అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. ఇటీవల ఫ్రాన్స్లో జరిగిన జీ-7 సదస్సు సందర్భంగా తనతో ఫోటో దిగేందుకు మెలోనీ ప్రాధేయపడ్డారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దౌత్య వివాదానికి దారితీశాయి.
ట్రంప్ వ్యాఖ్యలపై ఇటలీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దీనికి నిరసనగా తమ విదేశాంగ మంత్రి అమెరికా పర్యటనను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.ఇటలీకి చెందిన లా-7 టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
"ఆమె నాతో ఫోటో దిగాలని ఎంతగానో ఆశించారు. నన్ను బతిమాలారు. నిజానికి నేను ఆమెతో మాట్లాడాల్సిన అవసరం లేకపోయినా, జాలితో ఫోటో దిగాను" అని ట్రంప్ పేర్కొన్నారు.ఈ వ్యాఖ్యలపై ఇటలీ ప్రధాని మెలోనీ 'ఎక్స్' వేదికగా ధీటుగా స్పందించారు.
"ట్రంప్ చెబుతున్నవన్నీ కల్పితాలని, నేను గానీ, నా దేశం ఇటలీ గానీ ఎవరినీ బతిమాలుకోవడం అంటూ జరగదు" అని ఆమె స్పష్టం చేశారు. మిత్రపక్షాల పట్ల ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ప్రత్యర్థుల పట్ల మృదువుగా వ్యవహరించడం ఆశ్చర్యకరమని ఆమె విస్మయం వ్యక్తం చేశారు.ఈ ఉదంతంపై ఇటలీ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ట్రంప్ వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమని, అవి యావత్ ఇటలీని అవమానించేలా ఉన్నాయని పేర్కొంటూ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ జూన్ 21-22 తేదీల్లో జరగాల్సిన తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. రక్షణ మంత్రి గైడో క్రొసెట్టో సహా ఇతర మంత్రులు సైతం ట్రంప్ తీరును తీవ్రంగా