
సికింద్రాబాద్లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మైలార్గడ్డలోని ఎవర్గ్రీన్ టెంట్ హౌస్ సమీపంలో 56 ఏళ్ల శ్రీనివాస్పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.