

- తిరుమల భక్తులకు ఉచిత ఇన్సూరెన్స్
- ఉద్యోగుల బీమా పది లక్షలు
- లడ్డూలకు నాలుగువందల మంది సిబ్బంది
TTD Board: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి భక్తులు, టీటీడీ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పాలక మండలి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్రతో కలిసి ఈ వివరాలను వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా ఎల్ఐసీ ద్వారా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని, సెప్టెంబర్ 15న సీఎం చంద్రబాబు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు.
- ఉద్యోగుల బీమా పది లక్షలు





