
Heavy Rain Alert : తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. జూలై చివర్లో మాదిరిగానే ఆగస్ట్ ఎండింగ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నాయి. వర్షాల కోసం ఎదురుచూస్తున్న తెలుగు ప్రజలకు ఇవాళ్టి (ఆగస్ట్ 22, శనివారం) నుండి కాస్త ఊరట లభించనుంది... వానలు మొదలవుతాయని ప్రకటించాయి. ముఖ్యంగా ఆగస్ట్ 22 నుండి 26 వరకు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు కూడా చెబుతున్నారు.
ప్రస్తుతం పసిఫిక్ మహా సముద్రంలో 2 తుపానులు కొనసాగుతున్నాయి... ఒకటి సాడెల్, ఇంకోటి లాలా. ఇక ఇదే పసిఫిక్ సముద్రంలో రెండు వాయుగుండాలు, 5 అల్పపీడనాలు కూడా ఏర్పడ్డాయని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావం నేరుగా ఇండియాపై లేకపోయినా పరోక్షంగా వర్షాలను ప్రభావితం చేస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నాయి.
రాబోయే రోజుల్లో బంగాళాఖాతంలో ఆవర్తనాలు, అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వీటి ప్రభావం తెలుగు రాష్ట్రాలపై నేరుగా ఉంటుంది... వర్షాలు జోరందుకుంటాయి. ఇలా ఆగస్ట్ లాస్ట్ వీక్, సెప్టెంబర్ ఆరంభంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో మంచి వర్షాలే కురుస్తాయని వాతావరణ శాఖలు, నిపుణులు చెబుతున్నారు.
ఇవాళ (ఆగస్ట్ 22, శనివారం) ఉదయం నుండి మధ్యాహ్నం వరకు తెలంగాణలో ఎండ, ఉక్కపోత కొనసాగుతుందని వెదర్ మ్యాన్ తెలిపారు. సాయంత్రం ఆకాశంలో మేఘాలు కమ్ముకుని వర్షాలు మొదలవుతాయని... మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో సాయంత్రం లేదా రాత్రి వేళలో వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఇక సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, కామారెడ్డి, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో రాత్రి సమయంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ ప్రకటించారు.
హైదరాబాద్ విషయానికి వస్తే రోజంతా పొడి వాతావరణం ఉంటుందని వెదర్ మ్యాన్ వెల్లడించారు. సాయంత్రం లేదా రాత్రి సమయంలో కొన్నిచోట్ల చిరుజల్లులు, ఒకటిరెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. రేపు (ఆగస్ట్ 23, ఆదివారం) తెలంగాణలో వర్షాలు జోరందుకుంటాయని... భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెదర్ మ్యాన్ ప్రకటించారు.
ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో నేడు (ఆగస్ట్ 22) అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ విభాగం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు యానాంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ వర్షాలకు ఉరుములు మెరుపులు, ఈదురుగాలులు కూడా తోడయితే పరిస్థితి ప్రమాదకరంగా మారతుంది... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
Found this helpful?
Share this story with your network










