తెలుగు చలనచిత్ర పరిశ్రమలో క్లాసిక్ సినిమాలతో తనదైన వేసుకున్న సీనియర్ దర్శకుడు గీతాకృష్ణ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి.
ఇటీవల విడుదలైన ‘పెద్ది’ సినిమా స్క్రీన్ప్లే, మేకింగ్ స్టైల్తో పాటు ప్రస్తుత ట్రెండ్స్పై ఆయన కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. అంతేకాదు, ఆ సినిమాలోని ఒక ముఖ్యమైన సన్నివేశం తన సినిమా నుంచే కాపీ కొట్టారంటూ సంచలన ఆరోపణ చేశారు. ‘కోకిల’ సీన్ కాపీ ఈ ఇంటర్వ్యూలో గీతాకృష్ణ ప్రధానంగా ఒక వివాదాస్పద అంశాన్ని తెరపైకి తెచ్చారు. ‘పెద్ది’ సినిమాలో హీరోయిన్ తనకు తానుగా తాళి కట్టుకునే ఒక కీలక సన్నివేశం ఉంది. అయితే, ఈ సీన్ 1989లో తాను రూపొందించిన క్లాసిక్ హిట్ చిత్రం ‘కోకిల’ నుండి డైరెక్టర్ బుచ్చిబాబు కాపీ కొట్టాడని ఆయన బాంబ్ పేల్చారు. బయోపిక్ కాదు.. డాక్యుమెంటరీలా ఉంది!సినిమా విశ్లేషణ విషయానికి వస్తే.. ‘పెద్ది’ చిత్రాన్ని ఒక కమర్షియల్ బయోపిక్గా కాకుండా డాక్యుమెంటరీ తరహాలో సాగదీశారని గీతాకృష్ణ అభిప్రాయపడ్డారు. పల్లెటూరి నేపథ్యం, కూలీల కష్టాలు, వారి జీవితాల్లోని డ్రామాను ఎంచుకోవడం మంచిదే అయినప్పటికీ, కథనంలో స్పష్టమైన ఫార్మాట్ లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్గా మారిందని విమర్శించారు. "ఇలాంటి వైవిధ్యమైన ప్రయత్నాలు చేయడం యువ దర్శకులకు మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్సే. కానీ, పక్కా కమర్షియల్ బాక్సాఫీస్ ఫార్ములాను విస్మరించి, ప్రేక్షకులను మెప్పించడం అంత సులువు కాదు" అని అభిప్రాయపడ్డారు. సాధారణంగా తెలుగు ప్రేక్షకులు బయోపిక్లలో హీరో ప్రయాణం, ఎమోషన్స్, గెలుపోటములు, చివర్లో వచ్చే ఇన్స్పైరింగ్ క్లైమాక్స్ ఆశిస్తారని.. కానీ ‘పెద్ది’ ఆ అంచనాలకు భిన్నంగా వెళ్లడం వల్లే సాధారణ ఆడియన్స్కు కనెక్ట్ కావడం కష్టంగా మారిందని ఆయన విశ్లేషించారు.సినిమాలోని నటీనటుల ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. ముఖ్యంగా హీరోయిన్ జాన్వీ క్యారెక్టరైజేషన్ను ప్రస్తావించారు. ఆ పాత్ర కోసం ఆమె పడిన కష్టం స్క్రీన్పై కనిపించినప్పటికీ, గ్రూమింగ్ విషయంలో ఇంకా పర్ఫెక్షన్ ఉండాల్సిందని అన్నారు. "షూటింగ్ సమయంలోనే నన్ను సంప్రదించి ఉంటే, ఆ పాత్రను మరింత అద్భుతంగా ఎలివేట్ చేయడానికి సరైన గైడెన్స్ ఇచ్చేవాడిని. అయితే, అందుకోసం నేను ఇతరుల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తాననుకోండి" అంటూ నవ్వుతూనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గీతాకృష్ణ సినీ ప్రస్థానందిగ్గజ దర్శకుడు కె. విశ్వనాథ్ శిష్యుడిగా, 'సాగర సంగమం', 'స్వాతి ముత్యం' వంటి ఐకానిక్ చిత్రాలకు పనిచేసిన అనుభవం గీతాకృష్ణ సొంతం. అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన 'సంకీర్తన' (1987) చిత్రంతో దర్శకుడిగా పరిచయమై, మొదటి సినిమాతోనే ఉత్తమ నూతన దర్శకుడిగా నంది అవార్డు అందుకున్నారు. శాస్త్రీయ సంగీతం, మానవ మనస్తత్వాల నేపథ్యంలో ఆయన తెరకెక్కించిన సంకీర్తన, కోకిల, కీచురాళ్ళు, ప్రియతమ, సర్వర్ సుందరం గారి అబ్బాయి, కాఫీ బార్ వంటి చిత్రాలు ఇప్పటికీ క్లాసిక్స్గా నిలిచాయి. సినిమా ఇండస్ట్రీలోని లోపాలపై, నటీనటుల శైలిపై ఎప్పటికప్పుడు నిర్మొహమాటంగా మాట్లాడే గీతాకృష్ణ చేసిన ఈ తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. దీనిపై 'పెద్ది' చిత్రబృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.