
దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి అంబిక. ఆమె ప్రస్థానం కేవలం నటిగా మాత్రమే కాకుండా, ఒక సోదరిగా, వ్యాపారవేత్తగా, తల్లిగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించారు. కేరళలోని కల్లార కుంజిన్ నాయర్, సరసమ్మ దంపతులకు జన్మించిన అంబిక, తన సోదరి రాధా కంటే ముందే వెండితెరకు పరిచయమయ్యారు. వారి తల్లి సరసమ్మ కేరళ కాంగ్రెస్ నాయకురాలిగా కూడా పనిచేశారు. మురళీ మోహన్ సరసన “అద్దాల మేడ” చిత్రంతో అంబిక తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్తో “విశ్వరూపం”, “బొబ్బిలి పులి” వంటి బ్లాక్బస్టర్ చిత్రాలలో నటించి, అగ్ర కథానాయికగా తన సత్తా చాటారు. ఏఎన్నార్తో “ప్రేమ మందిరం” వంటి చిత్రాలలో కూడా ఆమె నటించారు. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, మురళీ మోహన్, కృష్ణ రాజు వంటి అగ్ర హీరోలతో కలిసి పనిచేసిన అంబిక, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ తనదైన ముద్ర వేశారు.