నిమిషం•Telangana•11 ఆగ
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో నేడు దంచికొట్టనున్న వానలు
Weather Updates : వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు వర్షాలు దంచికొట్టనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో బుధవారం ఏపీలోని మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, అనకాపల్లి, కోనసీమ, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉరుములు, ఈదురుగాలులు వీచే సమయంలో ప్రజలు చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల వద్ద, భారీ హోర్డింగ్స్ వద్దగానీ నిలబడకూడదని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది. తెలంగాణలోకూడా ఇవాళ (బుధవారం) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్ధపేట, సిరిసిల్ల, కరీంనగర్, జనగాం, మహబూబాబాద్, నల్గొండ, నాగకర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలతోపాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది