
బంగారం కొనాలనుకునే వారికి బులియన్ మార్కెట్ నుంచి అదిరిపోయే తీపి కబురు అందింది. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఒక్కసారిగా భారీగా దిగొచ్చాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కేవలం మూడు రోజుల వ్యవధిలోనే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు ఏకంగా రూ.7,850 మేర పతనం కావడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా కూడా బంగారం, వెండి ధరల్లో ఈ అనూహ్యమైన తగ్గుదల నమోదైనట్లు మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.నేటి బంగారం ధరల వివరాలు:తాజా మార్పుల ప్రకారం మార్కెట్‌లో 24 క్యారెట్ల మరియు 22 క్యారెట్ల పసిడి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): నేడు ఒక్కరోజే రూ.2,780 మేర పతనమై రూ.1,40,130 వద్దకు చేరింది. ఇందులో ఒక గ్రాము ధర ₹14,013గా ఉంది.22 క్యారెట్ల ఆభరణాల బంగారం (10 గ్రాములు): ఈ రోజు రూ.2,550 మేర తగ్గి రూ.1,28,450 పలుకుతోంది. దీని ప్రకారం ఒక గ్రాము ధర ₹12,845గా ఉంది.18 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): మార్కెట్‌లో దీని బేస్ వాల్యూ రూ.1,05,100 కాగా, ఒక గ్రాము ధర రూ.10,510 వద్ద కొనసాగుతోంది.Gold: దశాబ్దం చూడని పతనం.. అడ్డూఅదుపు లేకుండా పడిపోతున్న ధరలురూ.10,000 పతనమైన కిలో వెండి:బంగారంతో పాటే వెండి ధర కూడా మార్కెట్‌లో నిలువునా కూలిపోయింది. గత కొద్దికాలంగా భారీ రేటుతో ఉన్న వెండి.. ఇవాళ ఒక్కరోజే కిలోపై ఏకంగా రూ.10,000 మేర దిగొచ్చింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,30,000 మార్కుకు చేరుకుంది. దీని ప్రకారం చూస్తే ప్రస్తుతం ఒక గ్రాము వెండి ధర రూ.230గా పలుకుతోంది. అశోకుడి కాలం నాటి బంగారం, ఎర్రగుడి శాసనాలు సాక్షిగా జొన్నగిరి: సీఎం ముఖ్య గమనికతెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ ప్రాంతాలు, ప్రముఖ నగరాలను బట్టి స్థానిక పన్నుల కారణంగా ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా మార్కెట్‌లో ఇక్కడ పేర్కొన్న బేస్ వాల్యూ ధరలపై అదనంగా 3 శాతం జీఎస్టీ (GST), జ్యువెలరీ షాపుల మేకింగ్ ఛార్జీలు (తయారీ కూలి/తరుగు) అదనంగా వర్తిస్తాయని కొనుగోలుదారులు గమనించాలి.