
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. కువైట్, బహ్రెయిన్లలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది.
కువైట్లోని అలీ అల్ సేలం ఎయిర్బేస్, బహ్రెయిన్లోని పోర్ట్ సల్మాన్లో ఉన్న అమెరికా ఫిఫ్త్ ఫ్లీట్పై ఈ దాడులు జరిగినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ధృవీకరించింది. ఒక రోజు క్రితం అమెరికా తమ భూభాగంలోని ఐదు ప్రాంతాలపై దాడులు జరిపిందని, దానికి ప్రతీకారంగానే ఈ చర్యలు తీసుకున్నామని ఇరాన్ స్పష్టం చేసింది.హోర్ముజ్ జలసంధి సమీపంలో చమురు ట్యాంకర్పై ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడటంతో అమెరికా ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఈ దాడులు, ప్రతిదాడుల పరంపరతో ఇరు దేశాల మధ్య జూన్ 17న కుదిరిన 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా నీరుగారిపోయింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందం కుదిరింది. కానీ, తాజా పరిణామాలతో శాంతి ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఈ దాడులను కువైట్, బహ్రెయిన్ తీవ్రంగా ఖండించాయి. తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశాయి. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్వరంతో స్పందించారు. ఇరాన్ కనుక ఒప్పందాలను ఉల్లంఘిస్తూ దాడులకు పాల్పడితే, ఆ దేశం "ఇకపై ఉనికిలో ఉండదు" అని తీవ్రంగా హెచ్చరించారు. ఇరాన్ విదేశాంగ శాఖ మాత్రం అమెరికాయే ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటామని తేల్చి చెప్పింది. ఖతార్, యూఏఈ, జోర్డాన్ వంటి దేశాలు ఇరుపక్షాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశాయి. ఈ దాడుల్లో అమెరికా