
తెలంగాణలో రైతులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రైతు భరోసా (Rythu Bharosa ) నిధుల విడుదలపై ప్రభుత్వం ఇవాళ క్లారిటీ ఇచ్చింది. ఈసారి రైతు భరోసా నిధుల్ని ఈ నెల 30న విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇవాళ సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
అలాగే రైతు భరోసా నిధుల్ని సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా మధిరలో ఈ నెల 30న జరిగే సభలో విడుదల చేస్తారని ప్రభుత్వం తెలిపింది. దీంతో రైతుల ఖాతాల్లో నిధులు నేరుగా జమ కాబోతున్నాయి.తెలంగాణ నూతన సీఎస్ గా - రేవంత్ ఛాయిస్..!!ఇవాళ సచివాలయంలో కేబినెట్ మంత్రులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలపై చర్చించారు.
ఇందులో వర్షాకాలం నేపథ్యంలో ఇస్తున్న రైతు భరోసా నిధులు కూడా ఒకటి. కేంద్రం త్వరలో పీఎం కిసాన్ నిధుల్ని విడుదల చేస్తున్న నేపథ్యంలో తమ వాటాగా ఇచ్చే నిధుల్ని ఈ నెల 30న విడుదల చేస్తే బాగుంటుందని మంత్రులు సూచించడంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అలాగే ఖరీఫ్ సీజన్ లో సాగు, ధాన్యం కొనుగోళ్లు వంటి అంశాలపైనా మంత్రులతో రేవంత్ చర్చించారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్.. రేవంత్ మార్క్ విద్యా విప్లవం
తెలంగాణలో రైతులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రైతు భరోసా (Rythu Bharosa ) నిధుల విడుదలపై ప్రభుత్వం ఇవాళ క్లారిటీ ఇచ్చింది. ఈసారి రైతు భరోసా నిధుల్ని ఈ నెల 30న విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇవాళ సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అలాగే రైతు భరోసా నిధుల్ని సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా మధిరలో ఈ నెల 30న జరిగే సభలో విడుదల చేస్తారని ప్రభుత్వం తెలిపింది. దీంతో రైతుల ఖాతాల్లో నిధులు నేరుగా జమ కాబోతున్నాయి.తెలంగాణ నూతన సీఎస్ గా - రేవంత్ ఛాయిస్..!!ఇవాళ సచివాలయంలో కేబినెట్ మంత్రులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలపై చర్చించారు. ఇందులో వర్షాకాలం నేపథ్యంలో ఇస్తున్న రైతు భరోసా నిధులు కూడా ఒకటి. కేంద్రం త్వరలో పీఎం కిసాన్ నిధుల్ని విడుదల చేస్తున్న నేపథ్యంలో తమ వాటాగా ఇచ్చే నిధుల్ని ఈ నెల 30న విడుదల చేస్తే బాగుంటుందని మంత్రులు సూచించడంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఖరీఫ్ సీజన్ లో సాగు, ధాన్యం కొనుగోళ్లు వంటి అంశాలపైనా మంత్రులతో రేవంత్ చర్చించారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్.. రేవంత్ మార్క్ విద్యా విప్లవం.