడా కల్వర్టులోకి పడిపోయాయి. స్థానికులు వెంటనే రెండు వాహనాల డ్రైవర్లను బయటకు తీశారు. బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పామిడి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగం, నిద్ర మత్తే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఘటనకు కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు- ఐషర్ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురం, ఆగస్టు 09: అనంతపురం జిల్లా పామిడి మండలం పొగరూరు గ్రామ సమీపంలోని హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు- ఐషర్ వాహనం ఢీకొన్నాయి. దీంతో కల్వర్టుపై నుంచి ఆ రెండు వాహనాలు కింద పడ్డాయి. ఈ ప్రమాదంలో 18 మంది ప్రయాణికులతోపాటు డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను పామిడిలోని ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు బస్సు- ఐషర్ వాహనాల్లో ఇరుక్కుపోయిన డ్రైవర్లను స్థానికుల సహాయంతో పోలీసులు రక్షించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతి వేగంతోపాటు నిద్ర మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అంచనా వేస్తున్నారు