
సింహాచలం: తన భార్య అనుమానాస్పద మృతి కేసులో ఉత్తరాఖండ్ పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తున్నట్లు రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ తెలిపారు.
భార్య మరణానంతర కార్యక్రమాలు నిర్వహించేందుకు సింహాచలానికి వచ్చిన ఆయన మాట్లాడారు. ‘‘గాయత్రి మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఆ రోజు రాత్రి మేం వైన్ తాగాం. ఉదయం లేచి చూసే సరికి అంతా జరిగిపోయింది. పోస్ట్మార్టం నివేదిక ఆధారంగా వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. అప్పటి వరకు నేనేమీ మాట్లాడలేను’’ అని అన్నారు.
విజయనగరం జిల్లా మామిడిపల్లికి చెందిన రాధా గాయత్రికి గతేడాది నవంబర్లో విశాఖకు చెందిన శ్రీచరణ్తో వివాహమైంది. ఇద్దరు కలిసి ఇటీవల విహార యాత్రకు వెళ్లగా.. ఉత్తరాఖండ్లోని దేహ్రాదూన్లో ఆమె విగతజీవిగా మారింది. తమ అల్లుడు ముమ్మాటికీ సైకో అని.. అలా ప్రవర్తించే తమ కుమార్తెను బలి తీసుకున్నాడని రాధా గాయత్రి తల్లిదండ్రులు వాపోయారు. నిరంతర వేధింపులు, మానసిక ఒత్తిడి కారణంగా తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
స్టార్టప్ల వద్దకు మంత్రులే వెళ్లి తమ రాష్ట్రాల్లో ఉన్న సౌకర్యాలు, రాయితీలను వివరించాలని ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) సూచించారు.