
మూడు రోజులపాటు భక్తితో కొలిచి, అంతకు మించిన ఉత్సాహంతో గణనాథుడిని సాగనంపేందుకు వెళ్లిన ఆ యువకులు ఊహించని ప్రమాదంలో చిక్కుకొని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. చెరువులో పడిపోయిన మిత్రుడిని కాపాడటానికి ప్రయత్నిస్తూ ఒకరి తర్వాత ఒకరు నీటిలో మునిగి ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.





