నీట్ (యూజీ) రీ-ఎగ్జామినేషన్కు హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. పరీక్ష రోజైన జూన్ 21న టీజీఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. పరీక్షకు వెళ్లే అభ్యర్థులు తమ హాల్ టికెట్ చూపించి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది.ఎన్ఎస్యూఐ రాష్ట్ర కమిటీ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వంటి నగరాల్లోని పరీక్షా కేంద్రాలకు వచ్చే విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రయాణ ఇబ్బందులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి ఉచిత ప్రయాణానికి ఆదేశాలు జారీ చేశారని మంత్రి వివరించారు.ఇటీవల నీట్ పరీక్షలో చోటుచేసుకున్న అవకతవకల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) రీ-ఎగ్జామ్ను నిర్వహిస్తోంది. ఈ తరుణంలో విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం పడకుండా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో నీట్ అభ్యర్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. పంజాబ్, ఢిల్లీ, హర్యానా, ఒడిశా వంటి ఇతర రాష్ట్రాలు కూడా విద్యార్థుల కోసం ఇలాంటి ఏర్పాట్లు చేశాయి. ప్రభుత్వ నిర్ణయంతో వేలాది మంది విద్యార్థులకు ప్రయాణ ఖర్చులు తగ్గడమే కాకుండా, ఎటువంటి ఒత్తిడి లేకుండా పరీక్షా కేంద్రాలకు చేరుకునే వీలు కలుగుతుంది
.