
RS Praveen Kumar | గద్వాల చేనేత కార్మికులను అవమానించి..గురుకులాల్లో చదివే విద్యార్థులకు సప్లయ్ చేసే యూనిఫాం, దుప్పట్లు, టవల్స్ ను గద్వాల నేతన్నలు, సిరిసిల్ల నేతన్నలు తయారు
చేయకుండా కాంట్రాక్టును బాంబేలో ఉండే మఫత్లాల్కు ఇచ్చారని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
గద్వాలలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గద్వాల చేనేత కార్మికులు గురుకుల విద్యార్థులకు అందించే బట్టలను నేయొద్దా..? వాళ్లు టవల్స్ను, బెడ్షీట్లను, దుప్పట్లను నేయలేరా.. ? అన్నీ నేయగలరు కానీ అవన్నీ తీసుకపోయి మఫత్లాల్కు ఇచ్చారు.. మరిరాష్ట్రంలో మఫత్లాల్నే మంత్రిగా పెడితే అయిపోతుంది కదా అని మండిపడ్డారు.
డ్రగ్స్ కేసులో దొరికిన నిరంజన్ కుమార్ జైన్కు మీరు ట్రంకు పెట్టెల కాంట్రాక్టులను ఇచ్చారు. అంటే ఆయన ట్రంక్ పెట్టెల్లో విద్యార్థినీ విద్యార్థులకు గంజాయి్ సప్లై చేయడం కోసమా..? ఇయ్యాళ్ల ప్రభుత్వ స్కూళ్లలో పరిస్థితులు బాగా లేవని తల్లిదండ్రులంతా కూడా ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తుంటే ప్రైవేట్ స్కూల్వాళ్లు సందట్లో సడేమియాలా స్కూల్ ఫీజుల రేట్లు పెంచేశారు. పిల్లల తల్లిదండ్రులు ఎక్కడి నుంచి తీసుకొస్తరని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలను నాశనం చేస్తూ, ప్రైవేట్ పాఠశాలల ఫీజుల పెంపును అదుపు చేయలేని చేతకాని దద్దమ్మ రేవంత్ రెడ్డి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు.
గురుకులాల్లో చదివే విద్యార్థులకు సప్లయ్ చేసే యూనిఫాం, దుప్పట్లు, టవల్స్ కాంట్రాక్టును ఇతర రాష్ట్రాలకు చెందిన మఫత్లాల్ కు ఇచ్చారు.
అంటే గద్వాలలో ఉండే చేనేత కార్మికులు వాటిని సప్లయ్ చేయలేరా?
డ్రగ్స్ కేసులో దొరికిన స్మగ్లర్లకు గురుకులాల్లో… New rules | ఐటీఆర్ నుంచి ఆధార్, క్రెడిట్ కార్డుల వరకు.. జూలై ఒకటో తేదీ నుంచి మారనున్న కొన్ని రూల్స్..!
India’s Market | మళ్లీ ఐదో ర్యాంకుకు చేరిన భారత ఈక్విటీ మార్కెట్.. కారణాలు ఇవే..!
‘యంగ్ ఇండియా స్కూల్ కొత్తగూడెం నియోజకవర్గానికి కీర్తి పతాక’