
ప్రత్యామ్నాయ పంటలకు ప్రత్యేక ప్రోత్సాహకం సాగు భూములకే రైతు భరోసా కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు Telangana Govt: తెలంగాణలో వరి సాగు విపరీతంగా పెరుగుతుండటంతో, ఇతర పంటల సాగును పెంచేందుకు రాష్ట్ర...
ప్రత్యామ్నాయ పంటలకు ప్రత్యేక ప్రోత్సాహకం సాగు భూములకే రైతు భరోసా కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు Telangana Govt: తెలంగాణలో వరి సాగు విపరీతంగా పెరుగుతుండటంతో, ఇతర పంటల సాగును పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త వ్యవసాయ విధానాన్ని తీసుకురాబోతోంది. వరికి బదులుగా కందులు, పెసలు, జొన్నలు, మొక్కజొన్న, నూనెగింజలు, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలు వేసే రైతులకు ఎకరానికి రూ.4 వేల నుండి రూ.5 వేల వరకు ప్రత్యేక ప్రోత్సాహకం అందించాలనే కీలక ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. రాష్ట్రంలో సాగునీటి లభ్యత పెరగడం, ధాన్యం కొనుగోళ్లు, సన్న రకాలకు బోనస్ ఇవ్వడం వల్ల రైతులు వరి వైపే మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల పప్పుధాన్యాలు, వంటనూనెల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తుండటంతో, స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుంది. Rythu Bharosa Scheme: రైతుల ఖాతాల్లోకి ‘రైతుభరోసా’ నిధులు.. రెండు రోజుల్లోనే రూ.4,072 కోట్ల పంపిణీ.. మీ ఖాతాల్లో డబ్బులు పడ్డాయా? రైతు భరోసాలో మార్పులు: సాగు భూములకే పెట్టుబడి సాయం: త్వరలో జరగబోయే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో రైతు భరోసా నిబంధనల మార్పుపై కీలక చర్చ జరగనుంది. ఇకపై శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా నిజంగా పంటలు సాగు చేస్తున్న భూములను గుర్తించి, వాటికే రైతు భరోసా అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సాగు చేయని భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, రాళ్లు, గుట్టలు ఉన్న ప్రాంతాలకు ఈ సాయాన్ని నిలిపివేయనున్నారు. ఈ కొత్త నిబంధనల ద్వారా ప్రభుత్వానికి(Telangana Govt) ఆదా అయ్యే నిధులను వృథా కానివ్వకుండా, రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరేలా పంటల బోనస్, ఉచిత పంటల బీమా వంటి ఇతర సంక్షేమ కార్యక్రమాలకు మళ్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు: ఇతర మౌలిక వసతులపై చర్చ: ప్రత్యామ్నాయ పంటల సాగు వల్ల తక్కువ నీటితో రైతులకు ఎక్కువ ఆదాయం లభించడమే కాకుండా, భూసారం కూడా పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వ్యవసాయ మార్పులతో పాటు, రాబోయే కేబినెట్ భేటీలో వీబీజీరామ్జీ అమలు, మెట్రో రైలు విస్తరణకు అవసరమైన రుణాలపై ఎస్బీఐ క్యాప్స్ రూపొందించిన నివేదిక వంటి ఇతర కీలక అంశాలపై కూడా విస్తృతంగా చర్చించనున్నారు. రైతు సంక్షేమం, వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు, మౌలిక వసతుల అభివృద్ధే లక్ష్యంగా ఈ మంత్రివర్గ సమావేశంలో పలు సంచలన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.