టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్చరణ్ బాక్సాఫీస్ వద్ద తన తిరుగులేని ఇమేజ్ని మరోసారి నిరూపించుకున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘పెద్ది’ థియేటర్లలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.
చరణ్ కెరీర్లోనే అత్యంత భారీ మాస్ ఎలివేషన్స్, విలక్షణమైన నటనతో కూడిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్ల కలెక్షన్లను సాధించి, చరణ్ కెరీర్లో బిగ్గెస్ట్ సోలో బ్లాక్బస్టర్గా అవతరించింది.ఈ సంచలన విజయం నేపథ్యంలో తాజాగా ప్రముఖ జాతీయ వార్తా ఛానల్ 'రిపబ్లిక్ టీవీ' నిర్వహించిన ఒక ప్రత్యేక డిబేట్లో రామ్చరణ్ పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ ఆయనకు ఒక ఆసక్తికరమైన, వైవిధ్యమైన ప్రశ్నను సంధించారు. "ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి, యువనేత నారా లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయినప్పటికీ.. లోకేష్ ఆ పదవులను, పవర్ను ఎప్పుడూ 'ఫర్ గ్రాంటెడ్'గా తీసుకోలేదు. ఆయన కింది స్థాయి నుండి కష్టపడి తనను తాను ఒక సెల్ఫ్-మేడ్ లీడర్గా మార్చుకున్నారు, ఒక స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. మీ ఇద్దరి పర్సనాలిటీలు, వారసత్వ ప్రస్థానంలో ఈ పోలిక ఉంది కదా?" అని యాంకర్ అడిగారు. దీనికి రామ్చరణ్ ఎంతో వినయంగా స్పందిస్తూ, "ఖచ్చితంగా" అంటూ అంగీకరించారు.* నారా వారి ఇంట వారసుడు.. మగబిడ్డకు జన్మనిచ్చిన నారా రోహిత్ భార్య శిరీష చరణ్, లోకేష్ల ప్రస్థానంలో సారూప్యతలుసినిమా, రాజకీయాలు సమాజంలో అత్యంత ప్రభావవంతమైన రంగాలు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్చరణ్, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి పుత్రుడిగా నారా లోకేష్ తమ రంగాల్లోకి అడుగుపెట్టినప్పుడు వారిపై అపారమైన బాధ్యతలు, ఊహించని ఒత్తిడి ఉన్నాయి. ప్రారంభంలో ఇద్దరికీ కొన్ని విమర్శలు, సవాళ్లు ఎదురయ్యాయి. చరణ్ తొలినాళ్ల నటనపై, లోకేష్ వాగ్ధాటిపై కొందరు పెదవి విరిచినా.. ఇద్దరూ ఆ ఒత్తిడికి లొంగిపోకుండా, విమర్శలనే మెట్లుగా మార్చుకుని పట్టుదలతో ముందుకు సాగారు. సెల్ఫ్ మేడ్ ఐడెంటిటీవారసత్వం అనేది కేవలం ఎంట్రీ కార్డు మాత్రమే ఇస్తుందని, నిలబడాలంటే సొంత ప్రతిభ ఉండాలని వీరిద్దరూ నిరూపించారు. చరణ్ 'చిరంజీవి కొడుకు' అనే ట్యాగ్ను దాటి 'మగధీర', 'రంగస్థలం', 'RRR', తాజాగా ‘పెద్ది’ చిత్రంతో గ్లోబల్ స్టార్గా ఎదిగారు. మరోవైపు నారా లోకేష్ సైతం కేవలం చంద్రబాబు కుమారుడిగా పరిమితం కాకుండా, మంగళగిరిలో గ్రౌండ్ లెవెల్ నుండి పనిచేసి, రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకుని ప్రజాదరణ కలిగిన యువ నాయకుడిగా నిలదొక్కుకున్నారు. ఆధునిక ఆలోచనలుఈ ఇద్దరు యువ కిరణాలు ఉన్నత విద్యావంతులు కావడంతో ఆధునిక ఆలోచనా దృక్పథంతో దూసుకుపోతున్నారు. రామ్చరణ్ కేవలం హీరోగానే కాకుండా సక్సెస్ఫుల్ బిజినెస్మెన్గానూ రాణిస్తున్నారు. ఇక లోకేష్ ఐటీ బ్యాక్గ్రౌండ్తో పార్టీ యంత్రాంగం, ప్రభుత్వ పరిపాలనలో టెక్నాలజీని, డేటా అనలిటిక్స్ను సమర్థవంతంగా వాడుతూ పార్టీని మరింత పటిష్ఠంగా మార్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే సహనం, వినయం వీరిద్దరి ప్రత్యేకత. తండ్రులకు తగ్గ తనయులుగా, తెలుగు రాష్ట్రాల గర్వకారణంగా ఎదిగిన వీరిద్దరి ప్రస్థానం భవిష్యత్ తరాలకు ఒక గొప్ప ఆదర్శమనే చెప్పాలి.