వినాయక మండపంలో వినాయక విగ్రహాన్ని కదిలించడానికి ముందుగా పూజ చేయాలి. ఈ సమయంలో పూలు, పండ్లు, కొత్త బట్టలు, మోదక లడ్డూలను బొజ్జ గణపయ్య ముందు ఉంచాలి. అనంతరం హారతి ఇచ్చి, నైవేద్యాన్ని అందరికీ పంచాలి. అనంతరం ఒక తెల్లని గుడ్డలో ఐదు రకాల పండ్లను, పువ్వులను, మోదకం, తమలపాకులతో పాటు ఇతర వస్తువులను కట్టి గణేశుని విగ్రహం దగ్గర ఉంచాలి. ఆ తర్వాత రెండు చేతులతో నమస్కారం చేస్తూ స్వామి వారిని స్మరించుకోవాలి. నవరాత్రుల వేళ తాము ఏమైనా పొరపాట్లు చేసి ఉంటే క్షమించమని కోరుకోవాలి. ఐదు లేదా 9 సార్లు గుంజిళ్లు తీయాలి. గణేష్ మండపంలో వినాయక విగ్రహాన్ని కదలించడానికి ముందు "గణపతి బప్పా మోరియా.. జై బోలో గణేష్ మహారాజ్" అనే నినాదాలు చేయాలి. నిమజ్జనం చేసే సమయంలో ఈ మంత్రాలను పఠించాలి. ‘యంతు దేవగణః సర్వే పూజామాదయ మోమ్కీం ఇష్టకామసమృద్ధర్థం పునరపి పునరాగమనా చ||’’ ‘గచ్ఛ గచ్ఛ సురశ్రేష్ఠ స్వస్థానే పరమేశ్వర| మమ పూజా గృహీత్మేవం పునరాగమనాయ చ||’’ వినాయకుడిని ఏదైనా నది, చెరువు, సముద్రం ప్రాంతాలకు తీసుకెళ్లినప్పుడు ముందుగా గణేష్ విగ్రహానికి పూజారి చెప్పిన పద్ధతిలో పూజ చేయాలి. వినాయకుడికి సంబంధించిన వస్తువులన్నింటినీ నీటిలో వదిలేయాలి. అనంతరం స్వామి వారిని తలచుకుంటూ నమస్కారం చేయాలి. వచ్చే ఏడాది కూడా తమ కాలనీకి, ఇంటికి రావాలని కోరుకోవాలి. * గణపతి నిమజ్జనం సమయంలో ఇలాంటి పొరపాట్లను అస్సలు చేయొద్దు. గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసే ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో * వినాయకుడికి సంబంధించిన వస్తువులను విసిరేయకూడదు. * ఆ తర్వాత వినాయక విగ్రహాన్ని నెమ్మదిగా నీటిలోకి తీసుకెళ్లి నిమజ్జనం చేయాలి. * విగ్రహాన్ని వెనుక వైపు నుంచి నీటిలోకి వదలకూడదు. ముందుభాగం నుంచే నీళ్లలోకి వదలాలి. * నీళ్లలో దిగేటప్పుడు స్వామి వారి విగ్రహాలను కాళ్లతో తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గమనిక : ఇక్కడ అందించిన భక్తి, జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ వివరాలన్నీ పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.Read Latest Religion News and Telugu News