
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్కు భారత మార్కెట్ అత్యంత కీలక కేంద్రంగా మారింది. కంపెనీ క్విక్-కామర్స్ విభాగంలో ప్రవేశపెట్టిన 'అమెజాన్ నౌ' సర్వీస్, దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న...
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్కు భారత మార్కెట్ అత్యంత కీలక కేంద్రంగా మారింది. కంపెనీ క్విక్-కామర్స్ విభాగంలో ప్రవేశపెట్టిన 'అమెజాన్ నౌ' సర్వీస్, దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపారంగా నిలిచిందని అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ వెల్లడించారు. ఈ సేవ ద్వారా వినియోగదారులు ఆర్డర్ చేసిన నిమిషాల వ్యవధిలోనే సరుకులు డెలివరీ అవుతుండటంతో దీనికి అనూహ్యమైన ఆదరణ లభిస్తోందని ఆయన తెలిపారు.భారత పర్యటనలో ఉన్న ఆండీ జెస్సీ, ముంబైలోని అత్యంత రద్దీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన 'అమెజాన్ నౌ' మైక్రో-ఫుల్ఫిల్మెంట్ సెంటర్ను సందర్శించారు. ఈ సందర్భంగా తన అనుభవాలను పంచుకుంటూ.. "భారత్లో ఉండటం, ముంబైలోని మైక్రో-ఫుల్ఫిల్మెంట్ సెంటర్ను సందర్శించడం చాలా బాగుంది. ప్రజలకు తక్షణం అవసరమయ్యే కిరాణా సరుకులు, షాంపూలు, బేబీ ప్రొడక్టులు వంటివి ఆర్డర్ చేసిన నిమిషాల్లోనే ప్యాక్ చేసి డెలివరీ చేస్తున్నారు" అని ఆయన ప్రశంసించారు.ఈ మైక్రో-ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలను ప్రత్యేకంగా నిత్యావసర వస్తువులను వేగంగా ప్యాక్ చేసి, డెలివరీ చేసేందుకు వీలుగా డిజైన్ చేశారు. ఈ సేవను ఉపయోగించడం ప్రారంభించిన ప్రైమ్ మెంబర్లు, తమ షాపింగ్ ఫ్రీక్వెన్సీని మూడు రెట్లు పెంచారని జెస్సీ గణాంకాలతో వివరించారు. భారత్లో ఈ సర్వీస్ ప్రారంభించినప్పటి నుంచి ప్రతి త్రైమాసికంలో ఆర్డర్ల సంఖ్య రెట్టింపు అవుతోందని ఆయన పేర్కొన్నారు.భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుతూ.. దేశంలో అతిపెద్ద 'డెలివరీ-ఇన్-మినిట్స్' నెట్వర్క్ను నిర్మించాలనే లక్ష్యంతో 'అమెజాన్ నౌ' సేవలను 300కు పైగా నగరాలకు విస్తరించనున్నట్లు జెస్సీ తెలిపారు. అంతేగాక భారత్లో క్విక్-కామర్స్ మోడల్ను నిర్మించడంలో నేర్చుకున్న పాఠాలు, ఆవిష్కరణలు