
చందుర్తి : రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఎన్గల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాల్గవ వార్డు సభ్యుడు మెరుపుల రవి గౌడ్ (40) ఆర్థిక ఇబ్బందులతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడాడు.
స్థానికుల కథనం ప్రకారం.. రవి ఉపాధి నిమిత్తం అప్పు చేసి సౌదీ వెళ్లిడు. గల్ఫ్ లో సరైన పని లభించకపోవడంతో తిరిగి స్వదేశానికి వచ్చి గీతా కార్మికుడిగా వృత్తిని కొనసాగిస్తున్నారు.
తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపం చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉదయం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలిపారు. ఆరు నెలల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నాలుగో వార్డ్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. మృతునికి భార్య మంజుల, ఇద్దరు కుమారులు ఉన్నారు. రవి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.