
నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్పై భారత్లో తాత్కాలిక నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 22 వరకు దేశవ్యాప్తంగా ఈ యాప్ సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది.
పరీక్షల్లో అక్రమాలు, తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సిఫార్సుల మేరకు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000, సెక్షన్ 69ఏ కింద ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఆదేశాల ఫలితంగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి టెలిగ్రామ్ యాప్ను తొలగించారు.
యాపిల్ యాప్ స్టోర్లో కూడా ఈ యాప్ను తాత్కాలికంగా అందుబాటులో లేకుండా చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనితో పాటు, జూన్ 30 వరకు టెలిగ్రామ్లో మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ను నిలిపివేయాలని సూచించింది. పాత మెసేజ్లను ఎడిట్ చేస్తూ, పేపర్ లీక్ అయినట్లు కృత్రిమ ఆధారాలు సృష్టిస్తున్న ఉదంతాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.మే 2026లో జరిగిన నీట్ పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణలు వెల్లువెత్తడంతో జూన్ 21న రీ-ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో పలు టెలిగ్రామ్ ఛానెళ్లు, గ్రూపుల ద్వారా చీటింగ్ ముఠాలు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఎన్టీఏ గుర్తించింది. కొన్ని ఛానెళ్లను తొలగించినా సమస్య తీవ్రత తగ్గకపోవడంతో, దేశవ్యాప్త నిషేధానికి సిఫార్సు చేయగా, ప్రభుత్వం ఆ మేరకు చర్యలు చేపట్టింది
.