
హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో వన్వే ట్రాఫిక్ ట్రయల్ రన్ విధానాన్ని పోలీసులు అమలు చేశారు. ఈరోజు (ఆదివారం) ఉదయం 10 గంటలకు ట్రయల్ రన్ ప్రారంభమైంది.
ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ చెక్ పోస్టు మీదుగా వాహనాలను అనుమతించడం లేదు.
హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో వన్వే ట్రాఫిక్ ట్రయల్ రన్ విధానాన్ని పోలీసులు అమలు చేశారు. ఈరోజు (ఆదివారం) ఉదయం 10 గంటలకు ట్రయల్ రన్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ చెక్ పోస్టు మీదుగా వాహనాలను అనుమతించడం లేదు. పంజాగుట్ట వైపు నుంచి మాదాపూర్ వెళ్లాల్సిన వాహనాలను బసవతారకం ఆస్పత్రి, ఫిల్మ్ నగర్ రోడ్ నంబర్ 45 మీదుగా దారి మళ్లిస్తున్నారు. ట్రాఫిక్ మార్పుల నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.