
© 2026 nimisham.in


Auto Fare Hike : తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు, కార్మికుల సమస్యల పరి ష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట్ స్వామి స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో మంత్రులు, ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు, కార్మిక సంఘాల ప్రతినిధులు తమ సమస్యలను మంత్రులకు వివరించారు. వాటిపై మంత్రులు, ఉన్నతాధికారులు సుదీర్ఘంగా చర్చించారు. గత ఆగస్టు 23న జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను కూడా సమీక్షించారు. ఈ పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు.








