
కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారు గనుల ప్రాజెక్టు బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టును ప్రారంభించి, ఇక్కడ ఉత్పత్తి అయిన తొలి బంగారాన్ని రాష్ట్రంలోని జ్యుయలరీ సంస్థలకు...
కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారు గనుల ప్రాజెక్టు బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టును ప్రారంభించి, ఇక్కడ ఉత్పత్తి అయిన తొలి బంగారాన్ని రాష్ట్రంలోని జ్యుయలరీ సంస్థలకు అందించారు. మన రాష్ట్రంలో వెలికితీసిన వనరుల ప్రయోజనాలు మన రాష్ట్రంలోని వారికే దక్కాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా, తొలి విడత బంగారాన్ని వాసవీ జ్యూయలర్స్, సాయి సంతోష్ జ్యుయలర్స్, మధుమూర్తి జ్యుయలర్స్, ఎమరాల్డ్ జ్యుయలర్స్ సంస్థలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా అందజేశారు.ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్న జియోమైసూర్ సంస్థ, ఇక్కడ వెలికితీసిన బంగారాన్ని రాష్ట్రంలోని వ్యాపారులకే విక్రయిస్తామని స్పష్టం చేసింది. స్థానిక ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమానికి ముందు, మైనింగ్ ప్రాంతంలో భారీ వాహనాలు నడిపేందుకు మహిళలు, యువతకు శిక్షణ ఇచ్చే సిమ్యులేటర్ కేంద్రాన్ని సీఎం సందర్శించారు. అనంతరం, ఖనిజంతో కూడిన మట్టిని తరలించే భారీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ ప్రాజెక్టుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.