UPI MDR GST: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) పేమెంట్లపై ఛార్జీలు అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. రూ.2000 దాటిన పేమెంట్లపై ఛార్జీలు ఖరారు చేశారు. అయితే, ఈ ఎండీఆర్ ఛార్జీలపైనా 18 శాతం జీఎస్టీ బాదుడు ఉందని చాలా మందికి తెలియదు. అంటే యూపీఐ ఛార్జీలు ప్లస్ జీఎస్టీ సైతం చెల్లించాల్సి వస్తుంది. ఇక ఒక వస్తువు కొన్నప్పుడు దానిపైన పడే జీఎస్టీ కట్టాలి, ఒక వేళ యూపీఐ చేస్తే దాని ఛార్జీలు ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. రూ.30 వేల టీవీ కొనుగోలుతో ఈ ఛార్జీల వివరాలు తెలుసుకుందాం.





