
ఆయిల్పామ్ సాగులో తెలంగాణ.. దేశంలోనే నంబర్వన్గా ఉందని వ్యవసాయ, ఉద్యానశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో వివిధ పథకాల కింద అదనంగా 2 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగులోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని తెలిపారు.





