
సూపర్ కంప్యూటర్ల రంగంలో చైనా మరోసారి సత్తా చాటింది. దాదాపు దశాబ్దం తర్వాత మళ్లీ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ను ఆవిష్కరించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
జర్మనీలోని హాంబర్గ్లో జరిగిన అంతర్జాతీయ సూపర్ కంప్యూటింగ్ కాన్ఫరెన్స్లో విడుదల చేసిన 'టాప్ 500' జాబితాలో చైనాకు చెందిన 'లైన్షైన్' సిస్టమ్ మొదటి స్థానంలో నిలిచింది. దీంతో ఇప్పటివరకు టాప్లో ఉన్న అమెరికాకు చెందిన 'ఎల్ క్యాపిటన్' రెండో స్థానానికి పడిపోయింది.షెన్జెన్లోని నేషనల్ సూపర్కంప్యూటింగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ లైన్షైన్ సిస్టమ్, సెకనుకు 2.198 ఎగ్జాఫ్లాప్ల వేగాన్ని నమోదు చేసింది. అమెరికాలోని లారెన్స్ లివర్మోర్ నేషనల్ ల్యాబొరేటరీలో ఉన్న ఎల్ క్యాపిటన్ (1.809 ఎగ్జాఫ్లాప్లు) కంటే ఇది సుమారు 20-22 శాతం అధికం. 2017లో సన్వే టైహులైట్ తర్వాత, చైనా ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలవడం ఇదే తొలిసారి. మూడేళ్ల తర్వాత ఈ జాబితాలో అడుగుపెట్టిన చైనా, నేరుగా నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.సొంత టెక్నాలజీతో సత్తాఅమెరికా టెక్నాలజీ ఆంక్షలు ఎదుర్కొంటున్న తరుణంలో, ఈ లైన్షైన్ సూపర్ కంప్యూటర్ను పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో నిర్మించడం చైనా సాధించిన అతిపెద్ద విజయంగా భావిస్తున్నారు. ఇందులో కస్టమ్ ఆర్మ్ వీ9 ఆధారిత లింగ్కున్ ఎల్ఎక్స్2 సీపీయూలు, సొంత ఇంటర్కనెక్ట్ టెక్నాలజీ, కైలిన్ ఆపరేటింగ్ సిస్టమ్ను ఉపయోగించారు. ఇందులో 1.37 కోట్ల కోర్ లు ఉన్నాయి. వాతావరణ మార్పుల అంచనా, ఇంజినీరింగ్, డ్రగ్ డిస్కవరీ, ఏఐ వంటి కీలక రంగాల్లో పరిశోధనలకు ఈ సూపర్ కంప్యూటర్ సేవలు అందిస్తుంది.అయితే, ఈ