
Ap Govt Extends Pension Applications Till September 18: ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తుల గడువును సెప్టెంబర్ 18వ తేదీ వరకు పొడిగించింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి నేటితో గడువు ముగుస్తోంది.. సెప్టెంబర్ 18వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటే.. ఈ రెండు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచిస్తున్నారు.




