
సినిమా ఇండస్ట్రీలో అదృష్టం ఎప్పుడు ఎవరిని, ఎలా వరిస్తుందో చెప్పడం చాలా కష్టం. కొంతమంది ఊహించని విదంగా అవకాశాలు అందుకుంటూ ఉంటారు. మరికొందరు ఆఫర్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు.
ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ రస్నా యాడ్ ద్వారా ప్రేక్షకులను అలరించి ఆతర్వాత హీరోయిన్ అయ్యింది. ఇప్పుడు తక్కువ కానీ ఒకప్పుడు రస్నా యాడ్ చాలా పపౌలర్ అయ్యింది.
ఈ యాడ్ లో ఎంతో ముద్దుగా, అమాయకంగా కనిపించిన కనిపించిన చిన్నారి గుర్తుందా.? ఒకప్పుడు రస్నా యాడ్ ద్వారా బుల్లితెరపై సందడి చేసిన ఈ చిన్నారి.. ఆ తర్వాత క్రేజీ హీరోయిన్ గా మారింది. తెలుగులో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది ఆ ముద్దుగుమ్మ. అంతేకాదు.. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఓ సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది.
అప్పట్లో అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది. తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు ఒకప్పుడు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. తెలుగులో దాదాపు అందరూ టాప్ హీరోలతో నటించి మెప్పించింది. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు.. అంకిత. అప్పట్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంకిత. లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.
ఆ తర్వాత డైరెక్టర్ రాజమౌళి, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చి సెన్సేషనల్ హిట్ అయిన సింహాద్రి సినిమాలో హీరోయిన్ గా నటించింది. అప్పట్లో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో గ్లామర్ బ్యూటీగా కనిపించి మెస్మరైజ్ చేసింది అంకిత. ఆ తర్వాత తెలుగులో మరిన్ని ఆఫర్స్ అందుకుంది ఈ భామ. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది
ఆ తర్వాత లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో హీరోయిన్గా అరంగేట్రం చేసింది. తెలుగులో సింహాద్రి, విజయేంద్ర వర్మ, సీతారాముడు, అనసూయ, నవవసంతం వంటి చిత్రాల్లో నటించింది. తెలుగుతోపాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో కనిపించింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే విశాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలోనూ పెద్దగా కనిపించడం లేదు ఈ అమ్మడు.