కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి వివాదంలో చిక్కుకున్నారు. తన సొంత మంత్రిత్వ శాఖ పరిధిలోని పథకం ద్వారా ఆయన ఏకంగా రూ.99.03 లక్షల సబ్సిడీని పొందడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
దీనిని కొత్త తరహా అవినీతిగా అభివర్ణిస్తూ విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి.రాజస్థాన్లోని పర్బత్సర్ తహసీల్ పీహ్ గ్రామంలో గల చౌదరి కుటుంబ వ్యవసాయ క్షేత్రంలో వాణిజ్యపరంగా దోసకాయల సాగు నిమిత్తం ఈ సబ్సిడీ మంజూరైంది. జాతీయ ఉద్యానవన బోర్డు ఈ ప్రాజెక్టుకు 2026 మార్చి 11న తుది ఆమోదం తెలిపింది. మార్చి 30న సబ్సిడీ మొత్తం ఆయన బ్యాంక్ ఖాతాలో జమ అయింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ఈ జాతీయ ఉద్యానవన బోర్డుకు భగీరథ్ చౌదరి ఎక్స్-అఫీషియో వైస్-ప్రెసిడెంట్గా వ్యవహరిస్తుండటమే ఈ వివాదానికి ప్రధాన కారణమైంది.ఈ ఆరోపణలను మంత్రి భగీరథ్ చౌదరి తీవ్రంగా ఖండించారు. "నేను ఒక రైతును, చిన్నతనం నుంచే వ్యవసాయం చేస్తున్నాను. ఇందులో దాచాల్సింది ఏమీ లేదు. వేలాది మంది రైతులు పాలీహౌస్లు ఏర్పాటు చేసుకుని సబ్సిడీలు పొందుతున్నారు, నేను కూడా అదే నిబంధనల ప్రకారం పొందాను. దీనికోసం 2018లోనే దరఖాస్తు చేసుకున్నాను" అని ఆయన స్పష్టం చేశారు. తన ఫామ్లో తీసుకున్న రుణాలు, సబ్సిడీల వివరాలతో కూడిన బోర్డును అక్కడ ప్రదర్శిస్తున్నామని, ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు శిక్షణ కూడా ఇస్తున్నామని ఆయన వివరించారు.ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు దాడిని ఉద్ధృతం చేసింది. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్