కోలీవుడ్ సూపర్స్టార్ రజనీకాంత్ తన 173వ ప్రాజెక్ట్ చుట్టూ నెలకొన్న సస్పెన్స్కు ఎట్టకేలకు తెరదించారు. ఈ క్రేజీ చిత్రానికి ‘ ధర్మన్: ది డెడ్లీ డాక్టర్ ’ అనే పవర్ఫుల్ టైటిల్ను ఖరారు
చేస్తూ చెన్నైలో బుధవారం గ్రాండ్గా పూజా కార్యక్రమాలతో సినిమాను లాంచ్ చేశారు. అయితే, ఈ ఈవెంట్లో సినిమా విశేషాల కంటే.. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న విపరీతమైన ట్రోలింగ్పై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర సంచలనంగా మారాయి.ఎలా ఉన్నా ట్రోలింగే ఇటీవలి కాలంలో తనపై వస్తున్న విమర్శలు, సోషల్ మీడియా ట్రోల్స్పై రజనీకాంత్ ఈ వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బహిరంగంగా మాట్లాడాలంటేనే భయమేస్తోందని ఆయన కుండబద్దలు కొట్టారు. "ఈ రోజుల్లో వేదికపైకి వచ్చి మాట్లాడాలంటే భయంగా ఉంది. ఎందుకంటే నేను మాట్లాడితే అది నాకు కాకపోయినా, మీకు సమస్యగా మారుతుంది. ఒకవేళ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటే.. 'ఎందుకు మౌనంగా ఉన్నాడు?' అంటూ ఎగతాళి చేస్తారు. సరే అని మాట్లాడితే.. 'ఇప్పుడు ఎందుకు మాట్లాడాడు? అస్సలు మాట్లాడకుండా ఉండాల్సింది' అని విమర్శిస్తారు. మాట్లాడినా సమస్యే, మాట్లాడకపోయినా సమస్యే అవుతోంది" అని రజనీకాంత్ ఆవేదన చెందారు.* సర్జికల్ బ్లేడ్తో నయా అవతారం... ‘ధర్మన్: ది డెడ్లీ డాక్టర్’గా రాబోతున్న సూపర్స్టార్చాలా ఏళ్ల అనుభవం తర్వాత తనకు ఒక విషయం స్పష్టంగా అర్థమైందని చెప్తూ.. "మనల్ని ఇష్టపడని వాళ్లకు మనం ఏం చేసినా నచ్చదు. అలాగే మనల్ని ఇష్టపడేవాళ్లు మనం ఏం చేసినా మెచ్చుకుంటారు అనుకోవడం కూడా మూర్ఖత్వమే. ప్రతి ఒక్కరూ మనల్ని ఎప్పుడూ పొగుడుతూనే ఉండాలని ఆశించడం కరెక్ట్ కాదు. అందరూ జాగ్రత్తగా ఉండాలి" అంటూ అందరికీ హితవు పలికారు. నలుగురు దర్శకులు మారిన ‘ధర్మన్’!ఇదే వేదికపై రజనీకాంత్ సినిమా డైరెక్టర్లు మారిన సస్పెన్స్ను కూడా సరదాగా పంచుకున్నారు. ఈ కథ ఇప్పటివరకూ ముగ్గురు కాదు.. ఏకంగా నలుగురు దర్శకుల చేతులు మారిందని నవ్వుతూ చెప్పారు. మొదట కె.ఎస్. రవికుమార్, ఆ తర్వాత సుందర్ సి, ఆపై సిబి చక్రవర్తి పేర్లు పరిశీలనలోకి వచ్చాయన్నారు. ముఖ్యంగా సిబి చక్రవర్తి అనుకున్న న్యూక్లియర్ సైంటిస్ట్ కథ చాలా బాగున్నప్పటికీ, అది అఫ్గానిస్తాన్, రష్యా నేపథ్యంలో సాగే భారీ సెన్సిటివ్ సబ్జెక్ట్ కావడం వల్ల సమయం పడుతుందని దాన్ని వాయిదా వేశారు. చివరకు ఈ ప్రాజెక్ట్ యంగ్ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు చేతుల్లోకి వచ్చింది. రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్పై కమల్ హాసన్ , ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రజనీకాంత్ సరసన సిమ్రాన్ నటిస్తుండగా, రాశి ఖన్నా, యోగి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.