
ఆరు గ్యారంటీలను వంద రోజుల్లోనే అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress) ప్రజలను మోసం చేసిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు.
వికారాబాద్ జిల్లా పరిగిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కొత్తగా పథకాలేవీ తేలేదన్నారు. రూ.12 వేల కోట్ల రీయింబర్స్మెంట్ ( Reimbursement)బకాయిలు ఉన్నాయని, విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నారని ఆరోపించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పిన రేవంత్, కనీసం లక్షాధికారులను చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం (Gold) కాదు.. తులం ఇనుము కూడా ఇవ్వదని ఎద్దేవా చేశారు.