
హైదరాబాద్లోని హయత్నగర్కు చెందిన మణిదీప్ రెడ్డి గుజ్జా (Manideep Reddy Gujja) ఉన్నత చదువుల కోసం ఫిన్లాండ్ (Finland)కు వెళ్లాడు. లాహ్టి నగరంలోని ఎల్యూటీ యూనివర్సిటిలో విద్యను అభ్యసిస్తున్నాడు. అయితే మే నెల 5వ తేదీ నుంచి మణిదీప్ రెడ్డి కుటుంబ సభ్యులకు అందుబాటులో లేకపోయినట్లు తెలుస్తోంది.
అతని ఆచూకీ కోసం పలు ప్రయత్నాలు చేసిన మణిదీప్ రెడ్డి తల్లిదండ్రులు చివరకు తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మణిదీప్ రెడ్డి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశం పొందిన తర్వాత 2025 మార్చిలో ఫిన్లాండ్కు వెళ్లారు.
మణిదీప్ రెడ్డి చివరగా ఈ ఏడాది మే 5న తన తల్లితో మాట్లాడారు. తాను ఒక బేకరీలో ఉన్నానని, త్వరలోనే తాను అక్కడ నివాసం ఉండే చోటుకు తిరిగి వెళ్తానని చెప్పారు. ఆ తర్వాత అతను కనిపించకుండా పోయారు. అప్పటి నుంచి అతని గురించి ఎలాంటి సమాచారం అందుబాటులో లేరు.
ఆ తర్వాత అతనిని సంప్రదించడానికి చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి. అలాగే స్నేహితులు, రూమ్మేట్లతో కలిసి చేసిన ప్రయత్నాలు ఎటువంటి సమాచారాన్ని ఇవ్వలేదు. తమ ఫిర్యాదులపై అధికారులు తగిన విధంగా స్పందించలేదని మణిదీప్ తల్లి దండ్రులు ఆరోపించారు.
మణిదీప్ ఆచూకీకి సంబంధించి కాలేజీ (College) యాజమాన్యాన్ని, సిబ్బందిని పలుమార్లు సంప్రదించినప్పటికీ స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్సేన్ రెడ్డి (Vijaysen Reddy) విచారణ చేపట్టారు.
ఈ విచారణ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం తరఫున ఎన్వీఆర్ రాజ్యలక్ష్మీ హాజరయ్యారు. ఫిన్లాండ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారన తెలిపారు. 29 వరకు మణిదీప్ రెడ్డి కుటుంబానికి సమాచారం అందించామని, సంబంధిత అధికారుల నుండి తదుపరి వివరాలు సేకరిస్తామని ఆమె చెప్పారు.
, దాని కాన్సులర్ విభాగం, తెలంగాణ పోలీసులు, ఇతర అధికారులకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను జూన్ 24కి వాయిదా వేశారు.
ఈ వివరాలను నమోదు చేసుకున్న జస్టిస్ విజయసేన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం, ఫిన్లాండ్లోని భారత రాయబార కార్యాలయం