
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలలో ఒకటైన ముంబై ఇండియన్స్లో భారీ మార్పులకు రంగం సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది.
కెప్టెన్గా విఫలమైన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టును వీడటం దాదాపు ఖాయమైంది. అతని స్థానంలో రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ను ట్రేడింగ్ ద్వారా జట్టులోకి తీసుకురావాలని ముంబై యాజమాన్యం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు జాతీయ క్రీడా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.గుజరాత్ టైటాన్స్ నుంచి భారీ అంచనాలతో ముంబైకి తిరిగివచ్చిన హార్దిక్ పాండ్యా, కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జట్టును సమర్థంగా నడిపించలేకపోయాడు. జట్టు ప్రదర్శన పేలవంగా ఉండటంతో పాటు, డ్రెస్సింగ్ రూమ్లో కూడా విభేదాలు తలెత్తినట్టు వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, ముంబై ఇండియన్స్తో తన ప్రయాణాన్ని ముగించుకోవాలని హార్దిక్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 'RevSportz' కథనం ప్రకారం.. హార్దిక్ పాండ్యాను రాజస్థాన్ రాయల్స్కు ఇచ్చి, ప్రతిగా యశస్వి జైస్వాల్ను తీసుకునేందుకు ఇరు ఫ్రాంచైజీల మధ్య చర్చలు చివరి దశలో ఉన్నాయని సమాచారం.మరోవైపు యశస్వి జైస్వాల్ కూడా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీతో సంతోషంగా లేనట్టు తెలుస్తోంది. సంజూ శాంసన్ నిష్క్రమణ తర్వాత జట్టులో కీలక ఆటగాడిగా, కెప్టెన్సీ రేసులో జైస్వాల్ ముందుంటాడని భావించారు. అయితే, యాజమాన్యం అతని స్థానంలో రియాన్ పరాగ్కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. దీనికి తోడు 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రాకతో జైస్వాల్ ప్రాధాన్యం తగ్గినట్టు భావిస్తున్నారు. ముంబై రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జైస్వాల్కు, ముంబై ఇండియన్స్లోకి రావడం కెరీర్ పరంగా ఎంతో మేలు చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.హార్దిక్