
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
India Vs Irland Match: 2028 టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ (Board of Control for Cricket in India) ఇప్పటినుంచే బెస్ట్ టీమ్ను తయారుచేసే పనిలో పడింది. అందులో భాగంగా యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి జట్టులో స్థానం కల్పిస్తూ బీసీసీఐ కీలక డెసిషన్ తీసుకుంది.
ఓపెనర్గా అభిషేక్ శర్మ.. ఇండియా టీమ్ నుంచి ఓపెనర్గా విధ్వంసకర బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ ఉన్నారు. అతనికి వైభవ్ తోడయితే స్టేడియంలో పరుగుల వరద పారుతుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. వీరితో పాటు టీ20 ప్రపంచ కప్ నెగ్గిన జట్టు నుంచి అర్ష్దీప్ సింగ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, సంజు శాంసన్ సీనియర్ ప్లేయర్లు ఇప్పటికే జట్టులో ఉన్నారు. దీంతో ఇండియన్ టీమ్ బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా కనిపిస్తోంది. టీ 20 ప్రపంచ కప్ గెలిపించిన సూర్యకుమర్ యాదవ్కు మాత్రం జట్టులో స్థానం దక్కలేదు.
గత కొంతకాలంగా ఐపీఎల్, అంతర్జాతీయ ఫార్మాట్లలో సూర్యకుమార్ ఫామ్లో లేక సతమతమవుతున్నాడు. దీంతో సూర్యను జట్టు నుంచి తప్పిస్తూ కెప్టెన్సీ బాధ్యతలను శ్రేయాస్ అయ్యర్కు కట్టబెట్టారు. గత మూడు సీజన్లుగా ఐపీఎల్లో కెప్టెన్గా శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతడికి సెలెక్టర్లు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. యువ ఆటగాడు తిలక్ వర్మను వైస్ కెప్టెన్గా నియమించారు. గాయం కారణంగా ఐపీఎల్ 2026, టీ20 ప్రపంచకప్లకు దూరమైన స్పీడ్స్టర్ హర్షిత్ రాణా తిరిగి జట్టులోకి ప్రవేశించాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.