
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కోసం మానవీయ నిర్ణయాన్ని తీసుకుంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ ఏకంగా 776 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
దాంతో త్వరలో జరగబోయే ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల కోసం భారత సీనియర్ టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. అయితే వయసు రీత్యా వైభవ్ ఇంకా చాలా చిన్న పిల్లాడు కావడంతో, ఈ విదేశీ పర్యటనలో అతడితో పాటు తల్లిదండ్రులు కూడా వెళ్లడానికి బీసీసీఐ ప్రత్యేక అనుమతి ఇచ్చింది.ఈ నిర్ణయం గురించి బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా మాట్లాడుతూ..
వైభవ్ ఇప్పుడే పాఠశాల చదువు పూర్తి చేసుకుని వచ్చాడని, అంతర్జాతీయ క్రికెట్ వాతావరణానికి అలవాటు పడటానికి అతడికి కుటుంబ సభ్యుల మానసిక మద్దతు ఎంతో అవసరమని పేర్కొన్నాడు. అందువల్ల అతడి తల్లిదండ్రుల ప్రయాణ, వసతి, ఇతర అన్ని రకాల ఖర్చులను బోర్డే పూర్తిగా భరిస్తుందని స్పష్టం చేశారు.
చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయి ఒత్తిడిని తట్టుకుని, కొత్త వాతావరణంలో వైభవ్ సులభంగా సెట్ అవ్వడానికి ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని బోర్డు భావిస్తోంది. కొడుకు ఎదుగుదలకు తల్లిదండ్రులు అందిస్తున్న మద్దతును సైకియా అభినందించారు.భారత జట్టు ఈ జూన్ చివరి వారంలో ఐర్లాండ్తో బెల్ఫాస్ట్లో రెండు టీ20 మ్యాచ్లు ఆడనుంది.
ఆ తర్వాత జులైలో ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడనుంది. గతంలో అండర్-19 ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన వైభవ్