
Kishan Reddy VS CM Revanth reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పాఠాలు అవసరంలేదన్నారు. తనపై బురద జల్లే కార్యక్రమంను సీఎం రేవంత్ రెడ్డి మానుకొవాలన్నారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 అమలుకు కేంద్రం రూ.1,200 కోట్లు అందించిందని వెల్లడించారు. ఐఆర్ఎఫ్సీ ద్వారా రుణం పొందేందుకు కూడా కేంద్రం తమవంతుగా సహాకారం అందిస్తుందని వెల్లడించారు. ఐఆర్ఎఫ్సీ రూ.13 వేల కోట్ల రుణ ప్రతిపాదన విషయంలో కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయన్నారు.
జహీరాబాద్లో ఇండస్ట్రియల్ ప్రాజెక్టు, ఎన్టీపీసీ విద్యుత్ ప్రాజెక్టు,హైదరాబాద్ మెట్రో అన్ని రకాలుగా కేంద్రం అండగా నిలుస్తుందని వెల్లడించారు. తనపై తప్పుడు ఆరోపణలు మానుకొవాలని సీఎం రేవంత్