
Breakfast scheme: సుదీర్ఘ వేసవి సెలవుల తరువాత తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభాన్ని ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లతో ఘనంగా నిర్వహించింది. ఈసారి విద్యార్థులకు చదువుతో పాటు ఉదయం అల్పాహారం అందించే కొత్త ‘బ్రేక్ఫాస్ట్ స్కీం’ను ప్రభుత్వం ఇవాళ్టినుంచే అట్టహాసంగా ప్రారంభించింది.
ఈ పథకం ద్వారా విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది. కార్పొరేట్ పాఠశాలలకు సమానంగా పోషక విలువలతో కూడిన అల్పాహారాన్ని రోజువారీగా అందించనున్నారు. Read also: Congress Party : తెలంగాణ లో వెనుకటి రోజులు తీసుకొచ్చిన కాంగ్రెస్ – KTR ప్రభుత్వం వారంలో ఆరు రోజులకు భిన్నమైన టిఫిన్ మెనూను రూపొందించింది: రోజుకు మూడు రోజులు పాలు, మిగిలిన మూడు రోజులు రాగి జావ ఇవ్వడం ద్వారా పిల్లలకు అవసరమైన పోషకాలను అందించనున్నారు.
పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే విద్యార్థులకు కొత్త పాఠ్యపుస్తకాలు మరియు రెండు జతల యూనిఫాంలు అందించేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్యార్థులు కొత్త వస్తువులతో ఆనందంగా పాఠశాలలకు హాజరయ్యారు. ఉదయం అల్పాహారం, కొత్త పుస్తకాలు, యూనిఫాంలతో బడులు ప్రారంభం కావడంతో విద్యార్థులు మరియు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ బ్రేక్ఫాస్ట్ పథకానికి సుమారు రూ.540 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా, పాల సరఫరాకు అదనంగా రూ.150 కోట్లు వ్యయం అవుతుంది. మొత్తం విద్యా సంవత్సరానికి దాదాపు రూ.720 కోట్లు కేటాయించినట్లు సమాచారం. Nishant Tomar: ఢిల్లీలో పోలీస్ జాబ్ వదిలి..ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్ గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం.
మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Congress Party : తెలంగాణ లో వెనుకటి రోజులు తీసుకొచ్చిన కాంగ్రెస్ – KTR Pawan Kalyan visits ailing fan Niranjan : ఇద్దరం కలిసి ‘OG’
చూద్దాం.. నిరంజన్ కు పవన్ హామీ
Khammam : ముగ్గురు మంత్రులు మోసగాళ్లే – కేటీఆర్
CM Revanth : రేవంత్ చేతగానితనం వల్లే తెలంగాణ లో బాబు, పవన్ రాజకీయాలు – కవిత
Jowar Purchase Center Medak: జొన్నల కొనుగోలు కేంద్రంలో లారీల కొరత.. రైతుల రాస్తారోకో
Vijay Devarakonda: విజయ్ దేవరకొండకు టీసీఏ లీగల్ నోటీసు.. ఎందుకు?