
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణే రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ (26) మృతి కేసులో దర్యాప్తు వేగవంతమైంది.
ప్రమాదవశాత్తు కొండపై నుంచి జారిపడి చనిపోయాడని భావించిన ఈ కేసు, పక్కా ప్రణాళికతో జరిగిన హత్యగా తేలడంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న కేతన్ కాబోయే భార్య సియా గోయల్ (20), ఆమె ప్రియుడు చేతన్ చౌదరి (22)లను ఈరోజు ఉదయం లోహగడ్ కోటకు తీసుకెళ్లి క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ను నిర్వహించారు.జూన్ 18న లోనావాలా సమీపంలోని లోహగడ్ కోటలో ట్రెకింగ్ చేస్తుండగా కేతన్ అగర్వాల్ సుమారు 350-400 అడుగుల లోయలో పడి మరణించారు. అప్పట్లో ఇది ప్రమాదంగా నమోదైంది. అయితే, దర్యాప్తులో భాగంగా సియా, చేతన్ల మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం బయటపడింది. నవంబర్లో జరగాల్సిన పెళ్లిని తప్పించుకోవడానికే వారిద్దరూ కలిసి కేతన్ను హత్య చేయాలని కుట్ర పన్నినట్లు పోలీసులు నిర్ధారించారు.ప్రణాళిక ప్రకారం, సియా కేతన్ను కోటలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లింది. అప్పటికే వారిని అనుసరిస్తున్న చేతన్, సియా నుంచి సైగ అందగానే కేతన్ను వెనుక నుంచి బలంగా లోయలోకి తోసేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో, నిందితుల వాంగ్మూలాలను ధ్రువీకరించుకోవడానికి, మరిన్ని ఆధారాలు సేకరించడానికి పోలీసులు ఈరోజు కోట వద్ద క్రైమ్ సీన్ రీక్రియేట్ చేశారు. ఈ ప్రక్రియ కోసం కేతన్ బరువుతో ఉన్న ఒక డమ్మీని కూడా ఉపయోగించినట్లు సమాచారం. పర్యాటకులను కోటలోకి అనుమతించకుండా కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ కార్యక్రమాన్ని పూర్తిచేశారు.ప్రస్తుతం విచారణలో నిందితులిద్దరూ