
నందమూరి బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నేడు అమరావతిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ఏపీ మంత్రి, బాలకృష్ణ అల్లుడు నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ఛాన్ చేశారు. కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేశ్, నిర్మాత సురేశ్ బాబుతోపాటు మరికొందరు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్టులో ప్రారంభించి, 2027 వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం. ఈ వార్త చదివారా: పవన్ రెడీ.. ఓజీ 2 స్పెషల్ వీడియో రిలీజ్..