
© 2026 nimisham.in


Telangana Politics : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. స్పీకర్ కంటతడిసైతం పెట్టుకున్నారు. దీంతో గడ్డం ప్రసాద్ కుమార్ను కులం పేరుతోపాటు, అసభ్య పదజాలంతో దూషించారని స్పీకర్ ఓఎస్డీ పొల్లెపల్లి వెంకటేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం వారిని అరెస్టు చేసి, విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్లకు తరలించారు.








