
నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ను అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పరీక్షల్లో అక్రమాలను, చీటింగ్ నెట్ వర్క్లను నిరోధించే చర్యల్లో భాగంగా ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్పై దేశవ్యాప్తంగా తాత్కాలిక ఆంక్షలు విధించింది.
జూన్ 21న పరీక్ష జరగనున్న నేపథ్యంలో, జూన్ 22 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ల నుంచి టెలిగ్రామ్ను తొలగించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు.
"దొంగను పట్టుకోవడం చేతకాక, బాధితుడి ఇంటికి తాళం వేసినట్లుంది" అంటూ 'ఎక్స్' వేదికగా విమర్శలు గుప్పించారు. పేపర్ లీకేజీలను అరికట్టేందుకు మోదీ ప్రభుత్వం ఇదొక కొత్త ఉపాయాన్ని కనిపెట్టిందని ఆయన ఎద్దేవా చేశారు. అసలైన పేపర్ లీక్ మాఫియాను విడిచిపెట్టి, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.
లక్షలాది మంది విద్యార్థులు తమ నోట్స్, టెస్ట్ సిరీస్ల కోసం టెలిగ్రామ్పైనే ఆధారపడతారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.అయితే, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సమర్థించుకుంది. వ్యవస్థీకృత చీటింగ్ ముఠాలు రీ-టెస్ట్లో మోసాలకు ఎటువంటి అక్రమాలకు పాల్పడకుండా నిరోధించేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది.
పరీక్ష పత్రాల భద్రతను పర్యవేక్షించేందుకు భారత వైమానిక దళం (ఐఏఎఫ్) సహాయాన్ని కూడా తీసుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.టెలిగ్రామ్ నిషేధంపై ఆ సంస్థ సీఈఓ పావెల్ డ్యూరోవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు చేసే