
విశాఖపట్నం: విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో జులై 8వ తేదీ నుంచి సర్వీసులు ప్రారంభించనున్నారు.
సాధారణంగా ప్రయాణికుల టికెట్టుపై యూజర్ డెవలెప్మెంట్ ఫీజు (యూడీఎఫ్) వసూలు చేస్తారు. జీఎంఆర్ సంస్థ పీపీపీ మోడ్లో నిర్మించిన ఈ విమానాశ్రయానికి ఎయిర్ పోర్టు ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ (ఏఈఆర్ఏ) తాత్కాలిక యూడీఎఫ్ టారిఫ్ను తాజాగా విడుదల చేసింది. భోగాపురం నుంచి బయలుదేరే దేశీయ ప్రయాణికులకు రూ.835, చేరుకునేవారికి రూ.355.; అంతర్జాతీయ ప్రయాణికులైతే బయలుదేరే వారికి రూ.1,255, వచ్చేవారికి రూ.545గా ఉండనున్నాయి. ఈ తాత్కాలిక టారిఫ్ పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జగన్ కబంధ హస్తాల్లో వైకాపా కాపు నేతలు ఇరుక్కున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.